ETV Bharat / spiritual

గురు ప్రదోష పూజ చేసుకుంటున్నారా? మీకోసం సింపుల్​గా వ్రతకథ! - Guru Pradosh Vrat 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 1, 2024, 2:26 AM IST

Guru Pradosh Vrat Katha Telugu : ఏ వ్రతమైనా, నోములైనా, పూజలైనా, ఆ వ్రత ఫలం సంపూర్ణంగా దక్కాలంటే శ్రద్ధ భక్తి అవసరం. ముఖ్యంగా నోములు, వ్రతాలు ఆచరించేటప్పుడు ఆ వ్రత కధలను చదువుకొని శిరస్సున అక్షింతలు వేసుకుంటేనే వ్రతం సంపూర్ణం అయినట్లుగా అర్థం. గురు ప్రదోష పూజ విధానం వివరంగా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు వ్రత కథను కూడా తెలుసుకుందాం.

Pradosh Vrat Katha Telugu
Pradosh Vrat Katha Telugu (ETV Bharat)

Guru Pradosh Vrat Katha Telugu : శివ మహా పురాణంలో, స్త్రీల నోములు, వ్రతాలు కథల పుస్తకాలలో ప్రదోష వ్రత కథ ఉంటుంది. పూర్వం ఒక నగరంలో ఓ బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్త చనిపోవడం వల్ల తన స్వశక్తితో కష్టపడి కొడుకులను పోషించుకుంటూ జీవనం సాగించేది. ఒకరోజు బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆ బ్రాహ్మణ స్త్రీకి గాయపడిన స్థితిలో ఉన్న ఒక యువకుడు కనిపిస్తాడు. ఆమె దయతో అతనిని ఇంటికి తీసుకొచ్చి సపర్యలు చేసింది. తర్వాత ఆ కుర్రాడు విదర్భ రాకుమారుడని తెలుసుకుంటుంది. శత్రు సైనికులు అతని రాజ్యం మీద దాడి చేసి ఆ యువకుని తండ్రిని బందీగా చేసుకుని రాజ్యాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని తెలుస్తుంది.

రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ కుమారులతో కలిసి అక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఒకరోజు అన్షుమతి అనే గంధర్వ కుమారి యువరాజుని చూసి ముగ్ధురాలు అవుతుంది. మరుసటి రోజు అన్షుమతి తన తల్లిదండ్రులతో కలిసి యువరాజుని కలుస్తుంది. కొన్ని రోజులకు శివుడు అన్షుమతి తల్లిదండ్రులకు కలలో కనిపించి వారి పెళ్లి చేయాలని ఆదేశిస్తాడు.

ప్రదోష వ్రత ప్రభావం
బ్రాహ్మణ స్త్రీ శివుడి పరమ భక్తురాలు. ప్రదోష వ్రతం తప్పనిసరిగా పాటిస్తూ వచ్చేది. ఆమె ప్రదోష వ్రత ఫలితం వల్ల అన్షుమతి తండ్రి అయిన గంధర్వ రాజు తన సైన్యంతో కలిసి యువరాజు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న విదర్భ మీద దాడి చేసి విజయం సాధిస్తాడు. శత్రువులని తరిమేసి యువరాజు తండ్రిని కూడా బంధీల నుంచి విముక్తుడిని చేస్తాడు. అందుకే ప్రదోష వ్రతం నాడు ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తే భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరతాయని నమ్ముతారు. యువరాజు ఆ బ్రాహ్మణ స్త్రీ ఆశ్రయాన్ని పొందిన తర్వాతనే తన కష్టాల నుంచి విముక్తి పొందడంతో పాటు తన తండ్రిని కూడా శత్రు రాజుల నుంచి విడిపిస్తాడు. అందుకే ప్రదోష వ్రతానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. గురు ప్రదోష పూజ చేసుకున్నవారు ఈ కథను చదువుకుని శిరస్సున అక్షింతలు వేసుకుంటే గురు ప్రదోష వ్రత ఫలం దక్కుతుంది.

