AP CM Chandrababu Spoke on Jamili Elections : జమిలి ఎన్నికలకు దేశం మొత్తం సంపూర్ణ మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో సుస్థిరమైన పాలన ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని అన్నారు. రాష్ట్రానికి అతిపెద్ద అరిష్ఠం జగన్ అని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజీ ధ్వంసం చేయాలని కుట్రపన్నిన వాళ్లు వరదల్లో తమ పనితీరును విమర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఏపీలో రూ.75 వేల కోట్లలతో రైల్వే మౌలిక సదుపాయాల కోసమే ఖర్చు చేస్తున్నారని వివరించారు. బెంగళూరు-చెన్నై-అమరావతి-హైదరాబాద్ నగరాలను కలిపేలా బుల్లెట్ ట్రైన్ తెచ్చే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. కేంద్రం వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నప్పుడు అభినందించటం తన బాధ్యతనని ఏపీ ముఖ్యమంత్రి చెప్పారు.
జమిలి ఎన్నికలకు దేశం మొత్తం సంపూర్ణ మద్దతు తెలపాలి : ఏపీ సీఎం చంద్రబాబు
దేశంలో సుస్థిర పాలన ఉంటే అభివృద్ధి వేగవంతమన్న ఏపీ సీఎం చంద్రబాబు - జమిలి ఎన్నికలకు దేశం సంపూర్ణ మద్దతు తెలపాలన్న ఏపీ సీఎం
Published : 2 hours ago
AP CM Chandrababu Spoke on Jamili Elections : జమిలి ఎన్నికలకు దేశం మొత్తం సంపూర్ణ మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో సుస్థిరమైన పాలన ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని అన్నారు. రాష్ట్రానికి అతిపెద్ద అరిష్ఠం జగన్ అని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజీ ధ్వంసం చేయాలని కుట్రపన్నిన వాళ్లు వరదల్లో తమ పనితీరును విమర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఏపీలో రూ.75 వేల కోట్లలతో రైల్వే మౌలిక సదుపాయాల కోసమే ఖర్చు చేస్తున్నారని వివరించారు. బెంగళూరు-చెన్నై-అమరావతి-హైదరాబాద్ నగరాలను కలిపేలా బుల్లెట్ ట్రైన్ తెచ్చే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. కేంద్రం వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నప్పుడు అభినందించటం తన బాధ్యతనని ఏపీ ముఖ్యమంత్రి చెప్పారు.