ETV Bharat / spiritual

'దైవ స్మరణకు అందరూ అర్హులే'- అంటరానితనంపై రామానుజాచార్యుల అలుపెరగని పోరాటం! - SRI RAMANUJA JAYANTI Special

author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 12:50 PM IST

Sri Ramanuja Jayanti 2024 : ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్లుగా కొంతమంది మహానుభావులు కారణజన్ములు. అలాంటి వారు వారి జీవిత కాలంలో తమ తరంతో పాటు, తమ భవిష్యత్  తరాలను కూడా ఉద్దరించడానికి పూనుకుంటారు. వెయ్యేళ్ళ తర్వాత కూడా ఓ మహానుభావుడి ప్రభావం మన పైన ఉందంటే అతను సామాన్యుడు కాదని అర్ధం అవుతుంది. అలాంటి ఓ మహానుభావుని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

Sri Ramanuja Jayanti 2024
Sri Ramanuja Jayanti 2024 (Getty Images)

Sri Ramanuja Jayanti 2024 : హిందూ ధర్మ పరిరక్షణే ఊపిరిగా హిందూ ధర్మ రక్షణ కోసం నడుం బిగించిన మహనుభావులలో శ్రీ రామానుజాచార్యులు ఒకరు. వైశాఖ శుద్ధ పంచమి శ్రీ రామానుజ జయంతి సందర్భంగా రామానుజాచార్యులు ప్రచారం చేసిన సిద్ధాంతాలను గురించి తెలుసుకుందాం.

విశిష్టాద్వైత సిధ్ధాంత ప్రచారకర్త
రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరులో చైత్ర శుద్ధ పంచమి, ఆరుద్ర నక్షత్రం రోజున జన్మించారు. దాదాపు 123 ఏళ్ళు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు.

ఆదిశంకరుల బాటలో పయనం
దాదాపు వెయ్యి సంవత్సరాల కిందట ఆది శంకరుల జయంతికి ఒక్క రోజు తర్వాత జన్మించిన రామానుజులు, శంకరుల అద్వైతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవతరించారు. అయితే ఆదిశంకరుల అద్వైతాన్ని విశేషంగా ప్రచారం చేస్తే రామానుజులు ఆ అద్వైతం శ్రీ మహావిష్ణువే అని నొక్కి చెప్పారు. అద్వైతం అంటే ఉన్నది ఒకటే అని, శైవ వైష్ణవ భేదాలు లేవని శంకరులు ప్రచారం చేసారు. అయితే రామానుజులు కూడా ఉన్నది ఒక్కటే అని ఆ ఒక్కటి శ్రీ మహావిష్ణువే అని ప్రచారం చేయడం గమనార్హం. అందుకే రామానుజులు ప్రచారం చేసింది విశిష్టాద్వైతం అంటారు.

విశిష్టాద్వైతం ఎందుకు
ఆది శంకరుల వారు తమ కాలంలో ప్రబలంగా పాతుకొని పోయి ఉన్న దురాచారాలను ఖండించడానికి అద్వైతాన్ని ప్రచారం చేసారు. కానీ రామానుజుల కాలం నాటికి పరిస్థితులు మారిపోయాయి. హిందూ మతాన్ని బౌద్ధ, జైన మతాల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రామానుజులు నిరాకార పరబ్రహ్మాన్ని ఉపాసించే అద్వైతానికు బదులుగా మూర్తి రూపంలో విష్ణువును పూజించే విశిష్టాద్వైతంను ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకు వచ్చారు.

ఆదర్శవాది
రామానుజులు మనుష్యులంతా ఒక్కటే అని నమ్మిన ఆదర్శవాది. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రామానుజుల కాలంలో అష్టాక్షరీ మంత్రం పరమ రహస్యంగా ఉండేది. ఈ మంత్రం ఎవరు పడితే వారు అనుష్ఠానం చేయకూడదని నియమం ఉండేది. అందుకే సదాచార సంపన్నులైన పెద్దలు, గురువులు అర్హులైన వారికి మాత్రమే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించే వారు. అంతే కాదు ఈ మంత్రాన్ని గురు ముఖతా ఉపదేశం పొందిన వారికి ముక్తి కలుగుతుందని ప్రబల విశ్వాసం. ఎవరైతే ఈ మంత్రాన్ని బహిరంగంగా ప్రకటిస్తారో వారు నరకానికి వెళ్తారన్న మూఢ నమ్మకం కూడా ఆనాటి సమాజంలో ఎక్కువ ఉండేవి.

జనహితమే తనమతం
రామానుజులు సమాజ శ్రేయస్సు కోసం అందరి బాగు కోసం, తానొక్కడు నరకాన్ని వెళ్లినా ఫర్వాలేదని అనుకున్నారు. ఆ రోజుల్లోనే అందరినీ ఎదిరించి ఆలయ గోపురం పైకి ఎక్కి అష్టాక్షరీ మంత్రాన్ని సామాన్యులందరికీ బోధించిన నిస్వార్థపరుడు. ఈ మంత్రోపదేశంతో అందరికీ ముక్తి కలిగితే తన జీవితం ధన్యమని భావించి సహజీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు.

