ETV Bharat / politics

టీపీసీసీ చీఫ్​ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం - నగరమంతా మహేశ్ ​కుమార్ గౌడ్​ పోస్టర్ల మయం - Mahesh Kumar Goud oath tpcc chief

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 7:04 AM IST

Updated : Sep 15, 2024, 7:10 AM IST

TPCC Chief Mahesh Kumar Goud take Charge : రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్​ కుమార్‌ గౌడ్‌ బాధ్యతల స్వీకరణకు సర్వం సిద్ధమైంది. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ రెడ్డి నుంచి మహేశ్​ కుమార్​ గౌడ్​ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సభ నిర్వహణకు గాంధీభవన్‌ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గాంధీభవన్‌తో పాటు హైదరాబాద్‌ నగరంలోని ముఖ్యమైన కూడళ్లలో కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

TPCC Chief Mahesh Kumar Goud take Charge
TPCC Chief Mahesh Kumar Goud take Charge (ETV Bharat)

Mahesh Kumar Goud take Charge as PCC Chief Today : నిజామాబాద్‌ జిల్లాకు చెందిన బొమ్మ మహేశ్​ కుమార్‌ గౌడ్‌ ఇవాళ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నుంచి మహేశ్ కుమార్‌ గౌడ్‌ పదవీ బాధ్యతలు తీసుకుంటారు. మొదట మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌ పార్క్‌ వద్దకు ఆయన చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలతో కలిసి అమరువీరుల స్థూపం వద్ద మహేశ్​ కుమార్ గౌడ్‌ నివాళులు అర్పిస్తారు.

ఆ తర్వాత అక్కడ నుంచి గాంధీభవన్‌ వరకు ర్యాలీగా వస్తారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి గాంధీభవన్‌ చేరుకుంటారు. రెండున్నర గంటలకు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడి ఛాంబర్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్సీ సమక్షంలో రేవంత్‌ రెడ్డి వద్ద నుంచి మహేశ్​ కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు తీసుకుంటారు. అక్కడే పీసీసీ అధ్యక్షుడికి చెందిన కుర్చీని మహేశ్​కుమార్ గౌడ్​కు రేవంత్‌ రెడ్డి అప్పగిస్తారు. అయితే ఇప్పటి వరకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఏ కుర్చీ అయితే వాడుతున్నారో, అదే కుర్చీని పీసీసీ అధ్యక్షుడిగా కూడా వాడాలని మహేశ్​ కుమార్‌ గౌడ్‌ నిర్ణయించుకున్నారు.

ఆ కుర్చీనే పీసీసీ అధ్యక్షుడి ఛాంబర్​లో : దీంతో వర్కింగ్‌ ప్రెసిడెంట్ ఛాంబర్‌లో ఉన్న ఆ కుర్చీని పీసీసీ అధ్యక్షుడి ఛాంబర్‌లోకి మారుస్తారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత గాంధీభవన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్‌ గౌడ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్సీ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఈ సభలో పార్టీ జెండాను రేవంత్‌ రెడ్డి నుంచి మహేశ్​ కుమార్ గౌడ్‌ స్వీకరిస్తారు. దీంతో పూర్తి స్థాయి పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్​ కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు తీసుకున్నట్లు అవుతుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.

"ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి పిలుపును ప్రతి కార్యకర్తకు అందించడంలో, నాయకులను సమన్వయం చేయడంలో సక్సెస్​ అవ్వడం వల్లే ఈ పదవి మహేశ్​ కుమార్​ గౌడ్​కు వచ్చింది. వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్ఠంగా మారుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో పార్టీ మరింత ముందుకు వెళుతుంది. మహేశ్ కుమార్​ గౌడ్ నాయకత్వంలో కేడర్​ బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాం." - ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్

భారీగా తరలిరానున్న అభిమానులు : మహేశ్​ కుమార్‌ గౌడ్‌ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరణ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 5 నుంచి 6 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్న పార్టీ నాయకత్వం, ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుండడంతో పోలీసు శాఖ కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది. గాంధీభవన్‌ ప్రాంగణంలోకి వాహనాలను అనుమతించరాదని నిర్ణయించారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో వాహనాలను పార్కింగ్‌ చేసుకుని వచ్చేట్లు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

ఎల్​ఈడీ తెరలు ఏర్పాటు : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు రాకపోకలు సాగించేందుకు తాత్కాలికంగా ఇందిరాభవన్‌ వద్ద ప్రత్యేకంగా గేటు ఏర్పాటు చేశారు. సభ నిర్వహణ వద్ద కూడా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, నియోజకవర్గ ఇంఛార్జిలకు, అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు కూర్చోడానికి వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. రెండు వేలకుపైగా కుర్చీలు సభ వద్ద ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పెద్ద సంఖ్యలో శ్రేణులు తరలివస్తున్నందున గాంధీభవన్‌ ప్రాంగణలో నిలబడి వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఎల్​ఈడీ తెరలు కూడా ఏర్పాటు చేశారు.

ఎటుచూసినా ఫ్లెక్సీలే : మహేశ్​ కుమార్ గౌడ్‌ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరణ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని ప్రధాన కూడళ్ల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక నార్సింగ్‌ ప్రాంతంలో మహేశ్​ కుమార్‌ గౌడ్‌ నివాసం ఉండడం, ఎమ్మెల్యే క్వార్టర్‌కు వచ్చి పోతుండడంతో ఆ రెండు మార్గాలను ప్లెక్సీలతో నింపేశారు. గాంధీభవన్‌ లోపల, వెలుపల భారీ ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఎటు చూసినా ప్లెక్సీలే కనిపిస్తున్నాయి.

