ETV Bharat / politics

నాడు కేసీఆర్​ రైతును రాజు చేస్తే - నేడు కాంగ్రెస్​ సర్కార్​ ప్రాణాలు తీస్తోంది : కేటీఆర్​ - KTR tweet on cong govt Failures

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 10:42 AM IST

KTR Comments on Congress Govt : కేసీఆర్​ రైతును రాజు చేస్తే, కాంగ్రెస్​ సర్కార్​ ప్రాణాలు తీస్తోందని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ మండిపడ్డారు. రైతు రుణమాఫీ అంత బోగస్​, రైతు భరోసా కూడా బోగస్​నే అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రుణమాఫీలో పావు శాతం కూడా రుణమాఫీ కాలేదని ధ్వజమెత్తారు.

KTR Comments on Congress Govt
KTR Comments on Congress Govt (ETV Bharat)

KTR Tweet on Farmer Loan Waiver : రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ పేర్కొన్నారు. రుణమాఫీ కాలేదని కొందరు, పెట్టుబడి సాయం రైతు భరోసా లేక ఇంకొందరు రైతులు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్​ రైతును రాజు చేస్తే, కాంగ్రెస్​ సర్కార్​ ప్రాణాలు తీస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు.

రైతు రుణమాఫీ అంత బోగస్​, రైతు భరోసా కూడా బోగస్​నే అని కేటీఆర్​ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నాడు రైతు సురేందర్​ రెడ్డి అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా, రుణమాఫీ కాకపోవడంతో మేడ్చల్​లో వ్యవసాయ కార్యాలయం సాక్షిగా ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. తనకు ఉన్న రుణం మాఫీ కాకపోవడంతో కాంగ్రెస్​ ప్రభుత్వం చేసిన దగాకు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

నేడు రైతు సాగర్​ రెడ్డి భార్యాభర్తలిద్దరిలో ఒక్కరి కూడా రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో జగిత్యాలలో పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని కేటీఆర్​ ఆందోళన చెందారు. తన పేరిట ఉన్న రూ.లక్షన్నర రుణం, తన భార్య పేరిట ఉన్న రూ.1.60 లక్షల రుణంలో ఏ ఒక్కరికీ రుణమాఫీ అయినా గట్టెక్కుతానని గంపెడాశలు పెట్టుకుని దారుణంగా మోసపోయారని తెలిపారు. ఇలా ఈ ముఖ్యమంత్రి చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలు బలిపెట్టాలని ప్రశ్నించారు.

రుణమాఫీలో పావుశాతం కూడా కాలేదు : ఏకకాలంలో అందరికీ రూ.2 లక్షల రుణమాఫీ అని ఇచ్చిన మాట తప్పిన సీఎంను ఏం చేయాలని ఎక్స్​ వేదికగా కేటీఆర్​ ప్రశ్నించారు. డిసెంబరులో పెట్టిన డెడ్​లైన్​ సెప్టెంబరు దాటినా అమలు కాకపోతే దగాపడ్డ అన్నదాతలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలన్నారు. రూ.49,500 కోట్ల రుణమాఫీలో పావుశాతం కూడా చేయకుండా చేతులెత్తేసినందుకు రైతన్నలకు క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఇంకెంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్లు చల్లారుతాయని ధ్వజమెత్తారు. రేవంత్​ రెడ్డి దిల్లీ యాత్రలు చేయటం కాదు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యంగా ఉండాలని కేటీఆర్​ చెప్పారు.

గురుకులాల్లో పాము కాట్లు ఏంటి? : గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు పాము కాట్లకు గురై ప్రాణాల మీదకు వస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీమంత్రి హరీశ్​రావు దుయ్యబట్టారు. ప్రభుత్వం ఈ సమస్యపై మొద్దు నిద్ర వీడాలంటే ఎంతమంది ఆసుపత్రుల పాలు కావాలని, ఇంకెన్ని ప్రాణాలు పోవాలని నిలదీశారు. ఒకప్పుడు నాణ్యమైన విద్యకు చిరునామా అయిన గురుకులాల్లో నేడు పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు నిత్యకృత్యం కావడం దురదృష్టకరమని హరీశ్​రావు విచారం వ్యక్తం చేశారు.

