ETV Bharat / opinion

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు - నిబంధనలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు - Paddy Procurement In Telangana 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 1:35 PM IST

Prathidwani Debate on Paddy Procurement in Telangana : తెలంగాణలో ధాన్యం సేకరణ కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని సూచించింది.మరి కొనుగోళ్లలో దళారులు, రైస్‌మిల్లర్లు పోషిస్తున్న పాత్ర ఏంటి? ధాన్యం నాణ్యత విషయంలో రైతులు పెంచుకోవాల్సిన అవగాహన ఏమిటి? అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని.

Paddy Procurement in Telangana 2024
Paddy Procurement in Telangana 2024

Prathidwani Debate on Paddy Procurement in Telangana : ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. రైతులెవరూ కనీస మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం అమ్ముకోవద్దని స్పష్టం చేసింది. దళారులకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అన్నదాతలు ధాన్యం అమ్ముకోవాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులు, మిల్లర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో 7,149 కొనుగోలుకేంద్రాలు ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటిదాకా 6,919 కేంద్రాలు తెరిచామని పౌరసరఫరాల శాఖ తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Yasangi Grain Purchase in Telangana : ధాన్యంలో తేమ 17 శాతం ఉంటేనే ఎంఎస్‌పీ వస్తుందని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. కొన్ని చోట్ల 50 శాతం పైగా తేమ వస్తుందని తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా 56 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరించిన 48 గంటల్లో నగదు చెల్లింపులు చేస్తున్నామని కమిషనర్ డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటి వరకు సర్కార్ ఎంత ధాన్యం సేకరించింది. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేసింది? అవకతవకలపై కర్షకులు ఫిర్యాదు చేసేందుకు చేసిన ఏర్పాట్లేంటి? కొనుగోళ్లలో దళారులు, రైస్‌మిల్లర్లు పోషిస్తున్న పాత్ర ఏంటి? ధాన్యం నాణ్యత విషయంలో రైతులు పెంచుకోవాల్సిన అవగాహన ఏమిటి? ఇదే నేటి ప్రతిధ్వని.

ఈ సంవత్సరం యాసంగిలో దాదాపు 75.40 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్ల కొనుగోళ్లు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ధాన్యం సేకరణకు 18.85 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయి. ఇప్పటికే 14 కోట్ల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 56 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్ల కొనుగోళ్లకు ఇవి సరిపోతాయి. మిగతావి కూడా వీలైనంత తొందరగా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఫిర్యాదులకు టోల్​ ఫ్రీ, హెల్ప్​ లైన్​ నంబర్లు : తెలంగాణలో మొట్టమొదటిసారిగా కేంద్ర, భారత ఆహార సంస్థ(Food Corporation of India) నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ముందస్తుగా కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉన్నట్లైతే అన్నదాతలు టోల్​ ఫ్రీ, హెల్ప్​లైన్(Toll Free Number)​ నంబర్లు 1967 లేదా 180042500333కు ఫోన్‌​ చేయవచ్చని పౌరసరఫరాల శాఖ సూచనలు చేసింది.

Prathidwani Debate on Paddy Procurement in Telangana : ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. రైతులెవరూ కనీస మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం అమ్ముకోవద్దని స్పష్టం చేసింది. దళారులకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అన్నదాతలు ధాన్యం అమ్ముకోవాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులు, మిల్లర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో 7,149 కొనుగోలుకేంద్రాలు ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటిదాకా 6,919 కేంద్రాలు తెరిచామని పౌరసరఫరాల శాఖ తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Yasangi Grain Purchase in Telangana : ధాన్యంలో తేమ 17 శాతం ఉంటేనే ఎంఎస్‌పీ వస్తుందని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. కొన్ని చోట్ల 50 శాతం పైగా తేమ వస్తుందని తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా 56 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరించిన 48 గంటల్లో నగదు చెల్లింపులు చేస్తున్నామని కమిషనర్ డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటి వరకు సర్కార్ ఎంత ధాన్యం సేకరించింది. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేసింది? అవకతవకలపై కర్షకులు ఫిర్యాదు చేసేందుకు చేసిన ఏర్పాట్లేంటి? కొనుగోళ్లలో దళారులు, రైస్‌మిల్లర్లు పోషిస్తున్న పాత్ర ఏంటి? ధాన్యం నాణ్యత విషయంలో రైతులు పెంచుకోవాల్సిన అవగాహన ఏమిటి? ఇదే నేటి ప్రతిధ్వని.

ఈ సంవత్సరం యాసంగిలో దాదాపు 75.40 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్ల కొనుగోళ్లు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ధాన్యం సేకరణకు 18.85 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయి. ఇప్పటికే 14 కోట్ల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 56 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్ల కొనుగోళ్లకు ఇవి సరిపోతాయి. మిగతావి కూడా వీలైనంత తొందరగా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఫిర్యాదులకు టోల్​ ఫ్రీ, హెల్ప్​ లైన్​ నంబర్లు : తెలంగాణలో మొట్టమొదటిసారిగా కేంద్ర, భారత ఆహార సంస్థ(Food Corporation of India) నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ముందస్తుగా కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉన్నట్లైతే అన్నదాతలు టోల్​ ఫ్రీ, హెల్ప్​లైన్(Toll Free Number)​ నంబర్లు 1967 లేదా 180042500333కు ఫోన్‌​ చేయవచ్చని పౌరసరఫరాల శాఖ సూచనలు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.