ETV Bharat / offbeat

వేసవి సెలవుల్లో తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్ - ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల తేదీలివే! - ARJITHA SEVA TICKETS FOR MAY

- శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా మే నెల షెడ్యూల్ విడుదల

ARJITHA SEVA TICKETS
Tirumala Special Darshan Tickets for May 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2025, 2:15 PM IST

Tirumala Special Darshan Tickets for May 2025 : తిరుమల కొండపై కొలువైన కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండలవాడి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. సాధారణ సమయంలోనే తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక సమ్మర్​లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో అధిక సంఖ్యలో తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు.

మీరూ ఆ జాబితాలో ఉన్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మే నెల కోటా ప్రత్యేక దర్శనం, ఇతర సేవల టికెట్లకు సంబంధించి ఆన్​లైన్ టికెట్ల విడుదల తేదీలను ప్రకటించింది టీటీడీ. మరి, మే నెలకు సంబంధించి ఏయే తేదీల్లో ఏ ఏ టికెట్లను విడుదల చేస్తారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మే నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఈనెల(ఫిబ్రవరి) 21వ తేదీ ఉదయం పది గంటలకు ఆన్​లైన్​లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ సేవా టికెట్లను విడుదల చేస్తారు.

అంగప్రదక్షిణం టోకెన్లు : ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం పది గంటలకు మే నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటా, ఉదయం 11 గంటలకు శ్రీవాణిట్రస్టు బ్రేక్‌ దర్శనం కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

తిరుమల 'పాండవ తీర్థం'- ఒక్కసారి స్నానం చేస్తే చాలు- అన్నింటా విజయం తథ్యం!

ప్రత్యేక దర్శనం టికెట్లు : 24వ తేదీ ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన రూ.300 టికెట్ల కోటా(ప్రత్యేక దర్శనం టికెట్లు) ఆన్​లైన్​లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే, ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల బుకింగ్‌ కోటా విడుదల ఉంటుందని పేర్కొంది.

శ్రీవారి సేవ కోటా : అదేవిధంగా, శ్రీవారి సేవ కోటా టికెట్లను 27న మార్నింగ్ 11 గంటలకు, న‌వ‌నీత సేవ టికెట్లు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ టోకెన్లు ఒంటి గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఆ టికెట్లు విడుదల :

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవకు సంబంధించి మే నెల కోటా టికెట్లను ఈ నెల 18(మంగళవారం) ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. వీటి లక్కీడిప్‌ కోటా కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చు.

మే నెలలో తిరుమల వెళ్లే భక్తులు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, స్పెషల్​ దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ను సందర్శించాలని టీటీడీ సూచించింది.

అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వెళుతున్నారా? - టీటీడీ కీలక సూచన ఇవే!

Tirumala Special Darshan Tickets for May 2025 : తిరుమల కొండపై కొలువైన కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండలవాడి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. సాధారణ సమయంలోనే తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక సమ్మర్​లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో అధిక సంఖ్యలో తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు.

మీరూ ఆ జాబితాలో ఉన్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మే నెల కోటా ప్రత్యేక దర్శనం, ఇతర సేవల టికెట్లకు సంబంధించి ఆన్​లైన్ టికెట్ల విడుదల తేదీలను ప్రకటించింది టీటీడీ. మరి, మే నెలకు సంబంధించి ఏయే తేదీల్లో ఏ ఏ టికెట్లను విడుదల చేస్తారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మే నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఈనెల(ఫిబ్రవరి) 21వ తేదీ ఉదయం పది గంటలకు ఆన్​లైన్​లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ సేవా టికెట్లను విడుదల చేస్తారు.

అంగప్రదక్షిణం టోకెన్లు : ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం పది గంటలకు మే నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటా, ఉదయం 11 గంటలకు శ్రీవాణిట్రస్టు బ్రేక్‌ దర్శనం కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

తిరుమల 'పాండవ తీర్థం'- ఒక్కసారి స్నానం చేస్తే చాలు- అన్నింటా విజయం తథ్యం!

ప్రత్యేక దర్శనం టికెట్లు : 24వ తేదీ ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన రూ.300 టికెట్ల కోటా(ప్రత్యేక దర్శనం టికెట్లు) ఆన్​లైన్​లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే, ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల బుకింగ్‌ కోటా విడుదల ఉంటుందని పేర్కొంది.

శ్రీవారి సేవ కోటా : అదేవిధంగా, శ్రీవారి సేవ కోటా టికెట్లను 27న మార్నింగ్ 11 గంటలకు, న‌వ‌నీత సేవ టికెట్లు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ టోకెన్లు ఒంటి గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఆ టికెట్లు విడుదల :

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవకు సంబంధించి మే నెల కోటా టికెట్లను ఈ నెల 18(మంగళవారం) ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. వీటి లక్కీడిప్‌ కోటా కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చు.

మే నెలలో తిరుమల వెళ్లే భక్తులు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, స్పెషల్​ దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ను సందర్శించాలని టీటీడీ సూచించింది.

అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వెళుతున్నారా? - టీటీడీ కీలక సూచన ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.