ETV Bharat / politics

కేసీఆర్​ హరీశ్​రావు ట్రాప్​లో పడ్డారు - బీఆర్ఎస్ బతకడం ఇక కష్టం : సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు - CM Revanth Sensational Comments

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 28, 2024, 8:01 AM IST

Updated : Jun 28, 2024, 8:38 AM IST

CM Revanth Chit Chat in Delhi : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు ఉచ్చులో చిక్కుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ బతకడం, కేసీఆర్ నిలదొక్కుకోవడం ఇక జరగదని స్పష్టం చేశారు. దిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ ​రెడ్డి, కేసీఆర్ విధానాలను బట్టే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని అన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డిని చూశాక నేర్చుకోవాలన్నారు. హైదరాబాద్‌కు అమరావతి పోటీ కాదని, రాష్ట్ర ప్రగతిలో ప్రాంతీయ రింగు రోడ్డు కీలక భూమిక పోషిస్తుందన్నారు.

CM Revanth Sensational Comments On Harish Rao
CM Revanth Chitchat Comments on KCR (ETV Bharat)

CM Revanth Sensational Comments On Harish Rao : దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, భారత రాష్ట్ర సమితి, ఆ పార్టీ అధినేత కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ట్రాప్‌లో పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల భవిష్యత్తులో బీఆర్ఎస్ బతకడం, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని జోస్యం చెప్పారు. కేసీఆర్ లేకుంటే తన సొంత లైన్‌ తీసుకోవచ్చని హరీశ్‌ ఎదురు చూస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చినా చంద్రబాబునాయుడు కోర్‌ రాజకీయాలను వదలకుండా పోరాడారని, అందుకే మళ్లీ గెలిచారని గుర్తు చేశారు. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి అలా లేదని స్పష్టం చేశారు.

ఇప్పుడు మా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం : ఎమ్మెల్యేలను చేర్చుకోవడం నెగెటివా? పాజిటివా? అన్నది కాదన్న సీఎం, ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు కారణంగానే హైదరాబాద్‌ చుట్టుపక్కల సెటిలర్ల ఓట్లు భారతీయ జనతా పార్టీకి వెళ్లాయని, దాని వల్లే మల్కాజిగిరి, చేవెళ్లలో ఆ పార్టీకి ప్రయోజనం కలిగిందని రేవంత్‌ అంచనా వేశారు.

శాసనసభ ఎన్నికలు కేసీఆర్​ను దించాలి? తనను గెలిపించాలి? అన్న అంశంపైనే జరిగాయని రేవంత్‌ అన్నారు. పదేళ్లు ఆయనకు వ్యతిరేకంగా కొట్లాడింది తానే కావడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా తనను ఎంచుకున్నారని రేవంత్‌ తెలిపారు. పాలనలో తన మార్కు ముద్ర వేయడమే లక్ష్యమని వివరించారు. కేసీఆర్ హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే గులాబీ పార్టీకి మనుగడ ఉంటుందని సీఎం వెల్లడించారు.

CM Revanth Chitchat Comments on KCR : చంద్రబాబు నాయుడు ముందు జగన్‌ ఎంత అని ప్రశ్నించిన రేవంత్‌, అయినా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పని చేశారని గుర్తు చేశారు. వాళ్లు తిట్టే తిట్లు, చేసే కామెంట్లను తట్టుకొని పోరాడారని, కోర్‌ ఏరియాను చంద్రబాబు వదల్లేదని అన్నారు. ఇక్కడ కేసీఆర్ ఆ పని చేయడం లేదని, హరీశ్‌రావు ఆ పని చేయించడం లేదని విమర్శించారు.

కేసీఆర్ పార్టీని నిలబెట్టుకునే మూడ్‌లో లేరని ఆరోపించిన రేవంత్‌, ఆయన ఇప్పుడు హరీశ్‌ ట్రాప్‌లో ఉండటంతో బీఆర్ఎస్ బతకడం కానీ, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కానీ జరగదని స్పష్టం చేశారు. ఈరోజు భావోద్వేగాలు కేసీఆర్​కు వ్యతిరేకంగా ఉన్నాయన్న ముఖ్యమంత్రి, అందువల్ల ఆయన హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే గులాబీ పార్టీ బతుకుతుందని సూచించారు.

