ETV Bharat / state

నేడు కొడంగల్​లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన - రూ.3,961 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన - CM Revanth Kodangal Tour

CM Revanth Reddy Kodangal Tour : నేడు సీఎం రేవంత్​ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్​లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

CM Revanth Reddy
CM Revanth Reddy Visit to Kodangal Today
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 7:00 AM IST

CM Revanth Reddy Kodangal Tour : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్​ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్​(Kodangal)లో నేడు పర్యటించనున్నారు. తొలిసారి అక్కడకు వెళ్లనున్న ఆయన, నారాయణపేట జిల్లా కోస్గిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్​ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం కొడంగల్​ - నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. రూ.2,945 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు రోడ్ల విస్తరణ, గ్రామాలకు బీటీ రోడ్లు, జూనియర్ కళాశాలలు, హాస్టల్​ భవన నిర్మాణాలు, పశు వైద్య కళాశాల, ఇంజినీరింగ్​ కళాశాల, మెడికల్​, నర్సింగ్​, ఫిజియోథెరపీ కళాశాలలు, సీహెచ్​సీని 220 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరణ సహా సుమారు రూ.3,961 కోట్లకు పైగా పనులకు సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కోస్గిలోని పోలీస్​ స్టేషన్​ ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొననున్నారు.

కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు - తెలంగాణ ప్రజల నమ్మకం : సీఎం రేవంత్​ రెడ్డి

CM Revanth Reddy Kodangal Tour Today : ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. తొలిసారిగా సీఎం రేవంత్​ కొడంగల్​ రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సైతం బహిరంగ సభ(CM Revanth Reddy Sabha)కు వేలాదిగా హాజరుకానున్నారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 31,849 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి పట్నం నరేందర్​ రెడ్డిపై రేవంత్​ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొడంగల్​ నుంచి గెలుపొంది, రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇప్పుడు అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తుండడం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉన్నా, కొన్ని అత్యవసర కారణాలతో రెండుసార్లు పర్యటనను వాయిదా వేస్తూ వచ్చారు. రాష్ట్రానికి నిధులు, లోక్​సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఖరారు వంటి విషయాల కోసం దిల్లీ వెళ్లిన సీఎం రేవంత్​ పర్యటన ముగిసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​తో సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు రాష్ట్రానికి నిధుల సేకరణలో పలువురు కేంద్రమంత్రులను సీఎం కలిశారు. ఇప్పటికే 'తెలంగాణ మాస్టర్​ ప్లాన్​ 2050' విజన్​ అంటూ రేవంత్​ రెడ్డి స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేశారు. శాసనసభ ఎన్నికల్లో కొడంగల్​ నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలను సీఎం ఇచ్చారు. ఇప్పుడు వాటిని నిలబెట్టుకునే పనిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు.

తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్​రెడ్డి

'పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే మా ఉద్దేశ్యం' - అసెంబ్లీలో కులగణన తీర్మానం ఆమోదం

CM Revanth Reddy Kodangal Tour : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్​ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్​(Kodangal)లో నేడు పర్యటించనున్నారు. తొలిసారి అక్కడకు వెళ్లనున్న ఆయన, నారాయణపేట జిల్లా కోస్గిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్​ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం కొడంగల్​ - నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. రూ.2,945 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు రోడ్ల విస్తరణ, గ్రామాలకు బీటీ రోడ్లు, జూనియర్ కళాశాలలు, హాస్టల్​ భవన నిర్మాణాలు, పశు వైద్య కళాశాల, ఇంజినీరింగ్​ కళాశాల, మెడికల్​, నర్సింగ్​, ఫిజియోథెరపీ కళాశాలలు, సీహెచ్​సీని 220 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరణ సహా సుమారు రూ.3,961 కోట్లకు పైగా పనులకు సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కోస్గిలోని పోలీస్​ స్టేషన్​ ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొననున్నారు.

కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు - తెలంగాణ ప్రజల నమ్మకం : సీఎం రేవంత్​ రెడ్డి

CM Revanth Reddy Kodangal Tour Today : ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. తొలిసారిగా సీఎం రేవంత్​ కొడంగల్​ రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సైతం బహిరంగ సభ(CM Revanth Reddy Sabha)కు వేలాదిగా హాజరుకానున్నారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 31,849 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి పట్నం నరేందర్​ రెడ్డిపై రేవంత్​ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొడంగల్​ నుంచి గెలుపొంది, రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇప్పుడు అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తుండడం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉన్నా, కొన్ని అత్యవసర కారణాలతో రెండుసార్లు పర్యటనను వాయిదా వేస్తూ వచ్చారు. రాష్ట్రానికి నిధులు, లోక్​సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఖరారు వంటి విషయాల కోసం దిల్లీ వెళ్లిన సీఎం రేవంత్​ పర్యటన ముగిసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​తో సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు రాష్ట్రానికి నిధుల సేకరణలో పలువురు కేంద్రమంత్రులను సీఎం కలిశారు. ఇప్పటికే 'తెలంగాణ మాస్టర్​ ప్లాన్​ 2050' విజన్​ అంటూ రేవంత్​ రెడ్డి స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేశారు. శాసనసభ ఎన్నికల్లో కొడంగల్​ నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలను సీఎం ఇచ్చారు. ఇప్పుడు వాటిని నిలబెట్టుకునే పనిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు.

తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్​రెడ్డి

'పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే మా ఉద్దేశ్యం' - అసెంబ్లీలో కులగణన తీర్మానం ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.