ETV Bharat / state

బీ కేర్​ ఫుల్​ - బ్యాంకు ఖాతాను చెక్​ చేస్తున్న సైబర్​ కేటుగాళ్లు - ఈ జాగ్రత్తలు మేలు - CYBER criminals check bank balance

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 6:45 PM IST

Updated : Jul 12, 2024, 7:29 PM IST

Cyber ​​Crimes in Hyderabad : సైబర్​ నేరాలపై ప్రజలు అప్రమత్తం అవుతున్న కొద్దీ సైబర్​ నేరగాళ్లు కొత్తదారులు వెతుకుతున్నారు. ఇప్పుడు కొత్తగా బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉందని సులభంగా తెలుసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. కేవలం బ్యాంకు ఖాతా వివరాలు, నిల్వ, ఫోన్​ నంబర్లు మాత్రమే కాదు వ్యక్తిగత సమాచారం, గృహరుణాల దరఖాస్తు వంటి వివరాలు బయటకు వెళుతున్నాయి.

Cyber ​​Crimes in Hyderabad
Cyber ​​Crimes in Hyderabad (ETV Bharat)

Bank Account Balance Details known to Cyber Criminals : రోజురోజుకు సైబర్‌నేరాలు మరింత విస్తృత రూపం దాలుస్తున్నాయి. కొత్త కొత్త ఎత్తుగడలతో కేటుగాళ్లు ప్రజలు జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల నల్లకుంటలో ఉండే ప్రైవేట్‌ ఉద్యోగి కొత్త ఇళ్లు కొనుగోలు కోసం ప్రైవేట్‌బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. బ్యాంకు నుంచి ఇంటికెళ్లేలోపు ఒకరు ఫోన్‌ చేసి బ్యాంకు ప్రతినిధినని పరిచయం చేసుకున్నాడు. గృహరుణం కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆమోదం పొందాలంటే తాము పంపే లింకు క్లిక్‌ చేయాలని చెప్పాడు. రెండు రోజుల తర్వాత మరొకరు ఫోన్‌ చేసి తెలుగులో మాట్లాడుతూ మోసగించేందుకు ప్రయత్నించాడు. ఖాతాదారు అవేవీ నమ్మకుండా బ్యాంకు అధికారులకు సమాచారమివ్వడంతో ఆదిలోనే మోసానికి అడ్డుకట్టపడింది.

అయితే ఇటీవల ఈతరహా ఫిర్యాదులు పెరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ వ్యక్తిగత సమాచారం ఎలా బయటకు వస్తుందో వినియోగదారులకు అర్థంకావట్లేదు. గతంలో కేవలం పేరు, బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్‌ కార్డు నంబర్లు వంటి పాత సమాచారం ఆధారంగా సైబర్‌మోసాలు జరిగేవి. ఇటీవల కొంతకాలంగా రుణాలు, బీమా దరఖాస్తు వంటి వివరాలతో డబ్బు కొల్లగొడుతున్న ఫిర్యాదులు వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బ్యాంకుకి రావాల్సిన అవసరం లేకుండా రుణాలు జారీచేస్తామని ప్రకటించడం ఖాతాదారులు తేలిగ్గా నమ్మి నేరగాళ్లకు దొరికిపోతున్నారని స్పష్టం చేస్తున్నారు. రుణం మంజూరు కోసం ఖాతాదారులు ఆశగా ఎదురుచూస్తుండటాన్ని సైబర్‌ నేరగాళ్లు అవకాశంగా చేసుకొని మోసగిస్తున్నారు. రుణం వస్తుందనే తొందరలో నేరగాళ్లు చెప్పినట్లు చేసి ప్రజలు డబ్బు పోగొట్టుకుంటున్నారంటూ సైబర్​ నిపుణులు చెబుతున్నారు.

థర్డ్​ పార్టీ ఏజెన్సీలే కారణం : సైబర్‌ నేరగాళ్లు ఖాతాదారుల్ని లక్ష్యం చేసుకోవడానికి డేటా నిర్వహణలో బ్యాంకు డొల్లతనమే ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖాతాదారుల ఆధార్, పాన్, వ్యక్తిగత చిరునామా, ఫోన్‌ నంబర్లు వంటి డేటా, కాల్‌సెంటర్, రుణాల దరఖాస్తు ప్రక్రియ తదితర సాంకేతిక సేవల కోసం బ్యాంకులు థర్డ్‌ పార్టీ ఏజెన్సీలపై ఆధారపడతాయి. రుణం ఇవ్వడం బ్యాంకు పనే అయినా అందుకు సంబంధించిన సాంకేతిక పరిశీలన, దరఖాస్తు ప్రక్రియని థర్డ్‌పార్టీ ఏజెన్సీలు చూస్తుంటాయి. ఆ ఏజెన్సీల్లో పనిచేసే ఉద్యోగులు ఎంతో కొంత ధరకు బయటివారికి వాటిని అమ్మేస్తున్నారు.

