ETV Bharat / spiritual

'కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు!'- జడ భరతుడి కథ తెలుసా? - Jad Bharat Charitra

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 3:37 AM IST

Jad Bharat Story In Telugu : ఎంతటి మహాత్ములైన కర్మానుబంధాల నుంచి తప్పించుకోలేరన్న సత్యాన్ని గ్రహించాలంటే జడ భరతుని కథను తెలుసుకోవాల్సిందే! గొప్ప తపః శాలి అయిన జడ భరతుడు జన్మ రాహిత్యం కోసం తపస్సు చేసి కూడా తిరిగి ఎందుకు జన్మ ఎత్తవలసి వచ్చిందన్న విషయాలను తెలుసుకుందాం.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Jad Bharat Story In Telugu : పూర్వంలో ఋషభుడనే రాజుకు కుమారుడు జడ భరతుడు. 'జడ' అంటే నిశ్చలం దేనికి చలించినది అని అర్థం. జడభరతుడు రాకుమారుడైనా అందరిలా భోగాల మీద, విలాసాల మీద ఆసక్తి లేకుండా దైవభక్తి పరాయణుడై ఉండేవాడు. జడ భరతునికి సహజంగా వేటి మీదా ఆసక్తి లేకపోయినా క్షత్రియ ధర్మం ప్రకారం తన తండ్రి తదనంతరం రాజ్యపాలన చేయాల్సి వచ్చింది. ఎన్నో సంవత్సరాలపాటు ధర్మబద్ధంగా పరిపాలించిన భరతుని పాలనలో ప్రజలు ఏ లోటూ లేకుండా హాయిగా ఉన్నారు. ఓ వైపు పరిపాలన చేస్తూనే, జపధ్యానాలలో మునిగి తేలేవాడు.

వానప్రస్థం
కాలక్రమంలో భరతునికి వృద్ధాప్యం వచ్చింది. అప్పుడు రాజ్య బాధ్యతలను తన కుమారులకు అప్పగించి భరతుడు ప్రజా జీవనానికి దూరంగా ఒక నదీతీరానికి వెళ్లి, అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకుని, ప్రశాంతంగా తపస్సు చేసుకోసాగాడు. జన్మరాహిత్యాన్ని అంటే పునర్జన్మ లేకుండా ఉండే వరాన్ని కోరుకుంటూ ఆయన చేసిన తపస్సుకు ఆ శ్రీమన్నారాయణుడు సంతోషించాడు. ఇక భరతునికి మోక్షాన్ని ప్రసాదించాలని అనుకున్నాడు. ఇంతలో అనుకోని సంఘటన జరిగింది. ఆ సంఘటన భరతుని జీవితాన్నే మార్చి వేసింది.

జడ భరతుడు రోజూ నదిలో స్నానం చేసి ఒడ్డునే కూర్చుని ధ్యానం చేసుకోవడం అలవాటు. రోజూ మాదిరిగానే ఆ రోజు కూడా భరతుడు స్నానం చేసి ధ్యానం చేసుకుంటుండగా నిండు చూలింత అయిన లేడి ఒకటి అక్కడ నీళ్లు తాగడానికి వచ్చింది. ఆ లేడికి సమీపంలోనే పులి గాండ్రింపు వినపడింది. అదే సమయంలో ఆకాశంలో పెద్ద ధ్వనితో పిడుగు పడింది. ఈ రెండు సంఘటనలకు బెదిరిపోయిన లేడి భయంతో ఒక్క గంతు వేసింది. ఆ దెబ్బకు దానికి ప్రసవం జరిగి లేడి పిల్ల పుట్టింది. తల్లి లేడి మాత్రం నదిలో మునిగి చనిపోతుంది. దూరం నుంచి ఇదంతా చూస్తున్న జడ భరతుడు అక్కడికి వెళ్లేసరికి లేడిపిల్ల కూడా నదిలో మునిగిపోసాగింది. వెంటనే భరతుడు లేడిపిల్లను రక్షించి చేరదీశాడు. తల్లి కూడా లేని ఆ పసికూనను కొద్ది రోజులు పెంచి అడవిలో వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.

