ETV Bharat / state

నత్తనడకన సాగుతున్న రోడ్డు విస్తరణ పనులు - వాహనాదారులకు తీవ్ర ఇబ్బందులు - Adilabad Road widening work Delay

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 11:29 AM IST

Road Problems in Adilabad : వాహనాల రాకపోకలకు అనువుగా రహదారిని 11 మీటర్ల వెడల్పుతో విస్తరించేందుకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి గుత్తేదారుకు అప్పగించడంతో, ఒకవైపు రోడ్డు పూర్తి చేశారు. మరోవైపు పనులు పూర్తి చేయకుండా గాలికి వదిలేశారు. రోడ్డును తవ్వి, మట్టి పోసి వదిలేయడంతో వాహనాదారులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు.

Adilabad Road widening work Delay
Road Problems in Adilabad (ETV Bharat)

Adilabad Road Widening Work Delay : ఆదిలాబాద్‌ను ఆనుకుని ఉన్న దస్నాపూర్‌ వంతెన నుంచి మావల గ్రామం వరకు మూడు కిలోమీటర్ల దూరం ఉంది. మధ్యనున్న డివైడర్లతో ఇరువైపులా ఏడు మీటర్ల చొప్పున ఉన్న రహదారిని అదనంగా మరో 4 మీటర్ల చొప్పున విస్తరించాలని రెండేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన పనుల కోసం రూ.13.64కోట్ల నిధులను సైతం మంజూరు చేసింది.

దస్నాపూర్‌ నుంచి మావల మార్గంలో భారీ వాహనాలు వెళ్లేలా ఒక్కవైపునే గుత్తేదారు రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేశారు. మావల నుంచి దస్నాపూర్‌ వైపు వచ్చే మరోవైపు పనులను రెండేళ్లుగా పూర్తి చేయడం లేదు. రోడ్డును తవ్వి, మట్టి పోసి వదిలేయడంతో వాహనాదారులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

"ఆదిలాబాద్​ నుంచి మావాల గ్రామానికి ఆరు లైన్ల రోడ్డు మంజూరైంది. ఒక వైపు రోడ్డు పూర్తైన మరోవైపు మాత్రం అలానే వదిలేశారు. ఆదిలాబాద్​కు రావాలంటే దానికి ఎంట్రన్స్​ వచ్చి మావల గ్రామమే. కానీ సగం సగం రోడ్ల నిర్మాణంతో ఎక్కడిక్కడే మట్టి వదిలేశారు. దానివల్ల అనేక రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఇద్దరు మరణించారు."-స్థానికులు

రోడ్డును తవ్వి, మట్టి పోసి వదిలేయడంతో ఎన్నో ప్రమాదాలు : ఆర్‌అండ్‌బీ పర్యవేక్షణలో పనుల నిర్వహణ ఇప్పటికే పూర్తికావాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారు. దీంతో కాస్త వర్షం పడితే చాలు వాహనాలు మట్టిలో కూరుకుపోతున్నాయని వాహనాదారులు వాపోతున్నారు.

అసంపూర్తి పనులతో రోజుకు ఎన్నో ప్రమాదాలు జరుగుతునప్పటికీ అధికారులు, ప్రజాప్రనిధులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. గుత్తేదారుల నిర్లక్ష్యంతో కొద్ది నిమిషాల్లో వెళ్లాల్సిన గమ్యానికి గంటల సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుత్తేదారులపై ఒత్తిడి పెంచి రోడ్డు విస్తరణ పనులు వేగం పుంజుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

"గత రెండేళ్లుగా హైవే పనులు నత్తనడకనే సాగుతున్నాయి. రామనగర్​ సమీపంలో కొన్ని డేంజర్​ జోన్లు ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఫండ్​ రిలీజ్​ అయినా సరే ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గుత్తేదారులపై ఒత్తిడి పెంచి రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేయాలి."-స్థానికులు

9 కిలోమీటర్ల ప్రయాణానికి 2 గంటల సమయం - ఆదిలాబాద్‌-నిరాల రహదారి నరకానికి దారి - Roads Damage in Adilabad

మా రోడ్డెక్కడో పోయింది? - వర్షాలతో కొట్టుకుపోయిన రహదారులు - RAIN DAMAGE ROADS IN BHUPALPALLY

Adilabad Road Widening Work Delay : ఆదిలాబాద్‌ను ఆనుకుని ఉన్న దస్నాపూర్‌ వంతెన నుంచి మావల గ్రామం వరకు మూడు కిలోమీటర్ల దూరం ఉంది. మధ్యనున్న డివైడర్లతో ఇరువైపులా ఏడు మీటర్ల చొప్పున ఉన్న రహదారిని అదనంగా మరో 4 మీటర్ల చొప్పున విస్తరించాలని రెండేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన పనుల కోసం రూ.13.64కోట్ల నిధులను సైతం మంజూరు చేసింది.

దస్నాపూర్‌ నుంచి మావల మార్గంలో భారీ వాహనాలు వెళ్లేలా ఒక్కవైపునే గుత్తేదారు రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేశారు. మావల నుంచి దస్నాపూర్‌ వైపు వచ్చే మరోవైపు పనులను రెండేళ్లుగా పూర్తి చేయడం లేదు. రోడ్డును తవ్వి, మట్టి పోసి వదిలేయడంతో వాహనాదారులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

"ఆదిలాబాద్​ నుంచి మావాల గ్రామానికి ఆరు లైన్ల రోడ్డు మంజూరైంది. ఒక వైపు రోడ్డు పూర్తైన మరోవైపు మాత్రం అలానే వదిలేశారు. ఆదిలాబాద్​కు రావాలంటే దానికి ఎంట్రన్స్​ వచ్చి మావల గ్రామమే. కానీ సగం సగం రోడ్ల నిర్మాణంతో ఎక్కడిక్కడే మట్టి వదిలేశారు. దానివల్ల అనేక రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఇద్దరు మరణించారు."-స్థానికులు

రోడ్డును తవ్వి, మట్టి పోసి వదిలేయడంతో ఎన్నో ప్రమాదాలు : ఆర్‌అండ్‌బీ పర్యవేక్షణలో పనుల నిర్వహణ ఇప్పటికే పూర్తికావాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారు. దీంతో కాస్త వర్షం పడితే చాలు వాహనాలు మట్టిలో కూరుకుపోతున్నాయని వాహనాదారులు వాపోతున్నారు.

అసంపూర్తి పనులతో రోజుకు ఎన్నో ప్రమాదాలు జరుగుతునప్పటికీ అధికారులు, ప్రజాప్రనిధులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. గుత్తేదారుల నిర్లక్ష్యంతో కొద్ది నిమిషాల్లో వెళ్లాల్సిన గమ్యానికి గంటల సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుత్తేదారులపై ఒత్తిడి పెంచి రోడ్డు విస్తరణ పనులు వేగం పుంజుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

"గత రెండేళ్లుగా హైవే పనులు నత్తనడకనే సాగుతున్నాయి. రామనగర్​ సమీపంలో కొన్ని డేంజర్​ జోన్లు ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఫండ్​ రిలీజ్​ అయినా సరే ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గుత్తేదారులపై ఒత్తిడి పెంచి రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేయాలి."-స్థానికులు

9 కిలోమీటర్ల ప్రయాణానికి 2 గంటల సమయం - ఆదిలాబాద్‌-నిరాల రహదారి నరకానికి దారి - Roads Damage in Adilabad

మా రోడ్డెక్కడో పోయింది? - వర్షాలతో కొట్టుకుపోయిన రహదారులు - RAIN DAMAGE ROADS IN BHUPALPALLY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.