ETV Bharat / politics

వైఎస్​ ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు - తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్‌

కోర్టు మెట్లెక్కిన వైఎస్ జగన్​, షర్మిల వివాదం - కంపెనీలోని షేర్లపై వైఎస్​ కుటుంబంలో వివాదాలు - కంపెనీలో అక్రమ వాటాల బదిలీలను రద్దు చేయాలంటూ పిటిషన్

YS JAGAN SHARMILA CASE
YS Jagan Filed Petition on YS Sharmila and Vijayamma (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

YS Jagan Filed Petition on YS Sharmila and Vijayamma : ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్​మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదాలు రచ్చకెక్కాయని తెలిసింది. తాజాగా జగన్​మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో వివాదాలే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీలో షేర్ బదిలీలపై ఆయన హైదరాబాద్​లోని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్​(ఎన్‌సీఎల్‌టీ)లో పిటిషన్లు దాఖలు చేశారు. వైఎస్‌ విజయమ్మ, షర్మిల షేర్లు ఉన్న సరస్వతీ పవర్‌ కంపెనీలో అక్రమ వాటాల బదిలీలను రద్దు చేయాలని ఏపీ మాజీ సీఎం జగన్‌, ఆయన భార్య భారతి రెడ్డిలు పిటిషన్​లో కోరారు.

ఎన్నికల అఫిడవిట్​లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్​ లిమిటెడ్‌లో ఆయనకు షేర్లు ఉన్నట్లు వైఎస్ జగన్‌ తెలిపారు. ఆ కంపెనీలో షేర్ల వాటా పంపకాల విషయంలో జగన్​కు, షర్మిలకు మధ్య వివాదం తలెత్తడంతోనే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్​ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంలో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 ఆగస్టు 21 ఎంవోయూ ప్రకారం సరస్వతి కంపెనీలో వైఎస్ విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించినట్లు, కొన్ని కారణాలతో ఆ షేర్ల కేటాయింపు జరగలేదని పిటిషన్‌లో తెలిపారు. ప్రస్తుతం ఆ షేర్లను విత్​డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని పిటిషన్ దాఖలు చేశారు.

తదుపరి విచారణ నవంబర్ 8కి వాయిదా : ఈ పిటిషన్​లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, సరస్వతి పవర్ సౌత్- ఈస్ట్ రీజియన్ జనార్ధన్ రెడ్డి చాగరి, తెలంగాణ కంపెనీల రిజిస్ట్రార్ కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. సెప్టెంబర్ 10న వైఎస్ జగన్ తరఫున వై.సూర్యనారాయణ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్​ను క్లాట్ విచారణకు స్వీకరించగా తదుపరి విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ విషయంలో కాస్త సోషల్​ మీడియాలో వైరలవుతోంది. జగన్​ ఫ్యామిలీలో కూడా ఆస్తి తగాదాలు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

YS Jagan Filed Petition on YS Sharmila and Vijayamma : ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్​మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదాలు రచ్చకెక్కాయని తెలిసింది. తాజాగా జగన్​మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో వివాదాలే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీలో షేర్ బదిలీలపై ఆయన హైదరాబాద్​లోని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్​(ఎన్‌సీఎల్‌టీ)లో పిటిషన్లు దాఖలు చేశారు. వైఎస్‌ విజయమ్మ, షర్మిల షేర్లు ఉన్న సరస్వతీ పవర్‌ కంపెనీలో అక్రమ వాటాల బదిలీలను రద్దు చేయాలని ఏపీ మాజీ సీఎం జగన్‌, ఆయన భార్య భారతి రెడ్డిలు పిటిషన్​లో కోరారు.

ఎన్నికల అఫిడవిట్​లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్​ లిమిటెడ్‌లో ఆయనకు షేర్లు ఉన్నట్లు వైఎస్ జగన్‌ తెలిపారు. ఆ కంపెనీలో షేర్ల వాటా పంపకాల విషయంలో జగన్​కు, షర్మిలకు మధ్య వివాదం తలెత్తడంతోనే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్​ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంలో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 ఆగస్టు 21 ఎంవోయూ ప్రకారం సరస్వతి కంపెనీలో వైఎస్ విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించినట్లు, కొన్ని కారణాలతో ఆ షేర్ల కేటాయింపు జరగలేదని పిటిషన్‌లో తెలిపారు. ప్రస్తుతం ఆ షేర్లను విత్​డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని పిటిషన్ దాఖలు చేశారు.

తదుపరి విచారణ నవంబర్ 8కి వాయిదా : ఈ పిటిషన్​లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, సరస్వతి పవర్ సౌత్- ఈస్ట్ రీజియన్ జనార్ధన్ రెడ్డి చాగరి, తెలంగాణ కంపెనీల రిజిస్ట్రార్ కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. సెప్టెంబర్ 10న వైఎస్ జగన్ తరఫున వై.సూర్యనారాయణ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్​ను క్లాట్ విచారణకు స్వీకరించగా తదుపరి విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ విషయంలో కాస్త సోషల్​ మీడియాలో వైరలవుతోంది. జగన్​ ఫ్యామిలీలో కూడా ఆస్తి తగాదాలు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

జగనన్నా ఇంత పిరికితనమా? - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి : షర్మిల - YS SHARMILA TWEET ON JAGAN

'నాడు పరదాలు, ఆంక్షలు - నేడు పలకరింపులు, సెల్ఫీలు' - ఇంతలోనే 'మావయ్య'లో ఎంత మార్పు? - YS Jagan Pulivendula Tour

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.