తల్లి లేని లేడి కూనకు అన్ని తానై మమకారంతో పెంచసాగాడు భరతుడు. చూస్తుండగానే లేడిపిల్ల పెద్దదై చెంగు చెంగున గెంతుతూ ఆశ్రమం అంతా తిరగసాగింది. భరతుడు దాని ధ్యాసలో పడి తన తపోదీక్షను కూడా పక్కన పెట్టాడు. చివరకు అది యజ్ఞానికని తెచ్చుకున్న సమిధలను అపరిశుభ్రం చేస్తున్నా, దర్భ గడ్డిని తొక్కిపాడుచేస్తున్నా, అదిలించేవాడు కాదు. లేడి పిల్ల కూడా భరతుడంటే ప్రాణాలు పెట్టేది. ఆయన తినిపిస్తే తప్ప పచ్చగడ్డి కూడా కొరికేది కాదు.

భరతుని చరమాంకం
ఓసారి ఆ లేడి అడవిలోకి వెళ్లి నాలుగు రోజుల పాటు తిరిగి రాలేదు. భరతుడు ఎంత వెతికినా దొరకలేదు. లేడిపిల్ల మీద బెంగతో భరతుడు జబ్బు పడ్డాడు. చివరకు తనకు చివరి ఘడియలు సమీపించాయని గ్రహించాడు. సరిగ్గా అదే సమయంలో ఆ లేడి పిల్ల వచ్చి, ఆయన కాళ్లు నాకుతూ ఉండిపోయింది. దానినే చూస్తూ, తన తర్వాత దాని బాగోగులు ఎవరు చూస్తారా అనే బెంగతో భరతుడు ప్రాణాలు విడిచాడు. ధర్మ శాస్త్రం ప్రకారం ఒక జీవుడు అంత్య సమయంలో దేని గురించి ఆలోచిస్తూ మరణిస్తాడో ఆ జన్మనే తీసుకుంటాడంట! భరతుడు కూడా మరుజన్మలో ఒక లేడిగా జన్మించాడు. ఆ తర్వాత ఆయన మరో జన్మ కూడా ఎత్తవలసి వచ్చింది.

కర్మఫలం తప్పదు
ఎంత తపస్సు చేసినా, ఎంత బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించినా విషయం వాంఛలను వీడకపోతే కర్మ ఫలాన్ని అనుభవించడానికి ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుందన్న నీతిని మనం ఈ కథ ద్వారా గ్రహించాలి. అందుకే పెద్దలు అంటారు కదా 'మరణ కాలే హరినామస్మరణే' అని! జీవితం చివరిదశలో నిరంతరం భగవన్నామ స్మరణం చేస్తుంటే జన్మరాహిత్యాన్ని పొంది ఆ శ్రీహరి పాదాల వద్దకు చేరుకుంటారని విశ్వాసం. జై శ్రీమన్నారాయణ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

Jad Bharat Story In Telugu : పూర్వంలో ఋషభుడనే రాజుకు కుమారుడు జడ భరతుడు. 'జడ' అంటే నిశ్చలం దేనికి చలించినది అని అర్థం. జడభరతుడు రాకుమారుడైనా అందరిలా భోగాల మీద, విలాసాల మీద ఆసక్తి లేకుండా దైవభక్తి పరాయణుడై ఉండేవాడు. జడ భరతునికి సహజంగా వేటి మీదా ఆసక్తి లేకపోయినా క్షత్రియ ధర్మం ప్రకారం తన తండ్రి తదనంతరం రాజ్యపాలన చేయాల్సి వచ్చింది. ఎన్నో సంవత్సరాలపాటు ధర్మబద్ధంగా పరిపాలించిన భరతుని పాలనలో ప్రజలు ఏ లోటూ లేకుండా హాయిగా ఉన్నారు. ఓ వైపు పరిపాలన చేస్తూనే, జపధ్యానాలలో మునిగి తేలేవాడు.

వానప్రస్థం
కాలక్రమంలో భరతునికి వృద్ధాప్యం వచ్చింది. అప్పుడు రాజ్య బాధ్యతలను తన కుమారులకు అప్పగించి భరతుడు ప్రజా జీవనానికి దూరంగా ఒక నదీతీరానికి వెళ్లి, అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకుని, ప్రశాంతంగా తపస్సు చేసుకోసాగాడు. జన్మరాహిత్యాన్ని అంటే పునర్జన్మ లేకుండా ఉండే వరాన్ని కోరుకుంటూ ఆయన చేసిన తపస్సుకు ఆ శ్రీమన్నారాయణుడు సంతోషించాడు. ఇక భరతునికి మోక్షాన్ని ప్రసాదించాలని అనుకున్నాడు. ఇంతలో అనుకోని సంఘటన జరిగింది. ఆ సంఘటన భరతుని జీవితాన్నే మార్చి వేసింది.

