ETV Bharat / politics

మెదక్​ సీటుపై ప్రధాన పార్టీల కన్ను - మెతుకుసీమ నుంచి ఈసారి దిల్లీకి వెళ్లేదెవరో? - Telangana Parties Focus on Medak

Political Heat In Medak Constituency : మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల భవితవ్యం ఈవీఎం ప్యాడ్లలో నిక్షిప్తం కానుంది. ప్రచార సమయం గడువు దగ్గర పడుతున్న కొద్దీ దేశ నాయకులు రాష్ట్రంలో సభలు, సమావేశాలు, రోడ్‌ షోలు నిర్వహిస్తూ తమ పార్టీకే పట్టం కట్టాలంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మెదక్‌, జహీరాబాద్‌ రెండు పార్లమెంట్‌ స్థానాలున్నాయి. ఈ రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలు, నాయకులకు ఒకే వేదికగా ప్రధాని మోదీ, బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్‌ సభల్లో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట, మెదక్‌లలో కార్నర్‌ మీటింగుల్లో పాల్గొని పార్టీ నాయకులు, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు.

author img

By ETV Bharat Telangana Team

Published : May 4, 2024, 11:56 AM IST

Updated : May 5, 2024, 1:04 PM IST

Medak Parliament
Main Parties Focus on Medak Seat (Etv Bharat)
మెదక్​ సీటుపై ప్రధాన పార్టీల కన్ను మెతుకుసీమ నుంచి ఈసారి దిల్లీకి వెళ్లేదెవరో (Etv Bharat)

Main Parties Focus on Medak Seat : పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతి ఓటూ ప్రాధాన్యమే. బూత్‌ స్థాయి నుంచి అన్ని పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. ప్రచారానికి కొద్ది రోజుల సమయమే మిగిలి ఉండటంతో విస్తృతంగా నాయకులు, అభ్యర్థులు తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. పగలు ఎండలు మండుతుండటంతో ఉదయం, సాయంత్రం వేళలను సద్వినియోగం చేసుకుంటున్నారు. స్థానిక నేతలు ప్రతి ఓటరునూ కలవాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. అభ్యర్థి తీరుతెన్నులు, పార్టీ విధివిధానాలు, హామీల గురించి వివరించి కచ్చితంగా తమ పార్టీకే ఓటు వేసేలా చేస్తున్నారు. ప్రచారం సమయం ముగిశాక రాత్రి ఆరోజు జరిగిన తీరు, మరసటి రోజు అందిపుచ్చుకోవాల్సిన అంశంపై ముఖ్యనాయకులు సమావేశమై చర్చిస్తున్నారు.

మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో మెుత్తం 2వేల 124 బూత్‌లు ఉన్నాయి. కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​, బీజేపీ నేతలు బూత్‌ స్థాయి బాధ్యులను నియమించారు. వారి పరిథిలో 100 ఓట్లుకు ఒకరిని బాధ్యులుగా ఏర్పాటు చేశారు. మూడు పార్టీలకు కలిపి 6వేల 372మంది బూత్‌ బాధ్యులు, వంద ఓటర్లకు ఒకరు చొప్పున 54 వేల 384 మందితో సహా మెుత్తం 60వేల 756 మంది ముఖ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులకు ప్రచారం నిర్వహిస్తున్న మరో 500 మంది వరకు ఉన్నారు. వారి ద్వారా సమాచార సేకరణ చేస్తున్నారు. నేతలు ఎక్కడ ప్రచారం చేశారు. ఎంత మంది ఓటర్లను కలిశారు. అనే విషయాలను వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి వాటిల్లో పంపించుకుంటున్నారు. సరికొత్త విధానాలతో అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు.

కాంగ్రెస్ గ్యారంటీలు ప్రజలకు 'గాడిద గుడ్లు'లా కనిపిస్తున్నాయి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి - Konda Vishweshwar Reddy Fires On CM

కాంగ్రెస్‌ రాగానే కరవు వచ్చిందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. గ్యారంటీలు, రుణమాఫీ అమలు కాలేదని చెబుతోంది. తమ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రూ.100 కోట్లతో ట్రస్ట్‌ పెట్టి పేదలను ఆదుకుంటారని హామీలు ఇస్తోంది. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ఏమీ ఇవ్వలేదని, ఆ పార్టీ అభ్యర్థివి మాటలే కానీ చేతలు లేవని బీఆర్ఎస్​ నాయకులు విమర్శనాస్తృలు గుప్పిస్తున్నారు.

