ETV Bharat / state

ప్రజాపాలన పేరిట ప్రతీకారం - జీతం ఇవ్వడం లేదని వస్తే ఉద్యోగమే ఊడగొట్టారు : కేటీఆర్‌ - KTR Severely Criticized Prajavani

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 11:36 AM IST

Updated : Aug 28, 2024, 12:42 PM IST

KTR Comments On Congress Party : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక ఆర్భాటాలు ఎక్కువయ్యాయని, పాలన అటకెక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. ప్రజాపాలన పేరిట ప్రతీకార పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా కేటీఆర్ స్పందించారు.

KTR Tweets On State Issues
KTR Severely Criticized Prajavani (ETV Bharat)

KTR Strongly Criticized The Prajavani Program : సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మేడ్చల్ జిల్లాకు చెందిన రేణుక అనే మహిళ జీతం సరిగా రావటం లేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. అయితే ఫిర్యాదు చేయడంతో సంబంధిత ఏజెన్సీ ఆమెను ఉద్యోగంలోంచి తొలగించిందని వెల్లడించారు. ఈ ప్రభుత్వానికి ఆర్భాటం ఎక్కువ, పరిష్కారం తక్కువ అని ఎక్స్​లో పోస్ట్ చేశారు.

ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రతీకార పాలన అని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటివరకు మీ ప్రభుత్వంలో ఎంతమంది పేదలకు ప్రజాదర్బార్ వల్ల సమస్యలు పరిష్కారం అయ్యాయో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేణుకను ఉద్యోగంలోంచి తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

ఓటుకు నోటు కేసులో నేటికీ సీఎం రేవంత్‌రెడ్డి బెయిల్​పైనే : బీఆర్ఎస్, బీజేపీ పొత్తు గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ విమర్శలపై ఘాటుగా స్పందించారు. 2015 డిసెంబరులో ఈడీ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు బెయిల్ మంజూరైందని దయచేసి గమనించండంటూ పోస్టులో పేర్కొన్నారు.

ఇటీవల ఎన్నికల్లో భారత కూటమిలో భాగమైన ఆప్ నేత మనీశ్​ సిసోడియాకు వారం రోజుల క్రితం బెయిల్ మంజూరైందని ప్రస్తావించారు. ఓటుకు నోటు కుంభకోణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2015 నుంచి బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. ఇవన్నీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరిగాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌లు భాగస్వామ్య పక్షాలు అని, ఆపై ఉదాహరణలు బట్టి మనం ఊహించాలా? అని సూటిగా ప్రశ్నించారు.

KTR On Loan Waiver : ఏది నిజం? ఏది అబద్ధం? రుణమాఫీ పూర్తి అని ఒకరు, ఆగస్టు 15 మాట నిలబెట్టుకున్నామని మరొకరు అంటున్నారని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీ కోసం 7,500 కోట్ల రూపాయలు మాత్రమే విడుదలైందని ఆర్థిక మంత్రి, రూ.17 వేల కోట్లు చేశామని మంత్రులు,. 31 వేల కోట్ల రూపాయలు మాఫీ చేశామని ముఖ్యమంత్రి అంటున్నారని, ఇలా తలో మాట చెబుతున్నారని పేర్కొన్నారు.

తాజాగా రుణమాఫీ అయిపోలేదు మధ్యలో ఉంది అంటూ వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన "ఎక్స్‌" వేదికగా స్పందించారు. రైతులతో అసమర్థ కాంగ్రెస్ నాయకులు చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఎద్దేడ్సిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని, జూటా కాంగ్రెస్ - జూటా హామీ అంటూ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

"కాంగ్రెస్​ పాలనలో కర్షకులకు కష్టాలు - పంటలు పండించడం, విక్రయం కత్తిమీద సామే" - Harish Rao Letter to CM Revanth

కవితకు బెయిల్​ రావడంపై కేటీఆర్​, బండి మధ్య ట్వీట్ వార్ - 'కేంద్రమంత్రి​ ఆ వ్యాఖ్యలు చేయడం తగదు' - kavitha bail KTR and Bandi tweets

KTR Strongly Criticized The Prajavani Program : సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మేడ్చల్ జిల్లాకు చెందిన రేణుక అనే మహిళ జీతం సరిగా రావటం లేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. అయితే ఫిర్యాదు చేయడంతో సంబంధిత ఏజెన్సీ ఆమెను ఉద్యోగంలోంచి తొలగించిందని వెల్లడించారు. ఈ ప్రభుత్వానికి ఆర్భాటం ఎక్కువ, పరిష్కారం తక్కువ అని ఎక్స్​లో పోస్ట్ చేశారు.

ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రతీకార పాలన అని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటివరకు మీ ప్రభుత్వంలో ఎంతమంది పేదలకు ప్రజాదర్బార్ వల్ల సమస్యలు పరిష్కారం అయ్యాయో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేణుకను ఉద్యోగంలోంచి తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

ఓటుకు నోటు కేసులో నేటికీ సీఎం రేవంత్‌రెడ్డి బెయిల్​పైనే : బీఆర్ఎస్, బీజేపీ పొత్తు గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ విమర్శలపై ఘాటుగా స్పందించారు. 2015 డిసెంబరులో ఈడీ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు బెయిల్ మంజూరైందని దయచేసి గమనించండంటూ పోస్టులో పేర్కొన్నారు.

ఇటీవల ఎన్నికల్లో భారత కూటమిలో భాగమైన ఆప్ నేత మనీశ్​ సిసోడియాకు వారం రోజుల క్రితం బెయిల్ మంజూరైందని ప్రస్తావించారు. ఓటుకు నోటు కుంభకోణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2015 నుంచి బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. ఇవన్నీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరిగాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌లు భాగస్వామ్య పక్షాలు అని, ఆపై ఉదాహరణలు బట్టి మనం ఊహించాలా? అని సూటిగా ప్రశ్నించారు.

KTR On Loan Waiver : ఏది నిజం? ఏది అబద్ధం? రుణమాఫీ పూర్తి అని ఒకరు, ఆగస్టు 15 మాట నిలబెట్టుకున్నామని మరొకరు అంటున్నారని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీ కోసం 7,500 కోట్ల రూపాయలు మాత్రమే విడుదలైందని ఆర్థిక మంత్రి, రూ.17 వేల కోట్లు చేశామని మంత్రులు,. 31 వేల కోట్ల రూపాయలు మాఫీ చేశామని ముఖ్యమంత్రి అంటున్నారని, ఇలా తలో మాట చెబుతున్నారని పేర్కొన్నారు.

తాజాగా రుణమాఫీ అయిపోలేదు మధ్యలో ఉంది అంటూ వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన "ఎక్స్‌" వేదికగా స్పందించారు. రైతులతో అసమర్థ కాంగ్రెస్ నాయకులు చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఎద్దేడ్సిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని, జూటా కాంగ్రెస్ - జూటా హామీ అంటూ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

"కాంగ్రెస్​ పాలనలో కర్షకులకు కష్టాలు - పంటలు పండించడం, విక్రయం కత్తిమీద సామే" - Harish Rao Letter to CM Revanth

కవితకు బెయిల్​ రావడంపై కేటీఆర్​, బండి మధ్య ట్వీట్ వార్ - 'కేంద్రమంత్రి​ ఆ వ్యాఖ్యలు చేయడం తగదు' - kavitha bail KTR and Bandi tweets

Last Updated : Aug 28, 2024, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.