గురు అనుకూలత
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు ప్రదోష వ్రతం చేయడం వలన జాతకంలో గురు దోషాలు తొలగి పోయి జీవితంలో చేసే ప్రతి పనిలోనూ అనుకూలతలు ఉంటాయి. అవివాహితులకు వివాహం కావడం, ఉద్యోగంలో పదోన్నతులు పొందడం, వ్యాపారంలో లాభాలు ఇవన్నీ కూడా గురు గ్రహ అనుకూలత వల్లనే కలుగుతాయి. ముఖ్యం గురువారం ప్రదోషం కలిసి వచ్చిన రోజు చేసే గురు ప్రదోష పూజ వలన సకల శుభాలు చేకూరుతాయని శాస్త్ర వచనం. రానున్న గురు ప్రదోషం రోజు మనం కూడా ప్రదోష వ్రతాన్ని ఆచరిద్దాం. సకల శుభాలను పొందుదాం. ఓం నమః శివాయ

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

Guru Pradosh Vrat Katha Telugu : శివ మహా పురాణంలో, స్త్రీల నోములు, వ్రతాలు కథల పుస్తకాలలో ప్రదోష వ్రత కథ ఉంటుంది. పూర్వం ఒక నగరంలో ఓ బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్త చనిపోవడం వల్ల తన స్వశక్తితో కష్టపడి కొడుకులను పోషించుకుంటూ జీవనం సాగించేది. ఒకరోజు బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆ బ్రాహ్మణ స్త్రీకి గాయపడిన స్థితిలో ఉన్న ఒక యువకుడు కనిపిస్తాడు. ఆమె దయతో అతనిని ఇంటికి తీసుకొచ్చి సపర్యలు చేసింది. తర్వాత ఆ కుర్రాడు విదర్భ రాకుమారుడని తెలుసుకుంటుంది. శత్రు సైనికులు అతని రాజ్యం మీద దాడి చేసి ఆ యువకుని తండ్రిని బందీగా చేసుకుని రాజ్యాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని తెలుస్తుంది.

రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ కుమారులతో కలిసి అక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఒకరోజు అన్షుమతి అనే గంధర్వ కుమారి యువరాజుని చూసి ముగ్ధురాలు అవుతుంది. మరుసటి రోజు అన్షుమతి తన తల్లిదండ్రులతో కలిసి యువరాజుని కలుస్తుంది. కొన్ని రోజులకు శివుడు అన్షుమతి తల్లిదండ్రులకు కలలో కనిపించి వారి పెళ్లి చేయాలని ఆదేశిస్తాడు.

ప్రదోష వ్రత ప్రభావం
బ్రాహ్మణ స్త్రీ శివుడి పరమ భక్తురాలు. ప్రదోష వ్రతం తప్పనిసరిగా పాటిస్తూ వచ్చేది. ఆమె ప్రదోష వ్రత ఫలితం వల్ల అన్షుమతి తండ్రి అయిన గంధర్వ రాజు తన సైన్యంతో కలిసి యువరాజు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న విదర్భ మీద దాడి చేసి విజయం సాధిస్తాడు. శత్రువులని తరిమేసి యువరాజు తండ్రిని కూడా బంధీల నుంచి విముక్తుడిని చేస్తాడు. అందుకే ప్రదోష వ్రతం నాడు ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తే భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరతాయని నమ్ముతారు. యువరాజు ఆ బ్రాహ్మణ స్త్రీ ఆశ్రయాన్ని పొందిన తర్వాతనే తన కష్టాల నుంచి విముక్తి పొందడంతో పాటు తన తండ్రిని కూడా శత్రు రాజుల నుంచి విడిపిస్తాడు. అందుకే ప్రదోష వ్రతానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. గురు ప్రదోష పూజ చేసుకున్నవారు ఈ కథను చదువుకుని శిరస్సున అక్షింతలు వేసుకుంటే గురు ప్రదోష వ్రత ఫలం దక్కుతుంది.

గురు అనుకూలత
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు ప్రదోష వ్రతం చేయడం వలన జాతకంలో గురు దోషాలు తొలగి పోయి జీవితంలో చేసే ప్రతి పనిలోనూ అనుకూలతలు ఉంటాయి. అవివాహితులకు వివాహం కావడం, ఉద్యోగంలో పదోన్నతులు పొందడం, వ్యాపారంలో లాభాలు ఇవన్నీ కూడా గురు గ్రహ అనుకూలత వల్లనే కలుగుతాయి. ముఖ్యం గురువారం ప్రదోషం కలిసి వచ్చిన రోజు చేసే గురు ప్రదోష పూజ వలన సకల శుభాలు చేకూరుతాయని శాస్త్ర వచనం. రానున్న గురు ప్రదోషం రోజు మనం కూడా ప్రదోష వ్రతాన్ని ఆచరిద్దాం. సకల శుభాలను పొందుదాం. ఓం నమః శివాయ

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.