కేటీఆర్ ఎప్పుడైనా డమ్మీయే : పార్టీ బతికితే కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవిత ఉంటారు తప్ప, హరీశ్​ కాదని స్పష్టం చేశారు. అందుకే బీఆర్ఎస్ ఖతం కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి, చివరి వ్యక్తి హరీశ్‌రావేనని ఆరోపించారు. ఈటల రాజేందర్, నరేంద్ర, విజయశాంతిలను బయటికి గెంటించింది హరీశేనని విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ఎప్పుడైనా డమ్మీయేననీ, మీడియానే ఆయన్ను పెద్దగా ప్రొజెక్టు చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.

బీఆర్ఎస్ నేతలు తమ ఓట్లు తామే వేసుకొని ఉంటే కాంగ్రెస్‌ 12 సీట్లు సులభంగా గెలిచేదని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి డబ్బులు పంచి మరీ బీజేపీకి ఓట్లేయించారని ఆరోపించారు. బీఆర్ఎస్ డిపాజిట్లు తెచ్చుకున్న సీట్లలో కాంగ్రెస్‌ గెలిచిందనీ, ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయిన చోట్ల కమలం పార్టీ వికసించిందని వివరించారు.

కేసీఆర్‌ విధానాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలు : మరోవైపు రాష్ట్రంలో కమలం పార్టీ నిర్మాణం లేదన్న సీఎం, కేసీఆర్ బీఆర్ఎస్​ను విలీనం చేస్తే తప్ప ఆ పార్టీకి బలం ఉండదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి తెలుస్తుందని, తమ ప్రధాన ప్రత్యర్థిగా ఎవరుంటారనేది కమలం, గులాబీ పార్టీల పని తీరుపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. కేసీఆర్ విధానాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని స్పష్టం చేశారు.

ప్రజలు అధికారాన్ని మనకు సొంత పగలు తీర్చుకోవడానికి ఇవ్వరని జగన్‌ను చూసి నేర్చుకోవాలని సూచించారు. ఏపీ ప్రజలు 2019లో జగన్‌కు 151 సీట్లను ఎన్నో ఆశలతో ఇచ్చారన్న సీఎం రేవంత్‌, అధికారంలోకి వచ్చాక జగన్‌ చేసిన పనులు తప్పని నిరూపించడానికే మొన్న ప్రజలు 11 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలనుకున్నారని, కానీ ఆయనే తుడిచి పెట్టుకుపోయారని ఎద్దేవా చేశారు.

నా మార్కు పాలనే లక్ష్యం : సమాజంలో కొన్నింటిని బతకనిస్తే అవి సమాజానికో, మనకో పనికొస్తాయని, టీడీపీకి పోటీ చేసే పరిస్థితి కల్పించి ఉంటే వాళ్లు 10 శాతం ఓట్లు దక్కించుకొనేవారని అంచనా వేశారు. అప్పుడు కాంగ్రెస్‌ పరిస్థితి ఎలా ఉండేదో తెలియదన్నారు. గత ప్రభుత్వంపై కేసులన్నీ ఒకేసారి తెరిస్తే, చేసే ఏ ఒక్క పనీ పూర్తి చేయలేనని, అన్నీ స్తంభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు.

కేసులతో రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుందని, తాను ఏ విచారణకు ఆదేశించినా అందులో ప్రభుత్వ సంస్థలు, కేసీఆర్ మాత్రమే ఉండరని స్పష్టం చేశారు. ప్రైవేటు ఇన్‌ఫ్రా కంపెనీలు, ఇతర సంస్థలు కూడా ఉంటాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటికీ, మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

CM Revanth on AP CM Chandrababu Naidu : చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌పై ఎంత నిబద్ధతతో పని చేస్తారో, తానూ తెలంగాణ కోసం అంతే నిబద్ధతతో పని చేస్తానని వివరించారు. చంద్రబాబు చెప్పారని రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తే, ప్రజలు తననెందుకు రాజకీయాల్లో ఉంచుతారని ప్రశ్నించారు. తన ఉద్యోగం కోసమే ఆయన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపిన రేవంత్‌, ఇప్పుడు చంద్రబాబు కోసం ఆ ఉద్యోగం వదులుకుంటానా అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో జగన్‌ ఇంటి ముందు కూల్చివేతల గురించి తనకెవ్వరూ చెప్పలేదని సీఎం అన్నారు. దీనిపై ఆరా తీస్తే ఓ నాయకుడు చెప్పడంతోనే అధికారులు ఆ పని చేశారని తెలిసిందిని, అందుకే వారిని సరెండర్‌ చేశామని మీడియా ఇష్టాగోష్ఠిలో తెలిపారు. బయట మాత్రం చంద్రబాబు చెబితే తాను చేయించానని ప్రచారం చేశారని, జగన్‌ ఇంటి ముందు ఏమున్నాయో చూసేంత ఖాళీగా చంద్రబాబు ఉంటారా అని రేవంత్‌ ప్రశ్నించారు.

