ETV Bharat / state

రోడ్లపై తిష్ట వేస్తోన్న కుక్కలు, ఆవులు - వాహనదారులకు చుక్కలు - Dogs and Cows are Roaming on Roads

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 8:09 PM IST

Bapatla People Facing Difficulties as Dogs and Cows : కుక్క పేరు చెబితే విశ్వాసానికి ప్రతీక అని అంటారు. ఆవుని దైవంతో కొలుస్తారు. అయితే ఈ జీవులు రోడ్లపైనే తిష్టవేయడం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళాల్లో రోడ్లపైకి రావలంటే బెంబెలెత్తిపోతున్నారు. వీటి బారిన పడి ప్రతి రోజూ రాష్ట్రంలో ఏదో ఓ ప్రాంతంలో వాహనదారులు గాయాలపాలవుతున్నారంటే అతిశయోక్తి కాదు. సమస్యను పరిష్కారించాల్సిన అధికారుల అలసత్వంతోనే ఇలా జరుగుతోందని ప్రజలు వాపోతున్నారు.

Bapatla People Facing Difficulties as Dogs and Cows
Bapatla People Facing Difficulties as Dogs and Cows (ETV Bharat)

Bapatla People Facing Difficulties as Dogs and Cows : రాష్ట్రంలో వీధి కుక్కలు, ఆవుల సమస్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఎక్కడపడితే అక్కడ రహదారుల వెంబడి, రోడ్ల మధ్యలో తిష్ట వేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళ ప్రయాణికులు రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. వీటి వల్ల కొన్ని సార్లు ట్రాఫిక్​కు అంతరాయం కలుగుతుందంటే అతిశయోక్తి కాదు. అలాగే నిత్యం ఏదో ఒక వీధిలో, ఎవరో ఒకరు కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అని తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించిన చోట వీధి కుక్కలు వెంటాడుతూనే ఉన్నాయి, కరుస్తూనే ఉన్నాయి. బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఈ సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్న గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి వీధి కుక్కలకు సంతాన నిరోధక శాస్త్ర చికిత్సలు, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్లను వేయ్యకుండా కాలయాపన చేసింది. దీంతో వీధి కుక్కలు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా రోడ్లపై స్వైర విహారం చేస్తూ ప్రజలను భయందోళనకు గురిచేస్తున్నాయి.

డేంజర్ డాగ్స్ - ఆడుకుంటున్న బాలుడిపై అటాక్ - తల పీక్కుతిన్న కుక్కలు - SECUNDERABAD BOY DIED IN DOG ATTACK

బాపట్ల పట్టణంలో వీధి కుక్కలు, ఆవుల సమస్య స్థానికులను తీవ్రంగా వేధిస్తోంది. పురపాలక సంఘంలో ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో శునకాలు గుంపులుగా తిరుగుతున్నాయి. పాదాచారులు, వాహనదారులపై దాడులు చేసి కరుస్తున్నాయి. రాత్రి వేళ ప్రయాణికులు రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. పట్టణంలో ప్రాంతీయ ఆసుపత్రి రోడ్డు, సూర్యలంక రోడ్డు, లక్ష్మీపురం డీఎస్పీ కార్యాలయం రోడ్డు, పాత బస్టాండు, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో వీధి కుక్కలకు సంతాన నిరోధక శాస్త్ర చికిత్సలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వందల సంఖ్యలో శునకాలు పెరిగిపోయాని స్థానికులు మండిపడుతున్నారు. కుక్కలకు కనీసం యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్లను కూడా వేయలేదు. దీంతో కుక్క కాటుకు గురైన కేసులు ప్రాంతీయ ఆసుపత్రిలో రోజురోజుకు పెరుగుతున్నాయి.

ట్రాఫిక్​కు అంతరాయం : ఈ జీవులు పలు సందర్బాల్లో ట్రాఫిక్​కు అంతరాయం కలిగిస్తున్నాయి. ఆవుల స్వైర విహారంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఆవులను తరలించాలని, లేదంటే జరిమానాలు విధిస్తామని పురపాలక శాఖ అధికారులు ఆయా మూగజీవుల యజమానులను హెచ్చరికలు జారీచేసిన వారు పట్టిపట్టానట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విజయలక్ష్మిపురం సమీపంలో ఆవును తప్పించబోయి ఓ మహిళ ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడిపోయింది. దీంతో ఆమె స్పల్ప గాయాలతో బయటపడ్డారు. అలగే గతంలో జీవి.సీ రోడ్డులో ఓ ద్విచక్ర వాహనదారుడు ఎద్దును ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

"బాపట్ల పురపాలక సంఘ పరిధిలో రోడ్లపై కుక్కలు, ఆవుల సంచారం అధికమైంది. దీంతో సాధారణ ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై చాలా ఫిర్యాదులు అందాయి. గతంలో ఆవుల యజమానులకు నోటీసులు ఇచ్చిన స్పందించలేదు. దీంతో ఈనెల 29న ఆవుల యజమానులతో సమావేశం నిర్వహిస్తున్నాము. అప్పటికీ స్పందించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాము." - నిర్మల్ కుమార్, బాపట్ల మున్సిపల్ కమిషనర్

