ETV Bharat / politics

మెడిసిన్ సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా? : కేటీఆర్ - KTR on medicine seats locality

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 2:02 PM IST

KTR Tweet on Medicine Seats : రాష్ట్రంలో మెడిసిన్ సీట్ల విషయంలో సర్కార్‌ అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33 ప్రకారం నిర్ధేశించిన స్థానికతలోని అంశాలు, వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయని మండిపడ్డారు. కొత్త నిబంధనల ప్రకారం తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

KTR
KTR Tweet Today (ETV Bharat)

KTR Tweet on GO 33 : తెలంగాణ విద్యార్థులకు మెడిసిన్ సీట్ల విషయంలో అన్యాయం చేస్తారా అని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33 ప్రకారం నిర్ధేశించిన స్థానికతలోని అంశాలు, వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయని ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. మన రాష్ట్రంలో 9వ తరగతి నుంచి 12 తరగతి వరకు చదివిన విద్యార్థులే స్థానికులవుతారని చెబుతున్నారని, ఈ నిర్ణయం ప్రకారం చాలా మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే తెలంగాణలో లోకల్‌ అవుతారని పేర్కొన్నారు.

హైదరాబాద్​లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చాలా మంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారని, కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారని అన్నారు. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో చదివే మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 విద్యా సంవత్సరం వరకు 6వ తరగతి నుంచి 12 తరగతి వరకు నాలుగేళ్లు గరిష్టంగా ఎక్కడ చదివితే అదే స్థానికతగా గుర్తించినట్లు వివరించారు. ఆ కారణంగా మన విద్యార్థులు ఇంటర్మీడియట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ వారిని లోకల్‌గానే పరిగణించే వారని తెలిపారు.

రాహుల్​ అశోక్​నగర్​కు వచ్చి యువతకు మీరు ఇచ్చిన హామీని ఎలా నెరవేరుస్తారో చెప్పండి: కేటీఆర్​ - KTR Asks Rahul Gandhi To Meet Youth

ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారమైతే వేలాది మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారని, దీంతో మన విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా గతంలో అనుసరించిన విధానాన్నే కొనసాగించాలని కోరారు.

వైద్య సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా? స్థానికత విషయంలో ప్రభుత్వం తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోంది. 9 నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులే స్థానికులన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఇతర రాష్ట్రాల విద్యార్థులే లోకల్ అవుతారు. ఇతర రాష్ట్రాల్లో చదివే మన విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం నిర్ణయంతో మన విద్యార్థులు వైద్య సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. - కేటీఆర్‌ ట్వీట్

పిల్లలకు కారం మెతుకులతో భోజనం పెట్టడమేంటి? - కొత్తపల్లి పాఠశాల ఘటనపై కేటీఆర్ - Kothapally Mid Day Meals Issue

KTR Tweet on GO 33 : తెలంగాణ విద్యార్థులకు మెడిసిన్ సీట్ల విషయంలో అన్యాయం చేస్తారా అని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33 ప్రకారం నిర్ధేశించిన స్థానికతలోని అంశాలు, వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయని ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. మన రాష్ట్రంలో 9వ తరగతి నుంచి 12 తరగతి వరకు చదివిన విద్యార్థులే స్థానికులవుతారని చెబుతున్నారని, ఈ నిర్ణయం ప్రకారం చాలా మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే తెలంగాణలో లోకల్‌ అవుతారని పేర్కొన్నారు.

హైదరాబాద్​లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చాలా మంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారని, కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారని అన్నారు. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో చదివే మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 విద్యా సంవత్సరం వరకు 6వ తరగతి నుంచి 12 తరగతి వరకు నాలుగేళ్లు గరిష్టంగా ఎక్కడ చదివితే అదే స్థానికతగా గుర్తించినట్లు వివరించారు. ఆ కారణంగా మన విద్యార్థులు ఇంటర్మీడియట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ వారిని లోకల్‌గానే పరిగణించే వారని తెలిపారు.

రాహుల్​ అశోక్​నగర్​కు వచ్చి యువతకు మీరు ఇచ్చిన హామీని ఎలా నెరవేరుస్తారో చెప్పండి: కేటీఆర్​ - KTR Asks Rahul Gandhi To Meet Youth

ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న కొత్త నిబంధనల ప్రకారమైతే వేలాది మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారని, దీంతో మన విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా గతంలో అనుసరించిన విధానాన్నే కొనసాగించాలని కోరారు.

వైద్య సీట్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేస్తారా? స్థానికత విషయంలో ప్రభుత్వం తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోంది. 9 నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులే స్థానికులన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఇతర రాష్ట్రాల విద్యార్థులే లోకల్ అవుతారు. ఇతర రాష్ట్రాల్లో చదివే మన విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం నిర్ణయంతో మన విద్యార్థులు వైద్య సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. - కేటీఆర్‌ ట్వీట్

పిల్లలకు కారం మెతుకులతో భోజనం పెట్టడమేంటి? - కొత్తపల్లి పాఠశాల ఘటనపై కేటీఆర్ - Kothapally Mid Day Meals Issue

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.