ఇప్పుడు జగన్‌ చచ్చిన పాములాంటి వ్యక్తి : ఇప్పుడు జగన్‌ అనే వ్యక్తి చచ్చిన పాము అని, అలాంటి వ్యక్తి ఇంటి ముందున్న గదులు కూలగొట్టాలని చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు ఏముంటుందని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్‌ హౌస్‌ ముందే ఏవేవో కట్టుకున్నారన్న సీఎం, అవేం తాము తీయలేదన్నారు. తన ప్రధాన ప్రత్యర్థి మీదే తాను ఇలాంటివి చేయనప్పుడు, జగన్‌ విషయంలో ఎందుకు చేస్తానని విమర్శలకు బదులిచ్చారు.

అమరావతి హైదరాబాద్‌కు పోటీ కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోనే ఒకవైపు ఉన్న వారు మరోవైపునకు వెళ్లడానికి ఇష్టపడటంలేదన్న ఆయన, అలాంటిది హైదరాబాద్‌ను వదిలి అమరావతిలో పెట్టుబడులు పెడతారనుకోవడంలేదన్నారు. అయితే, లాభం లేదంటే సొంతూర్లో కూడా ఎవ్వరూ పెట్టుబడి పెట్టరనీ, అమరావతిలో లాభం ఉంటే మనం తాడుతో కట్టేసినా ఆగకుండా అక్కడికిపోతారని వివరించారు.

CM Revanth Focus on State Development : ప్రాంతీయ రింగురోడ్డు ద్వారా 50 లక్షల ఎకరాల అభివృద్ధికి తలుపులు తెరిస్తే అమరావతి ఎక్కడుంటుందన్నారు. పోర్టులకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు వేస్తున్నామనీ, డ్రై పోర్టులు కడుతున్నందున నేరుగా కంటెయినర్లు ఇక్కడికే వస్తాయని వివరించారు. రాజస్థాన్‌లో మాదిరి డెస్టినేషన్‌ మ్యారేజ్‌ సెంటర్‌గా హైదరాబాద్‌ను మారుస్తామన్నారు.

రహదారుల నిర్మాణానికి మట్టిని తవ్వి, ఆ ప్రాంతాలను చెరువులుగా అభివృద్ధి చేస్తామని సీఎం వెల్లడించారు. రీజినల్‌ రింగ్‌రోడ్డు వెంట 24 రేడియల్‌ రోడ్లు నిర్మిస్తామని రేవంత్‌ తెలిపారు. దానివల్ల ఏ ప్రాంతానికైనా అరగంటలో చేరుకోవచ్చని చెప్పారు. అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలకు అవుటర్‌ రింగురోడ్లు వేస్తామన్న రేవంత్‌, 2050కల్లా గ్రీన్‌ తెలంగాణ తయారీకి ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు.

రెండు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ : గ్రేటర్‌ హైదరాబాద్‌ను రెండు కార్పొరేషన్లుగా విభజించి రెండు కమిషనరేట్లు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. హెచ్​ఎండీఏ సరిహద్దులను ఆర్ఆర్ఆర్ వరకు పెంచుతామన్న రేవంత్‌, జీహెచ్​ఎంసీ హద్దులను ఓఆర్ఆర్ వరకు విస్తరిస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ పాతబస్తీలో 40 శాతం విద్యుత్తు బిల్లులు వసూలు కావడంలేదన్న సీఎం, దీన్ని సరిదిద్దడానికి అదానీ వాళ్లను పిలిచామని వెల్లడించారు.

ఇక్కడి నుంచి 75 శాతం బిల్లు వసూలుచేసే బాధ్యతలను వారికి అప్పగిస్తున్నామని తెలిపారు. పాతబస్తీలో అండర్‌గ్రౌండ్‌ విద్యుత్తు లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని కోరినట్టు వెల్లడించారు. మరోవైపు దిల్లీలో తెలంగాణ భవన్‌ను మహారాష్ట్ర సదన్‌లా నిర్మిస్తామని సీఎం చెప్పారు. అయిదున్నర ఎకరాల్లో అధికారులు, ఎమ్మెల్యేలకు, మూడున్నర ఎకరాల్లో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులకు భవనాలను నిర్మిస్తామని వెల్లడించారు.

ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నాం - కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ కీలక కామెంట్స్ - CM REVANTH ON TG CABINET EXPANTION

'ఆర్​ఆర్​ఆర్​ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలి' - కేంద్రమంత్రి గడ్కరీకి సీఎం రేవంత్​ విజ్ఞప్తి - CM Revanth Reddy Delhi Tour

CM Revanth Sensational Comments On Harish Rao : దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, భారత రాష్ట్ర సమితి, ఆ పార్టీ అధినేత కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ట్రాప్‌లో పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల భవిష్యత్తులో బీఆర్ఎస్ బతకడం, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని జోస్యం చెప్పారు. కేసీఆర్ లేకుంటే తన సొంత లైన్‌ తీసుకోవచ్చని హరీశ్‌ ఎదురు చూస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చినా చంద్రబాబునాయుడు కోర్‌ రాజకీయాలను వదలకుండా పోరాడారని, అందుకే మళ్లీ గెలిచారని గుర్తు చేశారు. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి అలా లేదని స్పష్టం చేశారు.

ఇప్పుడు మా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం : ఎమ్మెల్యేలను చేర్చుకోవడం నెగెటివా? పాజిటివా? అన్నది కాదన్న సీఎం, ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు కారణంగానే హైదరాబాద్‌ చుట్టుపక్కల సెటిలర్ల ఓట్లు భారతీయ జనతా పార్టీకి వెళ్లాయని, దాని వల్లే మల్కాజిగిరి, చేవెళ్లలో ఆ పార్టీకి ప్రయోజనం కలిగిందని రేవంత్‌ అంచనా వేశారు.

శాసనసభ ఎన్నికలు కేసీఆర్​ను దించాలి? తనను గెలిపించాలి? అన్న అంశంపైనే జరిగాయని రేవంత్‌ అన్నారు. పదేళ్లు ఆయనకు వ్యతిరేకంగా కొట్లాడింది తానే కావడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా తనను ఎంచుకున్నారని రేవంత్‌ తెలిపారు. పాలనలో తన మార్కు ముద్ర వేయడమే లక్ష్యమని వివరించారు. కేసీఆర్ హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే గులాబీ పార్టీకి మనుగడ ఉంటుందని సీఎం వెల్లడించారు.

CM Revanth Chitchat Comments on KCR : చంద్రబాబు నాయుడు ముందు జగన్‌ ఎంత అని ప్రశ్నించిన రేవంత్‌, అయినా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పని చేశారని గుర్తు చేశారు. వాళ్లు తిట్టే తిట్లు, చేసే కామెంట్లను తట్టుకొని పోరాడారని, కోర్‌ ఏరియాను చంద్రబాబు వదల్లేదని అన్నారు. ఇక్కడ కేసీఆర్ ఆ పని చేయడం లేదని, హరీశ్‌రావు ఆ పని చేయించడం లేదని విమర్శించారు.

కేసీఆర్ పార్టీని నిలబెట్టుకునే మూడ్‌లో లేరని ఆరోపించిన రేవంత్‌, ఆయన ఇప్పుడు హరీశ్‌ ట్రాప్‌లో ఉండటంతో బీఆర్ఎస్ బతకడం కానీ, కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కానీ జరగదని స్పష్టం చేశారు. ఈరోజు భావోద్వేగాలు కేసీఆర్​కు వ్యతిరేకంగా ఉన్నాయన్న ముఖ్యమంత్రి, అందువల్ల ఆయన హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే గులాబీ పార్టీ బతుకుతుందని సూచించారు.

కేటీఆర్ ఎప్పుడైనా డమ్మీయే : పార్టీ బతికితే కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవిత ఉంటారు తప్ప, హరీశ్​ కాదని స్పష్టం చేశారు. అందుకే బీఆర్ఎస్ ఖతం కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి, చివరి వ్యక్తి హరీశ్‌రావేనని ఆరోపించారు. ఈటల రాజేందర్, నరేంద్ర, విజయశాంతిలను బయటికి గెంటించింది హరీశేనని విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ఎప్పుడైనా డమ్మీయేననీ, మీడియానే ఆయన్ను పెద్దగా ప్రొజెక్టు చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.

