CBI Case on Mega Engineering Company : బిల్లుల మంజూరు కోసం లంచం ఇచ్చిన అభియోగంపై హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఇంజినీరింగ్ కంపెనీ మేఘాపై ఛత్తీస్గఢ్లో సీబీఐ కేసు నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ), మెకాన్ సంస్థల అధికారులకు రూ.78 లక్షల ముడుపులు ఇచ్చి రూ.174 కోట్ల బిల్లులు పొందినట్లు సీబీఐ అభియోగించింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీతో పాటు ఆ సంస్థ జీఎం సుభాష్ చంద్ర సంగ్రాస్ పేర్లను ఎఫ్ఐఆర్లో సీబీఐ చేర్చింది.
సీబీఐ కస్టడీలో కవిత - వారి వాంగ్మూలాల ప్రకారం విచారణ! - Kavitha cbi Arrest in Liquor Scam
Mega Engineering Company Case : మేఘా సంస్థ(Mega Engineering Company)కు చెందిన ఎనిమిది మంది ఎన్ఎండీసీ, ఇద్దరు మెకాన్ సంస్థల అధికారులనూ నిందితులుగా కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఛత్తీస్గఢ్ జగదల్ పూర్లోని నగర్ నార్ స్టీల్ ప్లాంట్లో రూ.314 కోట్లతో బావి, పంప్ హౌజ్, పైప్లైన్ సిస్టం నిర్మించి అయిదేళ్ల పాటు నిర్వహించేందుకు మేఘా కంపెనీతో ఎన్ఎండీసీ 2015 జనవరి 23న ఒప్పందం చేసుకుంది. స్టీల్ ప్లాంటు ప్రాజెక్టు నిర్వహణ, నిర్మాణాల పర్యవేక్షణ బాధ్యతను రాంచీలోని మెకాన్ లిమిటెడ్(Macon Ltd Company)కు ఎన్ఎండీసీ అప్పగించింది.
సందేశ్ఖాలీ అల్లర్లపై CBI విచారణ- కలకత్తా హైకోర్టు కీలక ఆదేశం - Sandeshkhali Case CBI
CBI Enquiry on Mega Engineering Company : కాంట్రాక్టుకు సంబంధించిన మేఘా కంపెనీకి 2018 నుంచి 2020 మధ్య రూ.174 కోట్ల బిల్లులు మంజూరయ్యాయి. అయితే ఈ బిల్లుల మంజూరు కోసం మేఘా కంపెనీ ఎన్ఎండీసీ(NMDC) మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ దత్, డైరెక్టర్ దిలీప్ కుమార్ మొహంతి, నగర్ నార్ స్టీల్ ప్లాంట్ డీజీఎం ప్రదీప్ కుమార్ భూయాన్లు, నరేష్ కుమార్, సీనియర్ మేనేజర్ సువ్రో బెనర్జీ, సీజీఎం ఎల్.కృష్ణమోహన్, జీఎం కె.రాజశేఖర్, మేనేజర్ సోమనాథ్ ఘోష్లకు రూ.73,85,000లు మెకాన్ మాజీ ఏజీఎం సంజీవ్ సహాయ్, మాజీ డీజీఎం కె.ఇల్లవరసులకు రూ.5 లక్షలు లంచం ఇచ్చినట్లు అభియోగించింది.
Mega Engineering Organization Case : గతేడాది ఏప్రిల్ 1న ఎన్ఎండీసీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతేడాది ఆగస్టు 10 నుంచి సీబీఐ ప్రాథమిక విచారణ జరిపింది. ప్రాథమిక విచారణలో తేలిన అంశాల ప్రకారం కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని సిఫార్సు చేసింది. దీంతో ఛత్తీస్గఢ్ సీబీఐ రంగంలోకి దిగింది. అనంతరం గత నెల 31న ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.