మహేశ్​కుమార్​ గౌడ్​కు సెంటిమెంట్​ కుర్చీ - పార్టీ కార్యకర్తల్లో చర్చంతా ఆ ఛైర్​​పైనే - Story On New PCC President Chair

కొత్త అధ్యక్షుడు వచ్చేశాడు - త్వరలోనే కొత్త కార్యవర్గం - 'మహేశ్​' మార్క్​ కనిపించేలా ఎంపిక! - Congress Focus on PCC Members

Mahesh Kumar Goud take Charge as PCC Chief Today : నిజామాబాద్‌ జిల్లాకు చెందిన బొమ్మ మహేశ్​ కుమార్‌ గౌడ్‌ ఇవాళ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నుంచి మహేశ్ కుమార్‌ గౌడ్‌ పదవీ బాధ్యతలు తీసుకుంటారు. మొదట మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌ పార్క్‌ వద్దకు ఆయన చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలతో కలిసి అమరువీరుల స్థూపం వద్ద మహేశ్​ కుమార్ గౌడ్‌ నివాళులు అర్పిస్తారు.

ఆ తర్వాత అక్కడ నుంచి గాంధీభవన్‌ వరకు ర్యాలీగా వస్తారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి గాంధీభవన్‌ చేరుకుంటారు. రెండున్నర గంటలకు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడి ఛాంబర్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్సీ సమక్షంలో రేవంత్‌ రెడ్డి వద్ద నుంచి మహేశ్​ కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు తీసుకుంటారు. అక్కడే పీసీసీ అధ్యక్షుడికి చెందిన కుర్చీని మహేశ్​కుమార్ గౌడ్​కు రేవంత్‌ రెడ్డి అప్పగిస్తారు. అయితే ఇప్పటి వరకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఏ కుర్చీ అయితే వాడుతున్నారో, అదే కుర్చీని పీసీసీ అధ్యక్షుడిగా కూడా వాడాలని మహేశ్​ కుమార్‌ గౌడ్‌ నిర్ణయించుకున్నారు.

ఆ కుర్చీనే పీసీసీ అధ్యక్షుడి ఛాంబర్​లో : దీంతో వర్కింగ్‌ ప్రెసిడెంట్ ఛాంబర్‌లో ఉన్న ఆ కుర్చీని పీసీసీ అధ్యక్షుడి ఛాంబర్‌లోకి మారుస్తారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత గాంధీభవన్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్‌ గౌడ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్సీ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఈ సభలో పార్టీ జెండాను రేవంత్‌ రెడ్డి నుంచి మహేశ్​ కుమార్ గౌడ్‌ స్వీకరిస్తారు. దీంతో పూర్తి స్థాయి పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్​ కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు తీసుకున్నట్లు అవుతుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.

"ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి పిలుపును ప్రతి కార్యకర్తకు అందించడంలో, నాయకులను సమన్వయం చేయడంలో సక్సెస్​ అవ్వడం వల్లే ఈ పదవి మహేశ్​ కుమార్​ గౌడ్​కు వచ్చింది. వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్ఠంగా మారుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో పార్టీ మరింత ముందుకు వెళుతుంది. మహేశ్ కుమార్​ గౌడ్ నాయకత్వంలో కేడర్​ బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాం." - ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్

భారీగా తరలిరానున్న అభిమానులు : మహేశ్​ కుమార్‌ గౌడ్‌ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరణ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 5 నుంచి 6 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్న పార్టీ నాయకత్వం, ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుండడంతో పోలీసు శాఖ కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది. గాంధీభవన్‌ ప్రాంగణంలోకి వాహనాలను అనుమతించరాదని నిర్ణయించారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో వాహనాలను పార్కింగ్‌ చేసుకుని వచ్చేట్లు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

ఎల్​ఈడీ తెరలు ఏర్పాటు : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు రాకపోకలు సాగించేందుకు తాత్కాలికంగా ఇందిరాభవన్‌ వద్ద ప్రత్యేకంగా గేటు ఏర్పాటు చేశారు. సభ నిర్వహణ వద్ద కూడా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, నియోజకవర్గ ఇంఛార్జిలకు, అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు కూర్చోడానికి వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. రెండు వేలకుపైగా కుర్చీలు సభ వద్ద ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పెద్ద సంఖ్యలో శ్రేణులు తరలివస్తున్నందున గాంధీభవన్‌ ప్రాంగణలో నిలబడి వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఎల్​ఈడీ తెరలు కూడా ఏర్పాటు చేశారు.

ఎటుచూసినా ఫ్లెక్సీలే : మహేశ్​ కుమార్ గౌడ్‌ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరణ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని ప్రధాన కూడళ్ల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక నార్సింగ్‌ ప్రాంతంలో మహేశ్​ కుమార్‌ గౌడ్‌ నివాసం ఉండడం, ఎమ్మెల్యే క్వార్టర్‌కు వచ్చి పోతుండడంతో ఆ రెండు మార్గాలను ప్లెక్సీలతో నింపేశారు. గాంధీభవన్‌ లోపల, వెలుపల భారీ ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఎటు చూసినా ప్లెక్సీలే కనిపిస్తున్నాయి.

మహేశ్​కుమార్​ గౌడ్​కు సెంటిమెంట్​ కుర్చీ - పార్టీ కార్యకర్తల్లో చర్చంతా ఆ ఛైర్​​పైనే - Story On New PCC President Chair

కొత్త అధ్యక్షుడు వచ్చేశాడు - త్వరలోనే కొత్త కార్యవర్గం - 'మహేశ్​' మార్క్​ కనిపించేలా ఎంపిక! - Congress Focus on PCC Members

Last Updated : Sep 15, 2024, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.