బీఆర్ఎస్ నేతలు తమ ఓట్లు తామే వేసుకొని ఉంటే కాంగ్రెస్‌ 12 సీట్లు సులభంగా గెలిచేదని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి డబ్బులు పంచి మరీ బీజేపీకి ఓట్లేయించారని ఆరోపించారు. బీఆర్ఎస్ డిపాజిట్లు తెచ్చుకున్న సీట్లలో కాంగ్రెస్‌ గెలిచిందనీ, ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయిన చోట్ల కమలం పార్టీ వికసించిందని వివరించారు.

కేసీఆర్‌ విధానాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలు : మరోవైపు రాష్ట్రంలో కమలం పార్టీ నిర్మాణం లేదన్న సీఎం, కేసీఆర్ బీఆర్ఎస్​ను విలీనం చేస్తే తప్ప ఆ పార్టీకి బలం ఉండదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి తెలుస్తుందని, తమ ప్రధాన ప్రత్యర్థిగా ఎవరుంటారనేది కమలం, గులాబీ పార్టీల పని తీరుపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. కేసీఆర్ విధానాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని స్పష్టం చేశారు.

ప్రజలు అధికారాన్ని మనకు సొంత పగలు తీర్చుకోవడానికి ఇవ్వరని జగన్‌ను చూసి నేర్చుకోవాలని సూచించారు. ఏపీ ప్రజలు 2019లో జగన్‌కు 151 సీట్లను ఎన్నో ఆశలతో ఇచ్చారన్న సీఎం రేవంత్‌, అధికారంలోకి వచ్చాక జగన్‌ చేసిన పనులు తప్పని నిరూపించడానికే మొన్న ప్రజలు 11 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలనుకున్నారని, కానీ ఆయనే తుడిచి పెట్టుకుపోయారని ఎద్దేవా చేశారు.

నా మార్కు పాలనే లక్ష్యం : సమాజంలో కొన్నింటిని బతకనిస్తే అవి సమాజానికో, మనకో పనికొస్తాయని, టీడీపీకి పోటీ చేసే పరిస్థితి కల్పించి ఉంటే వాళ్లు 10 శాతం ఓట్లు దక్కించుకొనేవారని అంచనా వేశారు. అప్పుడు కాంగ్రెస్‌ పరిస్థితి ఎలా ఉండేదో తెలియదన్నారు. గత ప్రభుత్వంపై కేసులన్నీ ఒకేసారి తెరిస్తే, చేసే ఏ ఒక్క పనీ పూర్తి చేయలేనని, అన్నీ స్తంభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు.

కేసులతో రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుందని, తాను ఏ విచారణకు ఆదేశించినా అందులో ప్రభుత్వ సంస్థలు, కేసీఆర్ మాత్రమే ఉండరని స్పష్టం చేశారు. ప్రైవేటు ఇన్‌ఫ్రా కంపెనీలు, ఇతర సంస్థలు కూడా ఉంటాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటికీ, మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

CM Revanth on AP CM Chandrababu Naidu : చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌పై ఎంత నిబద్ధతతో పని చేస్తారో, తానూ తెలంగాణ కోసం అంతే నిబద్ధతతో పని చేస్తానని వివరించారు. చంద్రబాబు చెప్పారని రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తే, ప్రజలు తననెందుకు రాజకీయాల్లో ఉంచుతారని ప్రశ్నించారు. తన ఉద్యోగం కోసమే ఆయన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపిన రేవంత్‌, ఇప్పుడు చంద్రబాబు కోసం ఆ ఉద్యోగం వదులుకుంటానా అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో జగన్‌ ఇంటి ముందు కూల్చివేతల గురించి తనకెవ్వరూ చెప్పలేదని సీఎం అన్నారు. దీనిపై ఆరా తీస్తే ఓ నాయకుడు చెప్పడంతోనే అధికారులు ఆ పని చేశారని తెలిసిందిని, అందుకే వారిని సరెండర్‌ చేశామని మీడియా ఇష్టాగోష్ఠిలో తెలిపారు. బయట మాత్రం చంద్రబాబు చెబితే తాను చేయించానని ప్రచారం చేశారని, జగన్‌ ఇంటి ముందు ఏమున్నాయో చూసేంత ఖాళీగా చంద్రబాబు ఉంటారా అని రేవంత్‌ ప్రశ్నించారు.