జడ భరతుడు రోజూ నదిలో స్నానం చేసి ఒడ్డునే కూర్చుని ధ్యానం చేసుకోవడం అలవాటు. రోజూ మాదిరిగానే ఆ రోజు కూడా భరతుడు స్నానం చేసి ధ్యానం చేసుకుంటుండగా నిండు చూలింత అయిన లేడి ఒకటి అక్కడ నీళ్లు తాగడానికి వచ్చింది. ఆ లేడికి సమీపంలోనే పులి గాండ్రింపు వినపడింది. అదే సమయంలో ఆకాశంలో పెద్ద ధ్వనితో పిడుగు పడింది. ఈ రెండు సంఘటనలకు బెదిరిపోయిన లేడి భయంతో ఒక్క గంతు వేసింది. ఆ దెబ్బకు దానికి ప్రసవం జరిగి లేడి పిల్ల పుట్టింది. తల్లి లేడి మాత్రం నదిలో మునిగి చనిపోతుంది. దూరం నుంచి ఇదంతా చూస్తున్న జడ భరతుడు అక్కడికి వెళ్లేసరికి లేడిపిల్ల కూడా నదిలో మునిగిపోసాగింది. వెంటనే భరతుడు లేడిపిల్లను రక్షించి చేరదీశాడు. తల్లి కూడా లేని ఆ పసికూనను కొద్ది రోజులు పెంచి అడవిలో వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.

తల్లి లేని లేడి కూనకు అన్ని తానై మమకారంతో పెంచసాగాడు భరతుడు. చూస్తుండగానే లేడిపిల్ల పెద్దదై చెంగు చెంగున గెంతుతూ ఆశ్రమం అంతా తిరగసాగింది. భరతుడు దాని ధ్యాసలో పడి తన తపోదీక్షను కూడా పక్కన పెట్టాడు. చివరకు అది యజ్ఞానికని తెచ్చుకున్న సమిధలను అపరిశుభ్రం చేస్తున్నా, దర్భ గడ్డిని తొక్కిపాడుచేస్తున్నా, అదిలించేవాడు కాదు. లేడి పిల్ల కూడా భరతుడంటే ప్రాణాలు పెట్టేది. ఆయన తినిపిస్తే తప్ప పచ్చగడ్డి కూడా కొరికేది కాదు.

భరతుని చరమాంకం
ఓసారి ఆ లేడి అడవిలోకి వెళ్లి నాలుగు రోజుల పాటు తిరిగి రాలేదు. భరతుడు ఎంత వెతికినా దొరకలేదు. లేడిపిల్ల మీద బెంగతో భరతుడు జబ్బు పడ్డాడు. చివరకు తనకు చివరి ఘడియలు సమీపించాయని గ్రహించాడు. సరిగ్గా అదే సమయంలో ఆ లేడి పిల్ల వచ్చి, ఆయన కాళ్లు నాకుతూ ఉండిపోయింది. దానినే చూస్తూ, తన తర్వాత దాని బాగోగులు ఎవరు చూస్తారా అనే బెంగతో భరతుడు ప్రాణాలు విడిచాడు. ధర్మ శాస్త్రం ప్రకారం ఒక జీవుడు అంత్య సమయంలో దేని గురించి ఆలోచిస్తూ మరణిస్తాడో ఆ జన్మనే తీసుకుంటాడంట! భరతుడు కూడా మరుజన్మలో ఒక లేడిగా జన్మించాడు. ఆ తర్వాత ఆయన మరో జన్మ కూడా ఎత్తవలసి వచ్చింది.

కర్మఫలం తప్పదు
ఎంత తపస్సు చేసినా, ఎంత బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించినా విషయం వాంఛలను వీడకపోతే కర్మ ఫలాన్ని అనుభవించడానికి ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుందన్న నీతిని మనం ఈ కథ ద్వారా గ్రహించాలి. అందుకే పెద్దలు అంటారు కదా 'మరణ కాలే హరినామస్మరణే' అని! జీవితం చివరిదశలో నిరంతరం భగవన్నామ స్మరణం చేస్తుంటే జన్మరాహిత్యాన్ని పొంది ఆ శ్రీహరి పాదాల వద్దకు చేరుకుంటారని విశ్వాసం. జై శ్రీమన్నారాయణ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.