ETV Bharat / sports

'ఇండియా హౌజ్​'కు భారత అథ్లెట్లు- పతక విజేత సరబ్​జోత్​కు నీతా అంబానీ సన్మానం - Paris Olympics 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 4:29 PM IST

Paris Olympics India House: పారిస్ ఒలింపిక్స్​లో ఏర్పాటు చేసిన 'ఇండియా హౌజ్​'ను భారత్ అథ్లెట్లు సందర్శించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్​పర్సన్ నీతా అంబానీ అథ్లెట్లను సన్మానించారు.

Paris Olympics India House
Paris Olympics India House (Source: Associated Press)

Paris Olympics India House: పారిస్ ఒలింపిక్స్​లో ఏర్పాటు చేసిన 'ఇండియా హౌజ్​'ను కాంస్య పతక విజేత సరబ్​​జోత్ సింగ్ సహా పలువురు​ భారత అథ్లెట్లు తాజాగా సందర్శించారు. భారత సంప్రదాయ బ్యాండ్ చప్పుళ్లు, నృత్యాలు ఫ్యాన్స్ కేరింతల మధ్య అథ్లెట్లకు ఇండియన్ హౌజ్​లో ఘన స్వాగతం దక్కింది. వీరికి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మెంబర్, రిలయన్స్ ఛైర్​పర్సన్​ నీతా తిలకం దిద్ది అంబానీ స్వాగతం పలికారు. అనంతరం అథ్లెట్లను నీతా అంబానీ సన్మానించారు. ముఖ్యంగా భారత్​కు పతకాలు సాధించిన మనూ బాకర్, సరబ్​జోత్​ సింగ్​ను నీతా అంబానీ అభినందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 'ఇండియా హౌజ్​లోకి మీకు (అథ్లెట్లకు) స్వాగతం. ఈ విశ్వ క్రీడల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. మీరంతా నేడు, రేపు, ఎప్పటికీ భారత ఐకాన్​లు. ఈ ఒలింపిక్స్​లో కాంస్యం ముద్దాడిన మనూ బాకర్, సరబ్​జోత్​కు నా అభినందనలు' అని నీతా అన్నారు. తర్వాత అథ్లెట్లను సన్మానించి వారితో గ్రూప్ ఫొటో తీసుకున్నారు. ఇందులో టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న, శరత్ కమల్, మనికా బాత్ర, అర్జున్ బబుతా తదితర అథ్లెట్లు పాల్గొన్నారు.

అసలేంటీ ఇండియా హౌజ్: ఒలింపిక్స్​ జరుగుతున్న పారిస్​లో ఇండియా హౌజ్ ఏర్పాటైంది. ఇది ఇండియా ఫ్యాన్స్, అథ్లెట్లకు పెవిలియన్​గా ఉంటుంది. ఒలింపిక్స్​ హిస్టరీలో తొలిసారి భారత్ ఈ కంట్రీ హౌజ్​ను ఏర్పాటు చేసింది. ఈ వేదికగా ఒలింపిక్స్​ లైవ్ స్ట్రీమింగ్ కూడా చూడవచ్చు.

ఇండియా హౌజ్ ప్రత్యేకత: ఇండియా హౌజ్​ భారత అథ్లెట్లకు ఇల్లులా ఉంటుంది. భారతదేశం విజయాలు, పతకాలను గుర్తు చేస్తుంది. అతిథులు క్రీడా దిగ్గజాలతో కలిసిపోవడానికి, ముఖ్యమైన ఈవెంట్‌లను చూడటానికి ఒక వేదికను అందిస్తుంది. భారతదేశంలో ఒలింపిక్ క్రీడల ప్రత్యేక మీడియా హక్కులను కలిగి ఉన్న వయాకామ్ 18 సహకారంతో, ఇండియా హౌస్‌లో కీలకమైన భారతీయ ఈవెంట్‌లు చూసేలా ప్రత్యేక వాచ్‌ పార్టీలను నిర్వహించనున్నారు. ఈ పెవిలియన్ క్రీడాభిమానులు, ప్రపంచ క్రీడా ప్రముఖులు, భారతీయ పర్యాటకులు, మీడియా, క్రీడాకారుల సహా అంతర్జాతీయ సమాజానికి భారతదేశం ప్రతిరూపాన్ని చూపిస్తుంది. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు తమ విజయాలను గౌరవించుకునేందుకు డెడికేటెడ్‌ హోమ్‌ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.