ఇప్పుడు జగన్‌ చచ్చిన పాములాంటి వ్యక్తి : ఇప్పుడు జగన్‌ అనే వ్యక్తి చచ్చిన పాము అని, అలాంటి వ్యక్తి ఇంటి ముందున్న గదులు కూలగొట్టాలని చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు ఏముంటుందని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్‌ హౌస్‌ ముందే ఏవేవో కట్టుకున్నారన్న సీఎం, అవేం తాము తీయలేదన్నారు. తన ప్రధాన ప్రత్యర్థి మీదే తాను ఇలాంటివి చేయనప్పుడు, జగన్‌ విషయంలో ఎందుకు చేస్తానని విమర్శలకు బదులిచ్చారు.

అమరావతి హైదరాబాద్‌కు పోటీ కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోనే ఒకవైపు ఉన్న వారు మరోవైపునకు వెళ్లడానికి ఇష్టపడటంలేదన్న ఆయన, అలాంటిది హైదరాబాద్‌ను వదిలి అమరావతిలో పెట్టుబడులు పెడతారనుకోవడంలేదన్నారు. అయితే, లాభం లేదంటే సొంతూర్లో కూడా ఎవ్వరూ పెట్టుబడి పెట్టరనీ, అమరావతిలో లాభం ఉంటే మనం తాడుతో కట్టేసినా ఆగకుండా అక్కడికిపోతారని వివరించారు.

CM Revanth Focus on State Development : ప్రాంతీయ రింగురోడ్డు ద్వారా 50 లక్షల ఎకరాల అభివృద్ధికి తలుపులు తెరిస్తే అమరావతి ఎక్కడుంటుందన్నారు. పోర్టులకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు వేస్తున్నామనీ, డ్రై పోర్టులు కడుతున్నందున నేరుగా కంటెయినర్లు ఇక్కడికే వస్తాయని వివరించారు. రాజస్థాన్‌లో మాదిరి డెస్టినేషన్‌ మ్యారేజ్‌ సెంటర్‌గా హైదరాబాద్‌ను మారుస్తామన్నారు.

రహదారుల నిర్మాణానికి మట్టిని తవ్వి, ఆ ప్రాంతాలను చెరువులుగా అభివృద్ధి చేస్తామని సీఎం వెల్లడించారు. రీజినల్‌ రింగ్‌రోడ్డు వెంట 24 రేడియల్‌ రోడ్లు నిర్మిస్తామని రేవంత్‌ తెలిపారు. దానివల్ల ఏ ప్రాంతానికైనా అరగంటలో చేరుకోవచ్చని చెప్పారు. అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలకు అవుటర్‌ రింగురోడ్లు వేస్తామన్న రేవంత్‌, 2050కల్లా గ్రీన్‌ తెలంగాణ తయారీకి ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు.

రెండు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ : గ్రేటర్‌ హైదరాబాద్‌ను రెండు కార్పొరేషన్లుగా విభజించి రెండు కమిషనరేట్లు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. హెచ్​ఎండీఏ సరిహద్దులను ఆర్ఆర్ఆర్ వరకు పెంచుతామన్న రేవంత్‌, జీహెచ్​ఎంసీ హద్దులను ఓఆర్ఆర్ వరకు విస్తరిస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ పాతబస్తీలో 40 శాతం విద్యుత్తు బిల్లులు వసూలు కావడంలేదన్న సీఎం, దీన్ని సరిదిద్దడానికి అదానీ వాళ్లను పిలిచామని వెల్లడించారు.

ఇక్కడి నుంచి 75 శాతం బిల్లు వసూలుచేసే బాధ్యతలను వారికి అప్పగిస్తున్నామని తెలిపారు. పాతబస్తీలో అండర్‌గ్రౌండ్‌ విద్యుత్తు లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని కోరినట్టు వెల్లడించారు. మరోవైపు దిల్లీలో తెలంగాణ భవన్‌ను మహారాష్ట్ర సదన్‌లా నిర్మిస్తామని సీఎం చెప్పారు. అయిదున్నర ఎకరాల్లో అధికారులు, ఎమ్మెల్యేలకు, మూడున్నర ఎకరాల్లో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులకు భవనాలను నిర్మిస్తామని వెల్లడించారు.

ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నాం - కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ కీలక కామెంట్స్ - CM REVANTH ON TG CABINET EXPANTION

'ఆర్​ఆర్​ఆర్​ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలి' - కేంద్రమంత్రి గడ్కరీకి సీఎం రేవంత్​ విజ్ఞప్తి - CM Revanth Reddy Delhi Tour

Last Updated : Jun 28, 2024, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.