ఆర్​బీఐ ఆదేశాలు బేఖాతరు : ఎంతో విలువైన సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు చేజిక్కించుకొని మోసాలకు పాల్పడుతున్నారు. డేటానిర్వహణపై ఆర్​బీఐ ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నా కొన్ని బ్యాంకుల తీరు మారటం లేదు. ప్రధానంగా రెండు బ్యాంకులకు చెందిన ఖాతాదారుల సమాచారం సైబర్‌ నేరగాళ్ల వద్దకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకులైన ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ ఖాతాదారులే లక్ష్యంగా సైబర్‌ ముఠాలు మోసాలు చేస్తున్నట్లు నివేదికల ద్వారా వెల్లడవుతోంది. కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్‌ సేఫ్‌ సంస్థ గత అక్టోబరులో ఫోన్‌ ద్వారా బ్యాంకింగ్‌ పేరిట జరిగిన మోసాలను విశ్లేషించింది.

దేశవ్యాప్తంగా బాధితుల్లో ఎస్​బీఐ ఖాతాదారులు ఎక్కువమంది ఉంటే రెండోస్థానంలో హెచ్​డీఎఫ్​సీ ఉంది. 2023 అక్టోబరులో దేశవ్యాప్తంగా 8,760 మోసాలు జరిగితే అందులో 2,624 ఎస్​బీఐ, 1,299 మంది హెచ్​డీఎఫ్​సీ ఖాతాదారులు బాధితులుగా ఉన్నారు. సుమారు 45శాతం మోసాలు ఆ రెండు బ్యాంకుల ఖాతాదారులే లక్ష్యంగా జరిగినట్లు అధ్యయనంలో తేలింది. ఈ తరహా మోసాలు దిల్లీ, హర్యానా నుంచి ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

వినియోగదారులు పాటించాల్సిన జాగ్రత్తలు : రుణం కోసం దరఖాస్తు చేస్తే ఆమోదానికి బ్యాంకులు వెబ్​ లింకులు పంపవన్న విషయం గ్రహించాలి. బ్యాంకు కేంద్రీయ బ్రాంచ్​ నుంచి ఫోన్​ చేశామని చెప్పడం అబద్ధం. ఏదైనా సందేహాలుంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి విషయం కనుక్కోవడం మంచిది.

Bank Account Balance Details known to Cyber Criminals : రోజురోజుకు సైబర్‌నేరాలు మరింత విస్తృత రూపం దాలుస్తున్నాయి. కొత్త కొత్త ఎత్తుగడలతో కేటుగాళ్లు ప్రజలు జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల నల్లకుంటలో ఉండే ప్రైవేట్‌ ఉద్యోగి కొత్త ఇళ్లు కొనుగోలు కోసం ప్రైవేట్‌బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. బ్యాంకు నుంచి ఇంటికెళ్లేలోపు ఒకరు ఫోన్‌ చేసి బ్యాంకు ప్రతినిధినని పరిచయం చేసుకున్నాడు. గృహరుణం కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆమోదం పొందాలంటే తాము పంపే లింకు క్లిక్‌ చేయాలని చెప్పాడు. రెండు రోజుల తర్వాత మరొకరు ఫోన్‌ చేసి తెలుగులో మాట్లాడుతూ మోసగించేందుకు ప్రయత్నించాడు. ఖాతాదారు అవేవీ నమ్మకుండా బ్యాంకు అధికారులకు సమాచారమివ్వడంతో ఆదిలోనే మోసానికి అడ్డుకట్టపడింది.