'వద్దురా నాయనా కాంగ్రెస్ సర్కార్ - రుణమాఫీ లేదు - రైతు భరోసా రాదు' - KTR TWEETS TODAY LATEST NEWS

మీ రాజకీయాల కోసం కుటుంబ బంధాల మధ్య చిచ్చుపెట్టారు : హరీశ్​రావు - Harish Rao sensational comments

KTR Tweet on Farmer Loan Waiver : రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ పేర్కొన్నారు. రుణమాఫీ కాలేదని కొందరు, పెట్టుబడి సాయం రైతు భరోసా లేక ఇంకొందరు రైతులు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్​ రైతును రాజు చేస్తే, కాంగ్రెస్​ సర్కార్​ ప్రాణాలు తీస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు.

రైతు రుణమాఫీ అంత బోగస్​, రైతు భరోసా కూడా బోగస్​నే అని కేటీఆర్​ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నాడు రైతు సురేందర్​ రెడ్డి అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా, రుణమాఫీ కాకపోవడంతో మేడ్చల్​లో వ్యవసాయ కార్యాలయం సాక్షిగా ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. తనకు ఉన్న రుణం మాఫీ కాకపోవడంతో కాంగ్రెస్​ ప్రభుత్వం చేసిన దగాకు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

నేడు రైతు సాగర్​ రెడ్డి భార్యాభర్తలిద్దరిలో ఒక్కరి కూడా రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో జగిత్యాలలో పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని కేటీఆర్​ ఆందోళన చెందారు. తన పేరిట ఉన్న రూ.లక్షన్నర రుణం, తన భార్య పేరిట ఉన్న రూ.1.60 లక్షల రుణంలో ఏ ఒక్కరికీ రుణమాఫీ అయినా గట్టెక్కుతానని గంపెడాశలు పెట్టుకుని దారుణంగా మోసపోయారని తెలిపారు. ఇలా ఈ ముఖ్యమంత్రి చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలు బలిపెట్టాలని ప్రశ్నించారు.

రుణమాఫీలో పావుశాతం కూడా కాలేదు : ఏకకాలంలో అందరికీ రూ.2 లక్షల రుణమాఫీ అని ఇచ్చిన మాట తప్పిన సీఎంను ఏం చేయాలని ఎక్స్​ వేదికగా కేటీఆర్​ ప్రశ్నించారు. డిసెంబరులో పెట్టిన డెడ్​లైన్​ సెప్టెంబరు దాటినా అమలు కాకపోతే దగాపడ్డ అన్నదాతలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలన్నారు. రూ.49,500 కోట్ల రుణమాఫీలో పావుశాతం కూడా చేయకుండా చేతులెత్తేసినందుకు రైతన్నలకు క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఇంకెంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్లు చల్లారుతాయని ధ్వజమెత్తారు. రేవంత్​ రెడ్డి దిల్లీ యాత్రలు చేయటం కాదు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యంగా ఉండాలని కేటీఆర్​ చెప్పారు.

గురుకులాల్లో పాము కాట్లు ఏంటి? : గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు పాము కాట్లకు గురై ప్రాణాల మీదకు వస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీమంత్రి హరీశ్​రావు దుయ్యబట్టారు. ప్రభుత్వం ఈ సమస్యపై మొద్దు నిద్ర వీడాలంటే ఎంతమంది ఆసుపత్రుల పాలు కావాలని, ఇంకెన్ని ప్రాణాలు పోవాలని నిలదీశారు. ఒకప్పుడు నాణ్యమైన విద్యకు చిరునామా అయిన గురుకులాల్లో నేడు పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు నిత్యకృత్యం కావడం దురదృష్టకరమని హరీశ్​రావు విచారం వ్యక్తం చేశారు.

'వద్దురా నాయనా కాంగ్రెస్ సర్కార్ - రుణమాఫీ లేదు - రైతు భరోసా రాదు' - KTR TWEETS TODAY LATEST NEWS

మీ రాజకీయాల కోసం కుటుంబ బంధాల మధ్య చిచ్చుపెట్టారు : హరీశ్​రావు - Harish Rao sensational comments

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.