ETV Bharat / politics

సికింద్రాబాద్‌ కా సికిందర్ కిషన్ రెడ్డి - వరుసగా రెండోసారి ఘనవిజయం - Kishan Reddy Wins in Secunderabad

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 5:20 PM IST

BJP Kishan ReddyWins Secunderabad Constituency : సికింద్రాబాద్​ నియోజకవర్గాన్ని బీజేపీ మరోసారి నిలబెట్టుకుంది. ఇక్కడి నుంచి పోటీ చేసిన కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి కాంగ్రెస్​ అభ్యర్థి దానం నాగేందర్​పై గౌడ్​పై ఘనవిజయం సాధించారు. నియోజకవర్గంలో కిషన్​రెడ్డికి ఇది వరుసగా రెండో గెలుపు.

BJP Kishan Reddy in Secunderabad Constituency
BJP Kishan Reddy in Secunderabad Constituency (ETV Bharat)

BJP Kishan Reddy in Secunderabad Constituency : సిక్రిందాబాద్​ నియోజకవర్గంలో వరుసగా రెండుసారి బీజేపీ జయకేతనం ఎగురవేసింది. పార్టీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో వరుసగా మూడోసారి పార్టీ అభ్యర్థి విజయభేరీ మెగించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాంగ్రెస్​ అభ్యర్థి దానం నాగేందర్​ను ఓడించారు. 2014లో ఈ స్థానం నుంచి బండారు దత్తాత్రేయ గెలుపొందగా, 2019లో కిషన్​ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు రెండోసారి కిషన్ రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

కిషన్ రెడ్డికి ఇక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్​ తరఫున పద్మారావు గౌడ్​,​ కిషన్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 6 స్థానాల్లో బీఆర్​ఎస్ అభ్యర్థులే గెలిచారు. ఖైరతాబాద్‌లో​ మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో కిషన్ రెడ్డికి పోటీ తీవ్రంగా ఉంటుందని అంతా భావించారు కానీ కిషన్ రెడ్డి తన మార్క్ ప్రచారంతో సత్తా చాటారు.

ఓట్ల లెక్కింపు షురూ - మొదట సికింద్రాబాద్ చివర హైదరాబాద్ ఫలితం - telangana LOk sabha Results 2024

బూత్​ స్థాయి నుంచి కార్యకర్తలను ఏకం చేస్తూ : అధికారంలో ఉన్నాం ఇది కూడా మనకే వస్తుంది అనుకున్నారు కాంగ్రెస్​ నేతలు. మొదట్లో బీజేపీకి ఇది సవాల్​గా అనిపించినా మోదీ నినాదంతో ముందుకు కదిలారు. మరోసారి మోదీ పాలన అంటు సాగారు. కమలం నేతలు ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేశారు. బూత్​స్థాయి నుంచి కార్యకర్తలను ఏకం చేస్తూ ప్రచారాన్ని సాగించారు. ఎటు వెళ్లినా మోదీ అభివృద్ధి, వారు అధికారంలోకి వస్తే చేసే కార్యక్రమాల గురించి వివరించారు. మరోవైపు బీఆర్​ఎస్ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ స్థానాన్ని గెలుచుకోలేదు. ఈసారి ఈ స్థానం గెలిచేందుకు స్థానిక నేత పద్మారావు గౌడ్​ను బరిలో దింపింది.

మోదీ హ్యట్రిక్​, రామమందిర నిర్మాణం : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసమే బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్​ను రప్పించి ఆయనకు టికెట్​ కట్టబెట్టింది. కార్పొరేటర్లు ఇతర నాయకులను హస్తం గూటికి వచ్చేలా రాజకీయం చేసింది. భాగ్యనగరంలో కాంగ్రెస్​ను బలపరించింది. దీంతో ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది. కానీ కమలానాథులు తమ మోదీ మంత్రం, ప్రచార వ్యూహంతో బీఆర్​ఎస్, కాంగ్రెస్​కు చెక్ పెట్టారు. మోదీ హ్యట్రిక్​ నినాదం, రామమందిర నిర్మాణంతో ప్రచారంలో సాగించి సికింద్రాబాద్ స్థానాన్ని కైవసం నిలబెట్టుకున్నారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక లెక్కింపు ప్రారంభం - మధ్యాహ్నం 3 గంటలకు ఫలితం - Secunderabad Cantonment Result 2024