అయితే ఇటీవల ఈతరహా ఫిర్యాదులు పెరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ వ్యక్తిగత సమాచారం ఎలా బయటకు వస్తుందో వినియోగదారులకు అర్థంకావట్లేదు. గతంలో కేవలం పేరు, బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్‌ కార్డు నంబర్లు వంటి పాత సమాచారం ఆధారంగా సైబర్‌మోసాలు జరిగేవి. ఇటీవల కొంతకాలంగా రుణాలు, బీమా దరఖాస్తు వంటి వివరాలతో డబ్బు కొల్లగొడుతున్న ఫిర్యాదులు వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బ్యాంకుకి రావాల్సిన అవసరం లేకుండా రుణాలు జారీచేస్తామని ప్రకటించడం ఖాతాదారులు తేలిగ్గా నమ్మి నేరగాళ్లకు దొరికిపోతున్నారని స్పష్టం చేస్తున్నారు. రుణం మంజూరు కోసం ఖాతాదారులు ఆశగా ఎదురుచూస్తుండటాన్ని సైబర్‌ నేరగాళ్లు అవకాశంగా చేసుకొని మోసగిస్తున్నారు. రుణం వస్తుందనే తొందరలో నేరగాళ్లు చెప్పినట్లు చేసి ప్రజలు డబ్బు పోగొట్టుకుంటున్నారంటూ సైబర్​ నిపుణులు చెబుతున్నారు.

థర్డ్​ పార్టీ ఏజెన్సీలే కారణం : సైబర్‌ నేరగాళ్లు ఖాతాదారుల్ని లక్ష్యం చేసుకోవడానికి డేటా నిర్వహణలో బ్యాంకు డొల్లతనమే ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖాతాదారుల ఆధార్, పాన్, వ్యక్తిగత చిరునామా, ఫోన్‌ నంబర్లు వంటి డేటా, కాల్‌సెంటర్, రుణాల దరఖాస్తు ప్రక్రియ తదితర సాంకేతిక సేవల కోసం బ్యాంకులు థర్డ్‌ పార్టీ ఏజెన్సీలపై ఆధారపడతాయి. రుణం ఇవ్వడం బ్యాంకు పనే అయినా అందుకు సంబంధించిన సాంకేతిక పరిశీలన, దరఖాస్తు ప్రక్రియని థర్డ్‌పార్టీ ఏజెన్సీలు చూస్తుంటాయి. ఆ ఏజెన్సీల్లో పనిచేసే ఉద్యోగులు ఎంతో కొంత ధరకు బయటివారికి వాటిని అమ్మేస్తున్నారు.

ఆర్​బీఐ ఆదేశాలు బేఖాతరు : ఎంతో విలువైన సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు చేజిక్కించుకొని మోసాలకు పాల్పడుతున్నారు. డేటానిర్వహణపై ఆర్​బీఐ ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నా కొన్ని బ్యాంకుల తీరు మారటం లేదు. ప్రధానంగా రెండు బ్యాంకులకు చెందిన ఖాతాదారుల సమాచారం సైబర్‌ నేరగాళ్ల వద్దకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకులైన ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ ఖాతాదారులే లక్ష్యంగా సైబర్‌ ముఠాలు మోసాలు చేస్తున్నట్లు నివేదికల ద్వారా వెల్లడవుతోంది. కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలోని సైబర్‌ సేఫ్‌ సంస్థ గత అక్టోబరులో ఫోన్‌ ద్వారా బ్యాంకింగ్‌ పేరిట జరిగిన మోసాలను విశ్లేషించింది.

దేశవ్యాప్తంగా బాధితుల్లో ఎస్​బీఐ ఖాతాదారులు ఎక్కువమంది ఉంటే రెండోస్థానంలో హెచ్​డీఎఫ్​సీ ఉంది. 2023 అక్టోబరులో దేశవ్యాప్తంగా 8,760 మోసాలు జరిగితే అందులో 2,624 ఎస్​బీఐ, 1,299 మంది హెచ్​డీఎఫ్​సీ ఖాతాదారులు బాధితులుగా ఉన్నారు. సుమారు 45శాతం మోసాలు ఆ రెండు బ్యాంకుల ఖాతాదారులే లక్ష్యంగా జరిగినట్లు అధ్యయనంలో తేలింది. ఈ తరహా మోసాలు దిల్లీ, హర్యానా నుంచి ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

వినియోగదారులు పాటించాల్సిన జాగ్రత్తలు : రుణం కోసం దరఖాస్తు చేస్తే ఆమోదానికి బ్యాంకులు వెబ్​ లింకులు పంపవన్న విషయం గ్రహించాలి. బ్యాంకు కేంద్రీయ బ్రాంచ్​ నుంచి ఫోన్​ చేశామని చెప్పడం అబద్ధం. ఏదైనా సందేహాలుంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి విషయం కనుక్కోవడం మంచిది.

Last Updated : Jul 12, 2024, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.