బ్లాక్​లిస్ట్​ సంస్థకు వీధి కుక్కల ఆపరేషన్ల బాధ్యత- ఆ కార్పొరేషన్ అధికారుల తీరుపై సర్వత్రా విస్మయం - SCAM IN STREET DOGS

కుక్కల దాడులు ఇంకెన్నాళ్లు - 2030 నాటికి రేబిస్‌ను నిర్మూలించాలన్న కేంద్రం లక్ష్యం నెరవేరేనా? - Street Dogs Attacks

Bapatla People Facing Difficulties as Dogs and Cows : రాష్ట్రంలో వీధి కుక్కలు, ఆవుల సమస్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఎక్కడపడితే అక్కడ రహదారుల వెంబడి, రోడ్ల మధ్యలో తిష్ట వేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళ ప్రయాణికులు రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. వీటి వల్ల కొన్ని సార్లు ట్రాఫిక్​కు అంతరాయం కలుగుతుందంటే అతిశయోక్తి కాదు. అలాగే నిత్యం ఏదో ఒక వీధిలో, ఎవరో ఒకరు కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అని తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించిన చోట వీధి కుక్కలు వెంటాడుతూనే ఉన్నాయి, కరుస్తూనే ఉన్నాయి. బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఈ సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్న గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి వీధి కుక్కలకు సంతాన నిరోధక శాస్త్ర చికిత్సలు, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్లను వేయ్యకుండా కాలయాపన చేసింది. దీంతో వీధి కుక్కలు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా రోడ్లపై స్వైర విహారం చేస్తూ ప్రజలను భయందోళనకు గురిచేస్తున్నాయి.

డేంజర్ డాగ్స్ - ఆడుకుంటున్న బాలుడిపై అటాక్ - తల పీక్కుతిన్న కుక్కలు - SECUNDERABAD BOY DIED IN DOG ATTACK

బాపట్ల పట్టణంలో వీధి కుక్కలు, ఆవుల సమస్య స్థానికులను తీవ్రంగా వేధిస్తోంది. పురపాలక సంఘంలో ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో శునకాలు గుంపులుగా తిరుగుతున్నాయి. పాదాచారులు, వాహనదారులపై దాడులు చేసి కరుస్తున్నాయి. రాత్రి వేళ ప్రయాణికులు రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. పట్టణంలో ప్రాంతీయ ఆసుపత్రి రోడ్డు, సూర్యలంక రోడ్డు, లక్ష్మీపురం డీఎస్పీ కార్యాలయం రోడ్డు, పాత బస్టాండు, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో వీధి కుక్కలకు సంతాన నిరోధక శాస్త్ర చికిత్సలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వందల సంఖ్యలో శునకాలు పెరిగిపోయాని స్థానికులు మండిపడుతున్నారు. కుక్కలకు కనీసం యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్లను కూడా వేయలేదు. దీంతో కుక్క కాటుకు గురైన కేసులు ప్రాంతీయ ఆసుపత్రిలో రోజురోజుకు పెరుగుతున్నాయి.

ట్రాఫిక్​కు అంతరాయం : ఈ జీవులు పలు సందర్బాల్లో ట్రాఫిక్​కు అంతరాయం కలిగిస్తున్నాయి. ఆవుల స్వైర విహారంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఆవులను తరలించాలని, లేదంటే జరిమానాలు విధిస్తామని పురపాలక శాఖ అధికారులు ఆయా మూగజీవుల యజమానులను హెచ్చరికలు జారీచేసిన వారు పట్టిపట్టానట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విజయలక్ష్మిపురం సమీపంలో ఆవును తప్పించబోయి ఓ మహిళ ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడిపోయింది. దీంతో ఆమె స్పల్ప గాయాలతో బయటపడ్డారు. అలగే గతంలో జీవి.సీ రోడ్డులో ఓ ద్విచక్ర వాహనదారుడు ఎద్దును ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

"బాపట్ల పురపాలక సంఘ పరిధిలో రోడ్లపై కుక్కలు, ఆవుల సంచారం అధికమైంది. దీంతో సాధారణ ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై చాలా ఫిర్యాదులు అందాయి. గతంలో ఆవుల యజమానులకు నోటీసులు ఇచ్చిన స్పందించలేదు. దీంతో ఈనెల 29న ఆవుల యజమానులతో సమావేశం నిర్వహిస్తున్నాము. అప్పటికీ స్పందించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాము." - నిర్మల్ కుమార్, బాపట్ల మున్సిపల్ కమిషనర్

బ్లాక్​లిస్ట్​ సంస్థకు వీధి కుక్కల ఆపరేషన్ల బాధ్యత- ఆ కార్పొరేషన్ అధికారుల తీరుపై సర్వత్రా విస్మయం - SCAM IN STREET DOGS

కుక్కల దాడులు ఇంకెన్నాళ్లు - 2030 నాటికి రేబిస్‌ను నిర్మూలించాలన్న కేంద్రం లక్ష్యం నెరవేరేనా? - Street Dogs Attacks

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.