ETV Bharat / sports

ICC ఛైర్మన్​గా జై షా- ఏకగ్రీవంగా ఎన్నిక - Jay Shah ICC Chairman

author img

By ETV Bharat Sports Team

Published : Aug 27, 2024, 8:20 PM IST

Jay Shah ICC Chairman: బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్​గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Jay Shah ICC Chairman
Jay Shah ICC Chairman (Source: Getty Images)

Jay Shah ICC Chairman: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్​గా బీసీసీఐ సెక్రటరీ జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ అత్యన్నత పదవికి జై షా మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ పదవికి కేవలం ఒక్క జై షా నామినేషనే దాఖలైంది. దీంతో ఎలాంటి ఎన్నిక లేకుండానే జై షా క్రికెట్ అత్యున్నత బోర్డుకు ఛైర్మన్ అయ్యారు. 2024 డిసెంబర్ 1న జై షా ఐసీసీ ఛైర్మన్​గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్లపాటు జై షా ఆ పదవిలో కొనసాగుతారు.

ఇక ఐసీసీ ఛైర్మన్​గా ఎన్నికైన సందర్భంగా జై షా మాట్లాడారు. 'క్రికెట్​ను ప్రంపచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు పనిచేస్తాను. ఐసీసీ సభ్య దేశాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా. 2028 లాస్ ఏంజిలెస్​ ఒలింపిక్స్​లో క్రికెట్ నిర్వహించడం అత్యంత ముఖ్యమైన సవాళ్లు, అవకాశాలలో ఇది ఒకటి' అని జై షా అన్నారు. ఇక ప్రస్తుతం జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రెసిడెంట్, బీసీసీఐ సెక్రటరీగా కొనసాగుతున్నారు. అయితే ఐసీసీ ఛైర్మన్​గా ఎన్నికవ్వడం వల్ల ఆయన ఈ రెండు పదవులకు రాజీనామా చేయవలసి ఉంటుంది.

కాగా, ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ జార్జీ బార్క్​లే 2020లో తొలిసారి ఆ బాధ్యతలు చేపట్టారు. 2022లో కూడా తిరిగి ఆయనే ఎన్నికయ్యారు. ఇక మూడోసారి ఆ బాధ్యతల్లో కొనసాగేందుకు జార్జీ బార్క్​లేకు అర్హత ఉన్నప్పటికీ ఆయన ఆసక్తి చూపలేదు. 2024 నవంబర్​లో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో జై షా ఎన్నిక జరిగింది.

ఐదో భారతీయుడిగా
అయితే క్రికెట్​లో అత్యున్నత బోర్డు ఐసీసీకి ఛైర్మన్​గా ఎంపికైన ఐదో భారతీయుడిగా జై షా నిలిచారు. గతంలో జై షా కంటే ముందు జగన్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్‌ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్‌ భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇక ఐసీసీ ఛైర్మన్ పదవిని చేపట్టనున్న అతి పిన్న యవస్కుడిగా జై షా ఘనత సాధించనున్నారు.

ఐసీసీ ఛైర్మన్​గా జైషా! BCCI సెక్రటరీగా బీజేపీ నేత కుమారుడు!! - BCCI Secretary Post

కోహ్లీ, రోహిత్​ను అలా చేయాలని కోరడం కరెక్ట్ కాదు! : జై షా - Rinku Singh Domestic Cricket

Jay Shah ICC Chairman: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్​గా బీసీసీఐ సెక్రటరీ జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ అత్యన్నత పదవికి జై షా మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ పదవికి కేవలం ఒక్క జై షా నామినేషనే దాఖలైంది. దీంతో ఎలాంటి ఎన్నిక లేకుండానే జై షా క్రికెట్ అత్యున్నత బోర్డుకు ఛైర్మన్ అయ్యారు. 2024 డిసెంబర్ 1న జై షా ఐసీసీ ఛైర్మన్​గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్లపాటు జై షా ఆ పదవిలో కొనసాగుతారు.

ఇక ఐసీసీ ఛైర్మన్​గా ఎన్నికైన సందర్భంగా జై షా మాట్లాడారు. 'క్రికెట్​ను ప్రంపచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు పనిచేస్తాను. ఐసీసీ సభ్య దేశాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా. 2028 లాస్ ఏంజిలెస్​ ఒలింపిక్స్​లో క్రికెట్ నిర్వహించడం అత్యంత ముఖ్యమైన సవాళ్లు, అవకాశాలలో ఇది ఒకటి' అని జై షా అన్నారు. ఇక ప్రస్తుతం జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రెసిడెంట్, బీసీసీఐ సెక్రటరీగా కొనసాగుతున్నారు. అయితే ఐసీసీ ఛైర్మన్​గా ఎన్నికవ్వడం వల్ల ఆయన ఈ రెండు పదవులకు రాజీనామా చేయవలసి ఉంటుంది.

కాగా, ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ జార్జీ బార్క్​లే 2020లో తొలిసారి ఆ బాధ్యతలు చేపట్టారు. 2022లో కూడా తిరిగి ఆయనే ఎన్నికయ్యారు. ఇక మూడోసారి ఆ బాధ్యతల్లో కొనసాగేందుకు జార్జీ బార్క్​లేకు అర్హత ఉన్నప్పటికీ ఆయన ఆసక్తి చూపలేదు. 2024 నవంబర్​లో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో జై షా ఎన్నిక జరిగింది.

ఐదో భారతీయుడిగా
అయితే క్రికెట్​లో అత్యున్నత బోర్డు ఐసీసీకి ఛైర్మన్​గా ఎంపికైన ఐదో భారతీయుడిగా జై షా నిలిచారు. గతంలో జై షా కంటే ముందు జగన్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్‌ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్‌ భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇక ఐసీసీ ఛైర్మన్ పదవిని చేపట్టనున్న అతి పిన్న యవస్కుడిగా జై షా ఘనత సాధించనున్నారు.

ఐసీసీ ఛైర్మన్​గా జైషా! BCCI సెక్రటరీగా బీజేపీ నేత కుమారుడు!! - BCCI Secretary Post

కోహ్లీ, రోహిత్​ను అలా చేయాలని కోరడం కరెక్ట్ కాదు! : జై షా - Rinku Singh Domestic Cricket

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.