భక్తి ఉద్యమానికి మూలపురుషుడు
హిందువులు పరమ పవిత్రంగా భావించే గాయత్రీ మంత్రం అందరికీ అందించిన మహాపురుషుడు రామానుజులు. రామానుజులను ఆదర్శంగా తీసుకొని ఆ తరువాతి కాలంలో ఎందరో అవతార పురుషులు ఆయన మార్గాన్ని నమ్మి ఆచరించి ఆదర్శంగా నిలిచారు.

ఆధ్యాత్మిక సుగంధం
భగవద్రామానుజులు విశిష్టాద్వైత సంప్రదాయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రచారంలోకి తీసుకురావడమే కాకుండా నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగిన వారందరూ మంత్రాలకూ, మంత్రార్థాలకూ అర్హులేనని ఉపదేశం చేశారు. భగవంతుని నామాన్ని ఉచ్చరించడానికి అందరూ అర్హులే అని, అందులో ఎలాంటి ఆంక్షలూ, ఆటంకాలూ లేవనీ, అన్ని వర్ణాల వారు ఆలయ ప్రవేశార్హులనీ చాటి చెప్పారు. అన్ని వర్ణాల వారికి మంత్రోపదేశం చేసి, వారికి ఆలయ ప్రవేశాలను కల్పించడం ద్వారా ఆధ్యాత్మిక సామ్యవాదాన్ని ఆచరణ పూర్వకంగా చూపారు. వెయ్యేళ్ల కిందటే భవిష్యత్ భారతావనికి దారిచూపిన ఆధ్యాత్మిక సుగంధం శ్రీ రామానుజులు.

ఆధ్యాత్మిక స్థిరత్వానికి దిశా నిర్దేశం
ఈ నాటికి సమాజంలో ఎప్పుడైనా ఆర్థిక సామాజిక రాజకీయ, మతపరమైన ఉద్రిక్తతలు వచ్చి మతసామరస్యం లేక అస్థిరత్వంతో, అపనమ్మకంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో శ్రీమద్రామానుజులు చూపిన విశిష్టాద్వైతం, ఆధ్యాత్మిక స్థిరత్వం సాధించడానికి దిశా నిర్దేశం చేస్తాయి.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

వెంకన్నకు తలనీలాలు ఇస్తే గండాలు పోతాయా? అసలు ఎందుకు ఇస్తారో తెలుసా? - why we offer hair in tirupati

ఏడాదిలో 12గంటలే సింహాద్రి అప్పన నిజరూప దర్శనం- అక్షయ తృతీయ రోజు మాత్రమే- ఎందుకంటే? - Simhachalam Chandanotsavam 2024

Sri Ramanuja Jayanti 2024 : హిందూ ధర్మ పరిరక్షణే ఊపిరిగా హిందూ ధర్మ రక్షణ కోసం నడుం బిగించిన మహనుభావులలో శ్రీ రామానుజాచార్యులు ఒకరు. వైశాఖ శుద్ధ పంచమి శ్రీ రామానుజ జయంతి సందర్భంగా రామానుజాచార్యులు ప్రచారం చేసిన సిద్ధాంతాలను గురించి తెలుసుకుందాం.

విశిష్టాద్వైత సిధ్ధాంత ప్రచారకర్త
రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరులో చైత్ర శుద్ధ పంచమి, ఆరుద్ర నక్షత్రం రోజున జన్మించారు. దాదాపు 123 ఏళ్ళు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు.

ఆదిశంకరుల బాటలో పయనం
దాదాపు వెయ్యి సంవత్సరాల కిందట ఆది శంకరుల జయంతికి ఒక్క రోజు తర్వాత జన్మించిన రామానుజులు, శంకరుల అద్వైతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవతరించారు. అయితే ఆదిశంకరుల అద్వైతాన్ని విశేషంగా ప్రచారం చేస్తే రామానుజులు ఆ అద్వైతం శ్రీ మహావిష్ణువే అని నొక్కి చెప్పారు. అద్వైతం అంటే ఉన్నది ఒకటే అని, శైవ వైష్ణవ భేదాలు లేవని శంకరులు ప్రచారం చేసారు. అయితే రామానుజులు కూడా ఉన్నది ఒక్కటే అని ఆ ఒక్కటి శ్రీ మహావిష్ణువే అని ప్రచారం చేయడం గమనార్హం. అందుకే రామానుజులు ప్రచారం చేసింది విశిష్టాద్వైతం అంటారు.