భిన్న ధ్రువాలను కలిపిన ఆమె - షూటింగ్​లో మను, సరబ్​ ట్రైనర్ ఎవరంటే? - Paris Olympics 2024

ఒలింపిక్స్​లో మను బాకర్​ విజయాల వెనక రానా - Paris Olympics 2024

Paris Olympics India House: పారిస్ ఒలింపిక్స్​లో ఏర్పాటు చేసిన 'ఇండియా హౌజ్​'ను కాంస్య పతక విజేత సరబ్​​జోత్ సింగ్ సహా పలువురు​ భారత అథ్లెట్లు తాజాగా సందర్శించారు. భారత సంప్రదాయ బ్యాండ్ చప్పుళ్లు, నృత్యాలు ఫ్యాన్స్ కేరింతల మధ్య అథ్లెట్లకు ఇండియన్ హౌజ్​లో ఘన స్వాగతం దక్కింది. వీరికి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మెంబర్, రిలయన్స్ ఛైర్​పర్సన్​ నీతా తిలకం దిద్ది అంబానీ స్వాగతం పలికారు. అనంతరం అథ్లెట్లను నీతా అంబానీ సన్మానించారు. ముఖ్యంగా భారత్​కు పతకాలు సాధించిన మనూ బాకర్, సరబ్​జోత్​ సింగ్​ను నీతా అంబానీ అభినందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 'ఇండియా హౌజ్​లోకి మీకు (అథ్లెట్లకు) స్వాగతం. ఈ విశ్వ క్రీడల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. మీరంతా నేడు, రేపు, ఎప్పటికీ భారత ఐకాన్​లు. ఈ ఒలింపిక్స్​లో కాంస్యం ముద్దాడిన మనూ బాకర్, సరబ్​జోత్​కు నా అభినందనలు' అని నీతా అన్నారు. తర్వాత అథ్లెట్లను సన్మానించి వారితో గ్రూప్ ఫొటో తీసుకున్నారు. ఇందులో టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న, శరత్ కమల్, మనికా బాత్ర, అర్జున్ బబుతా తదితర అథ్లెట్లు పాల్గొన్నారు.

అసలేంటీ ఇండియా హౌజ్: ఒలింపిక్స్​ జరుగుతున్న పారిస్​లో ఇండియా హౌజ్ ఏర్పాటైంది. ఇది ఇండియా ఫ్యాన్స్, అథ్లెట్లకు పెవిలియన్​గా ఉంటుంది. ఒలింపిక్స్​ హిస్టరీలో తొలిసారి భారత్ ఈ కంట్రీ హౌజ్​ను ఏర్పాటు చేసింది. ఈ వేదికగా ఒలింపిక్స్​ లైవ్ స్ట్రీమింగ్ కూడా చూడవచ్చు.

ఇండియా హౌజ్ ప్రత్యేకత: ఇండియా హౌజ్​ భారత అథ్లెట్లకు ఇల్లులా ఉంటుంది. భారతదేశం విజయాలు, పతకాలను గుర్తు చేస్తుంది. అతిథులు క్రీడా దిగ్గజాలతో కలిసిపోవడానికి, ముఖ్యమైన ఈవెంట్‌లను చూడటానికి ఒక వేదికను అందిస్తుంది. భారతదేశంలో ఒలింపిక్ క్రీడల ప్రత్యేక మీడియా హక్కులను కలిగి ఉన్న వయాకామ్ 18 సహకారంతో, ఇండియా హౌస్‌లో కీలకమైన భారతీయ ఈవెంట్‌లు చూసేలా ప్రత్యేక వాచ్‌ పార్టీలను నిర్వహించనున్నారు. ఈ పెవిలియన్ క్రీడాభిమానులు, ప్రపంచ క్రీడా ప్రముఖులు, భారతీయ పర్యాటకులు, మీడియా, క్రీడాకారుల సహా అంతర్జాతీయ సమాజానికి భారతదేశం ప్రతిరూపాన్ని చూపిస్తుంది. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు తమ విజయాలను గౌరవించుకునేందుకు డెడికేటెడ్‌ హోమ్‌ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.

భిన్న ధ్రువాలను కలిపిన ఆమె - షూటింగ్​లో మను, సరబ్​ ట్రైనర్ ఎవరంటే? - Paris Olympics 2024

ఒలింపిక్స్​లో మను బాకర్​ విజయాల వెనక రానా - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.