మంత్రి పదవి చూపించి ఓట్లు అభ్యర్థన : మరో పక్క100 రోజుల తమ పాలనే ఎన్నికలకు రెఫరెండం అని కాంగ్రెస్‌ స్పష్టం చేస్తోంది. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామని, ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసితీరుతామంటోంది. బీసీ బిడ్డ నీలం మధుని గెలిపిస్తే ముదిరాజ్‌ సామాజికవర్గం నుంచి మంత్రి పదవి కేటాయిస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి పలు సభల్లో హామీ ఇచ్చారు. పదేళ్లపాటు దేశంలో ఎక్కడా కల్లోలాలు లేని పాలన సాగించిన ఘనత బీజేపీదేనని, ప్రధాని నరేంద్ర మోదీ రక్షఅని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. గ్రామీణ స్థాయి పురోగతి, శ్రీరాముడికి గుడి, మతపరమైన రిజర్వేషన్లపై వ్యతిరేకత, రాజ్యాంగమే పవిత్ర గ్రంథం అనే అంశాలను వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు.

బీఆర్ఎస్​ కంచుకోటగా మెదక్​ : మెదక్ లోక్​సభ స్థానంలో 2004 నుంచి 2019 వరకు జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ ప్రతిసారి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తూ వచ్చింది. దీంతో మెదక్ ఎంపీ సెగ్మెంట్ బీఆర్ఎస్​కు కంచుకోటలా మారింది. ఇక్కడ ఎంపీగా పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో మెదక్ సీటు ఒకటి. ఇప్పుడు ఈ సీటు హాట్ కేక్​లా మారిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రచార జోరును పెంచిన గులాబీ నేతలు - ఊరూవాడా తిరుగుతూ విపక్షాలపై విమర్శలు - BRS Leaders Campaign 2024

మెదక్ పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవగా సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్​చెరు నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికారాన్ని సొంతం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో 83 వేలు, గజ్వేల్ 45 వేలు, దుబ్బాక 53 వేల మెజారిటీ ఈ సారి బీఆర్ఎస్ మెజరిటీ సాధించింది. ఈ లెక్కలే ఇప్పుడు బీఆర్ఎస్కు ఎంపీ ఎన్నికల్లో ఊరట కల్గిస్తున్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. పైగా అభ్యర్థి రూ.100కోట్లతో ట్రస్ట్‌ జనాల్లో చర్చసాగి తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు.

ప్రజలందరూ తమతోనే ఉన్నారని అభ్యర్థి రఘునందన్‌ అభిప్రాయపడుతున్నారు. మెదక్‌ పార్లమెంట‌్ పరిధిలో మొత్తం 18 లక్షల ఓటర్లు ఉండగా, వారిలో 4 లక్షల ఓటర్లు ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. మరో 2 లక్షల మంది ముస్లిం మైనారిటీలున్నారు. ఈ ఆరు లక్షల ఓట్లతో పాటు పార్టీ కేడర్‌ కలిస్తే విజయం తమవైపే ఉంటుందని కాంగ్రెస్‌ భావిస్తుంది. ఓటరు నాడి చివరి వరకు తెలీదు. దీంతో ఈ ఎన్నికల్లో మెదక్‌ నుంచి దిల్లీకి వెళ్లేదెవరో వేచి చూడాల్సి ఉంది.

మెదక్ సీటు మాదే - రెండో స్థానం కోసం హస్తం, కమలం పోటీపడుతున్నాయి : హరీశ్​రావు - Harish Rao Comments on Congress BJP

మెదక్​ సీటుపై ప్రధాన పార్టీల కన్ను మెతుకుసీమ నుంచి ఈసారి దిల్లీకి వెళ్లేదెవరో (Etv Bharat)

Main Parties Focus on Medak Seat : పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతి ఓటూ ప్రాధాన్యమే. బూత్‌ స్థాయి నుంచి అన్ని పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. ప్రచారానికి కొద్ది రోజుల సమయమే మిగిలి ఉండటంతో విస్తృతంగా నాయకులు, అభ్యర్థులు తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. పగలు ఎండలు మండుతుండటంతో ఉదయం, సాయంత్రం వేళలను సద్వినియోగం చేసుకుంటున్నారు. స్థానిక నేతలు ప్రతి ఓటరునూ కలవాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. అభ్యర్థి తీరుతెన్నులు, పార్టీ విధివిధానాలు, హామీల గురించి వివరించి కచ్చితంగా తమ పార్టీకే ఓటు వేసేలా చేస్తున్నారు. ప్రచారం సమయం ముగిశాక రాత్రి ఆరోజు జరిగిన తీరు, మరసటి రోజు అందిపుచ్చుకోవాల్సిన అంశంపై ముఖ్యనాయకులు సమావేశమై చర్చిస్తున్నారు.

మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో మెుత్తం 2వేల 124 బూత్‌లు ఉన్నాయి. కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​, బీజేపీ నేతలు బూత్‌ స్థాయి బాధ్యులను నియమించారు. వారి పరిథిలో 100 ఓట్లుకు ఒకరిని బాధ్యులుగా ఏర్పాటు చేశారు. మూడు పార్టీలకు కలిపి 6వేల 372మంది బూత్‌ బాధ్యులు, వంద ఓటర్లకు ఒకరు చొప్పున 54 వేల 384 మందితో సహా మెుత్తం 60వేల 756 మంది ముఖ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులకు ప్రచారం నిర్వహిస్తున్న మరో 500 మంది వరకు ఉన్నారు. వారి ద్వారా సమాచార సేకరణ చేస్తున్నారు. నేతలు ఎక్కడ ప్రచారం చేశారు. ఎంత మంది ఓటర్లను కలిశారు. అనే విషయాలను వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి వాటిల్లో పంపించుకుంటున్నారు. సరికొత్త విధానాలతో అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు.

కాంగ్రెస్ గ్యారంటీలు ప్రజలకు 'గాడిద గుడ్లు'లా కనిపిస్తున్నాయి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి - Konda Vishweshwar Reddy Fires On CM

కాంగ్రెస్‌ రాగానే కరవు వచ్చిందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. గ్యారంటీలు, రుణమాఫీ అమలు కాలేదని చెబుతోంది. తమ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రూ.100 కోట్లతో ట్రస్ట్‌ పెట్టి పేదలను ఆదుకుంటారని హామీలు ఇస్తోంది. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ఏమీ ఇవ్వలేదని, ఆ పార్టీ అభ్యర్థివి మాటలే కానీ చేతలు లేవని బీఆర్ఎస్​ నాయకులు విమర్శనాస్తృలు గుప్పిస్తున్నారు.

మంత్రి పదవి చూపించి ఓట్లు అభ్యర్థన : మరో పక్క100 రోజుల తమ పాలనే ఎన్నికలకు రెఫరెండం అని కాంగ్రెస్‌ స్పష్టం చేస్తోంది. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామని, ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసితీరుతామంటోంది. బీసీ బిడ్డ నీలం మధుని గెలిపిస్తే ముదిరాజ్‌ సామాజికవర్గం నుంచి మంత్రి పదవి కేటాయిస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి పలు సభల్లో హామీ ఇచ్చారు. పదేళ్లపాటు దేశంలో ఎక్కడా కల్లోలాలు లేని పాలన సాగించిన ఘనత బీజేపీదేనని, ప్రధాని నరేంద్ర మోదీ రక్షఅని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. గ్రామీణ స్థాయి పురోగతి, శ్రీరాముడికి గుడి, మతపరమైన రిజర్వేషన్లపై వ్యతిరేకత, రాజ్యాంగమే పవిత్ర గ్రంథం అనే అంశాలను వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు.

బీఆర్ఎస్​ కంచుకోటగా మెదక్​ : మెదక్ లోక్​సభ స్థానంలో 2004 నుంచి 2019 వరకు జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ ప్రతిసారి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తూ వచ్చింది. దీంతో మెదక్ ఎంపీ సెగ్మెంట్ బీఆర్ఎస్​కు కంచుకోటలా మారింది. ఇక్కడ ఎంపీగా పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో మెదక్ సీటు ఒకటి. ఇప్పుడు ఈ సీటు హాట్ కేక్​లా మారిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రచార జోరును పెంచిన గులాబీ నేతలు - ఊరూవాడా తిరుగుతూ విపక్షాలపై విమర్శలు - BRS Leaders Campaign 2024

మెదక్ పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవగా సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్​చెరు నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికారాన్ని సొంతం చేసుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో 83 వేలు, గజ్వేల్ 45 వేలు, దుబ్బాక 53 వేల మెజారిటీ ఈ సారి బీఆర్ఎస్ మెజరిటీ సాధించింది. ఈ లెక్కలే ఇప్పుడు బీఆర్ఎస్కు ఎంపీ ఎన్నికల్లో ఊరట కల్గిస్తున్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. పైగా అభ్యర్థి రూ.100కోట్లతో ట్రస్ట్‌ జనాల్లో చర్చసాగి తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు.

ప్రజలందరూ తమతోనే ఉన్నారని అభ్యర్థి రఘునందన్‌ అభిప్రాయపడుతున్నారు. మెదక్‌ పార్లమెంట‌్ పరిధిలో మొత్తం 18 లక్షల ఓటర్లు ఉండగా, వారిలో 4 లక్షల ఓటర్లు ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. మరో 2 లక్షల మంది ముస్లిం మైనారిటీలున్నారు. ఈ ఆరు లక్షల ఓట్లతో పాటు పార్టీ కేడర్‌ కలిస్తే విజయం తమవైపే ఉంటుందని కాంగ్రెస్‌ భావిస్తుంది. ఓటరు నాడి చివరి వరకు తెలీదు. దీంతో ఈ ఎన్నికల్లో మెదక్‌ నుంచి దిల్లీకి వెళ్లేదెవరో వేచి చూడాల్సి ఉంది.

మెదక్ సీటు మాదే - రెండో స్థానం కోసం హస్తం, కమలం పోటీపడుతున్నాయి : హరీశ్​రావు - Harish Rao Comments on Congress BJP

Last Updated : May 5, 2024, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.