విశిష్టాద్వైతం ఎందుకు
ఆది శంకరుల వారు తమ కాలంలో ప్రబలంగా పాతుకొని పోయి ఉన్న దురాచారాలను ఖండించడానికి అద్వైతాన్ని ప్రచారం చేసారు. కానీ రామానుజుల కాలం నాటికి పరిస్థితులు మారిపోయాయి. హిందూ మతాన్ని బౌద్ధ, జైన మతాల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రామానుజులు నిరాకార పరబ్రహ్మాన్ని ఉపాసించే అద్వైతానికు బదులుగా మూర్తి రూపంలో విష్ణువును పూజించే విశిష్టాద్వైతంను ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకు వచ్చారు.

ఆదర్శవాది
రామానుజులు మనుష్యులంతా ఒక్కటే అని నమ్మిన ఆదర్శవాది. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రామానుజుల కాలంలో అష్టాక్షరీ మంత్రం పరమ రహస్యంగా ఉండేది. ఈ మంత్రం ఎవరు పడితే వారు అనుష్ఠానం చేయకూడదని నియమం ఉండేది. అందుకే సదాచార సంపన్నులైన పెద్దలు, గురువులు అర్హులైన వారికి మాత్రమే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించే వారు. అంతే కాదు ఈ మంత్రాన్ని గురు ముఖతా ఉపదేశం పొందిన వారికి ముక్తి కలుగుతుందని ప్రబల విశ్వాసం. ఎవరైతే ఈ మంత్రాన్ని బహిరంగంగా ప్రకటిస్తారో వారు నరకానికి వెళ్తారన్న మూఢ నమ్మకం కూడా ఆనాటి సమాజంలో ఎక్కువ ఉండేవి.

జనహితమే తనమతం
రామానుజులు సమాజ శ్రేయస్సు కోసం అందరి బాగు కోసం, తానొక్కడు నరకాన్ని వెళ్లినా ఫర్వాలేదని అనుకున్నారు. ఆ రోజుల్లోనే అందరినీ ఎదిరించి ఆలయ గోపురం పైకి ఎక్కి అష్టాక్షరీ మంత్రాన్ని సామాన్యులందరికీ బోధించిన నిస్వార్థపరుడు. ఈ మంత్రోపదేశంతో అందరికీ ముక్తి కలిగితే తన జీవితం ధన్యమని భావించి సహజీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు.

భక్తి ఉద్యమానికి మూలపురుషుడు
హిందువులు పరమ పవిత్రంగా భావించే గాయత్రీ మంత్రం అందరికీ అందించిన మహాపురుషుడు రామానుజులు. రామానుజులను ఆదర్శంగా తీసుకొని ఆ తరువాతి కాలంలో ఎందరో అవతార పురుషులు ఆయన మార్గాన్ని నమ్మి ఆచరించి ఆదర్శంగా నిలిచారు.

ఆధ్యాత్మిక సుగంధం
భగవద్రామానుజులు విశిష్టాద్వైత సంప్రదాయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రచారంలోకి తీసుకురావడమే కాకుండా నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగిన వారందరూ మంత్రాలకూ, మంత్రార్థాలకూ అర్హులేనని ఉపదేశం చేశారు. భగవంతుని నామాన్ని ఉచ్చరించడానికి అందరూ అర్హులే అని, అందులో ఎలాంటి ఆంక్షలూ, ఆటంకాలూ లేవనీ, అన్ని వర్ణాల వారు ఆలయ ప్రవేశార్హులనీ చాటి చెప్పారు. అన్ని వర్ణాల వారికి మంత్రోపదేశం చేసి, వారికి ఆలయ ప్రవేశాలను కల్పించడం ద్వారా ఆధ్యాత్మిక సామ్యవాదాన్ని ఆచరణ పూర్వకంగా చూపారు. వెయ్యేళ్ల కిందటే భవిష్యత్ భారతావనికి దారిచూపిన ఆధ్యాత్మిక సుగంధం శ్రీ రామానుజులు.

ఆధ్యాత్మిక స్థిరత్వానికి దిశా నిర్దేశం
ఈ నాటికి సమాజంలో ఎప్పుడైనా ఆర్థిక సామాజిక రాజకీయ, మతపరమైన ఉద్రిక్తతలు వచ్చి మతసామరస్యం లేక అస్థిరత్వంతో, అపనమ్మకంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో శ్రీమద్రామానుజులు చూపిన విశిష్టాద్వైతం, ఆధ్యాత్మిక స్థిరత్వం సాధించడానికి దిశా నిర్దేశం చేస్తాయి.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

వెంకన్నకు తలనీలాలు ఇస్తే గండాలు పోతాయా? అసలు ఎందుకు ఇస్తారో తెలుసా? - why we offer hair in tirupati

ఏడాదిలో 12గంటలే సింహాద్రి అప్పన నిజరూప దర్శనం- అక్షయ తృతీయ రోజు మాత్రమే- ఎందుకంటే? - Simhachalam Chandanotsavam 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.