15 కేంద్రాలు - 240 టేబుళ్లు - 1000 మంది సిబ్బంది - జంట నగరాల్లో ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ - Hyderabad Lok Sabha Counting day

BJP Kishan Reddy in Secunderabad Constituency : సిక్రిందాబాద్​ నియోజకవర్గంలో వరుసగా రెండుసారి బీజేపీ జయకేతనం ఎగురవేసింది. పార్టీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో వరుసగా మూడోసారి పార్టీ అభ్యర్థి విజయభేరీ మెగించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాంగ్రెస్​ అభ్యర్థి దానం నాగేందర్​ను ఓడించారు. 2014లో ఈ స్థానం నుంచి బండారు దత్తాత్రేయ గెలుపొందగా, 2019లో కిషన్​ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు రెండోసారి కిషన్ రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

కిషన్ రెడ్డికి ఇక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్​ తరఫున పద్మారావు గౌడ్​,​ కిషన్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 6 స్థానాల్లో బీఆర్​ఎస్ అభ్యర్థులే గెలిచారు. ఖైరతాబాద్‌లో​ మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో కిషన్ రెడ్డికి పోటీ తీవ్రంగా ఉంటుందని అంతా భావించారు కానీ కిషన్ రెడ్డి తన మార్క్ ప్రచారంతో సత్తా చాటారు.

ఓట్ల లెక్కింపు షురూ - మొదట సికింద్రాబాద్ చివర హైదరాబాద్ ఫలితం - telangana LOk sabha Results 2024

బూత్​ స్థాయి నుంచి కార్యకర్తలను ఏకం చేస్తూ : అధికారంలో ఉన్నాం ఇది కూడా మనకే వస్తుంది అనుకున్నారు కాంగ్రెస్​ నేతలు. మొదట్లో బీజేపీకి ఇది సవాల్​గా అనిపించినా మోదీ నినాదంతో ముందుకు కదిలారు. మరోసారి మోదీ పాలన అంటు సాగారు. కమలం నేతలు ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేశారు. బూత్​స్థాయి నుంచి కార్యకర్తలను ఏకం చేస్తూ ప్రచారాన్ని సాగించారు. ఎటు వెళ్లినా మోదీ అభివృద్ధి, వారు అధికారంలోకి వస్తే చేసే కార్యక్రమాల గురించి వివరించారు. మరోవైపు బీఆర్​ఎస్ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ స్థానాన్ని గెలుచుకోలేదు. ఈసారి ఈ స్థానం గెలిచేందుకు స్థానిక నేత పద్మారావు గౌడ్​ను బరిలో దింపింది.

మోదీ హ్యట్రిక్​, రామమందిర నిర్మాణం : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసమే బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్​ను రప్పించి ఆయనకు టికెట్​ కట్టబెట్టింది. కార్పొరేటర్లు ఇతర నాయకులను హస్తం గూటికి వచ్చేలా రాజకీయం చేసింది. భాగ్యనగరంలో కాంగ్రెస్​ను బలపరించింది. దీంతో ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది. కానీ కమలానాథులు తమ మోదీ మంత్రం, ప్రచార వ్యూహంతో బీఆర్​ఎస్, కాంగ్రెస్​కు చెక్ పెట్టారు. మోదీ హ్యట్రిక్​ నినాదం, రామమందిర నిర్మాణంతో ప్రచారంలో సాగించి సికింద్రాబాద్ స్థానాన్ని కైవసం నిలబెట్టుకున్నారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక లెక్కింపు ప్రారంభం - మధ్యాహ్నం 3 గంటలకు ఫలితం - Secunderabad Cantonment Result 2024

15 కేంద్రాలు - 240 టేబుళ్లు - 1000 మంది సిబ్బంది - జంట నగరాల్లో ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ - Hyderabad Lok Sabha Counting day

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.