ETV Bharat / sports

T20 వరల్డ్​కప్​పై బంగ్లా అల్లర్ల ఎఫెక్ట్- టోర్నమెంట్ ఆ దేశానికి షిఫ్ట్​! - Womens T20 World Cup 2024

author img

By ETV Bharat Sports Team

Published : Aug 6, 2024, 7:00 PM IST

Womens T20 World Cup 2024: బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుకుతోంది. ఈ నేపథ్యంలో ఈ దేశంలో ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సిన మహిళల టీ20 ప్రపంచ కప్​పై సందేహాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో అక్కడ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం నెలకొంది.

ICC Womens T20 World Cup
ICC Womens T20 World Cup (Source: Getty Images)

Womens T20 World Cup 2024: బంగ్లాదేశ్​లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోయారు. ఎక్కడ చూసినా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది జరిగే మహిళల టీ20 ప్రపంచకప్​నకు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కాగా, బంగ్లాదేశ్​లో అల్లర్ల నేపథ్యంలో ఆ దేశంలో మహిళల వరల్డ్ కప్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ వేదికను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వేదికలో మార్పు?
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్​కప్ బంగ్లాలో నిర్వహించడం సాధ్యసాధ్యాలపై ఐసీసీ మరో ప్లాన్​తో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తటస్థ దేశాలైన భారత్, శ్రీలంక, యూఏఈ వంటి ఏదో ఒక దేశంలో నిర్వహించే అవకాశం ఉంది. 'ఐసీసీ దాని సభ్య దేశాలన్నింటిలో స్వతంత్ర భద్రతా పర్యవేక్షణ వ్యవస్థను కలిగి ఉంది. బంగ్లాదేశ్​లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ ప్రారంభానికి ఇంకా ఏడు వారాల సమయం ఉంది. ఈ మెగా టోర్నీని బంగ్లాదేశ్ నుంచి మారుస్తారా లేదా అని ఇప్పుడే వ్యాఖ్యానించడం చాలా తొందరపాటు అవుతుంది' అని ఐసీసీ బోర్డు మెంబర్ ఒకరు వ్యాఖ్యానించారు.

అక్టోబరు 3 నుంచి 20వ తేదీ వరకు మహిళల టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. ఈ మెగా టోర్నీ మ్యాచ్​లు ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. అయితే బంగ్లాదేశ్​లో అల్లర్ల నేపథ్యంలో ఆ దేశానికి ఎవరూ వెళ్లవద్దని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు బంగ్లాదేశ్​లో టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు వెళ్తుందా అనే ప్రశ్న ఎదురువుతోంది.

శ్రీలంక, భారత్, యూఏఈలో ఏదో ఒకటి!
కాగా, 2022 మార్చిలో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో ఆస్ట్రేలియా జట్టు ఆ దేశ పర్యటనకు వెళ్లింది. ఈ నేపథ్యంలో బంగ్లాకు వెళ్లేందుకు ప్రపంచ క్రికెట్ జట్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో తెలియాల్సి ఉంది. ఒకవేళ బంగ్లాలో ప్రపంచకప్ నాటికి పరిస్థితులు మారకపోతే ఆ దేశం నుంచి వేదికను మార్చే అవకాశం లేకపోలేదు. శ్రీలంక, భారత్, యూఏఈలో ఏదైనా దేశాన్ని ఎంచుకోవచ్చు.

ఫైనల్​కు దూసుకెళ్లిన టీమ్ఇండియా- సెమీస్​లో బంగ్లా చిత్తు- 10వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ - WOmens Asia Cup 2024

ఆసియా కప్ ఛాంపియన్​గా శ్రీలంక- ఫైనల్​లో తడబడ్డ భారత్ - Womens Asia Cup 2024

Womens T20 World Cup 2024: బంగ్లాదేశ్​లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోయారు. ఎక్కడ చూసినా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది జరిగే మహిళల టీ20 ప్రపంచకప్​నకు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కాగా, బంగ్లాదేశ్​లో అల్లర్ల నేపథ్యంలో ఆ దేశంలో మహిళల వరల్డ్ కప్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ వేదికను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వేదికలో మార్పు?
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్​కప్ బంగ్లాలో నిర్వహించడం సాధ్యసాధ్యాలపై ఐసీసీ మరో ప్లాన్​తో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తటస్థ దేశాలైన భారత్, శ్రీలంక, యూఏఈ వంటి ఏదో ఒక దేశంలో నిర్వహించే అవకాశం ఉంది. 'ఐసీసీ దాని సభ్య దేశాలన్నింటిలో స్వతంత్ర భద్రతా పర్యవేక్షణ వ్యవస్థను కలిగి ఉంది. బంగ్లాదేశ్​లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ ప్రారంభానికి ఇంకా ఏడు వారాల సమయం ఉంది. ఈ మెగా టోర్నీని బంగ్లాదేశ్ నుంచి మారుస్తారా లేదా అని ఇప్పుడే వ్యాఖ్యానించడం చాలా తొందరపాటు అవుతుంది' అని ఐసీసీ బోర్డు మెంబర్ ఒకరు వ్యాఖ్యానించారు.

అక్టోబరు 3 నుంచి 20వ తేదీ వరకు మహిళల టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. ఈ మెగా టోర్నీ మ్యాచ్​లు ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. అయితే బంగ్లాదేశ్​లో అల్లర్ల నేపథ్యంలో ఆ దేశానికి ఎవరూ వెళ్లవద్దని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు బంగ్లాదేశ్​లో టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు వెళ్తుందా అనే ప్రశ్న ఎదురువుతోంది.

శ్రీలంక, భారత్, యూఏఈలో ఏదో ఒకటి!
కాగా, 2022 మార్చిలో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో ఆస్ట్రేలియా జట్టు ఆ దేశ పర్యటనకు వెళ్లింది. ఈ నేపథ్యంలో బంగ్లాకు వెళ్లేందుకు ప్రపంచ క్రికెట్ జట్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో తెలియాల్సి ఉంది. ఒకవేళ బంగ్లాలో ప్రపంచకప్ నాటికి పరిస్థితులు మారకపోతే ఆ దేశం నుంచి వేదికను మార్చే అవకాశం లేకపోలేదు. శ్రీలంక, భారత్, యూఏఈలో ఏదైనా దేశాన్ని ఎంచుకోవచ్చు.

ఫైనల్​కు దూసుకెళ్లిన టీమ్ఇండియా- సెమీస్​లో బంగ్లా చిత్తు- 10వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ - WOmens Asia Cup 2024

ఆసియా కప్ ఛాంపియన్​గా శ్రీలంక- ఫైనల్​లో తడబడ్డ భారత్ - Womens Asia Cup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.