ETV Bharat / offbeat

చింత పండుతో చేసే పచ్చిపులుసు అందరికీ తెలుసు - పల్లీలతో చేస్తారని మీకు తెలుసా? - తిని తీరాల్సిందే గురూ! - Palli Pachi Pulusu Recipe

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 5:13 PM IST

Palli Pachi Pulusu Recipe : పచ్చిపులుసు అంటే చింతపండుతో మాత్రమే చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ.. పల్లీలతో కూడా చేస్తారు. ఈ డిఫరెంట్​ రెసిపీ వేరే లెవల్ అనే చెప్పాలి. మరి, ఈ పల్లీల పచ్చిపులుసును ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Palli Pachi Pulusu
Palli Pachi Pulusu (ETV Bharat)

How to Make Palli Pachi Pulusu : చాలా మందికి పచ్చి పులుసుతో అన్నం తినడం చాలా ఇష్టం. అయితే.. చింతపండుతో (Pachi Pulusu) చేసే పచ్చిపులుసు మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ.. పల్లీలతో కూడా "పచ్చిపులుసు" చేస్తారు. దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన పనిలేదు. చాలా సింపుల్​గా పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. పైగా శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఇంతకీ.. పల్లీల పచ్చిపులుసు తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • ఒక కప్పు - పల్లీలు
  • ఒక కప్పు - చింతపండు రసం
  • మూడు - పచ్చిమిర్చి
  • ఒక కప్పు - ఉల్లిపాయ ముక్కలు
  • అర కప్పు - వెల్లుల్లి రెబ్బలు
  • రుచికి సరిపడా - ఉప్పు
  • 2 టేబుల్ స్పూన్లు - నూనె
  • 1 టేబుల్ స్పూన్ - పోపు దినుసులు
  • కొద్దిగా - కరివేపాకు
  • కొద్దిగా - కొత్తిమీర తరుగు

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్​లో చింతపండును నానబెట్టుకోవాలి. అలాగే.. ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని మంటను లో ఫ్లేమ్​లో ఉంచి పల్లీలను వేయించుకొని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆపై.. అదే పాన్​లో పచ్చిమిర్చిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పేస్ట్​లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం.. ఒక మిక్సింగ్ బౌల్​లో నానబెట్టిన చింతపండును తీసుకొని కావాల్సిన పరిమాణంలో వాటర్ యాడ్ చేసుకుంటూ చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
  • ఆ విధంగా రసాన్ని తయారు చేసుకున్నాక.. అందులో రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి.
  • ఆ తర్వాత.. మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్​ను చింతపండు రసంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమాన్ని తాలింపు పెట్టుకోవాలి. ఇందుకోసం.. స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక పోపు దినుసులు వేసుకొని కాసేపు వేయించుకోవాలి. అలాగే.. తాలింపు చివరలో కరివేపాకు, కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
  • తాలింపు బాగా వేగిందనుకున్నాక.. స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఆపై తాలింపును ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న చింతపండు రసంలో వేసి కలుపుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "పల్లీల పచ్చిపులుసు" రెడీ!
  • దీన్ని వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకుని తిన్నారంటే టేస్ట్ సూపర్​గా ఉంటుంది.
  • అంతేకాదు.. పల్లీ పచ్చిపులుసు మరీ పల్చగా ఉండదు కాబట్టి.. దీన్ని ఇడ్లీ, ఉప్మాలోకి వేసుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుంది!

ఇవీ చదవండి :

వర్షాకాలంలో "పచ్చి పులుసు" ఇలా చేస్తే - టేస్ట్​ గురించి చెప్పడం కాదు, ఆస్వాదించాల్సిందే!

నిమిషాల్లో ఘుమఘుమలాడే "మైసూర్​ రసం" - ఇలా చేశారంటే సూపర్​ టేస్ట్​ పక్కా! తినడమే కాదు తాగేస్తారు కూడా!

How to Make Palli Pachi Pulusu : చాలా మందికి పచ్చి పులుసుతో అన్నం తినడం చాలా ఇష్టం. అయితే.. చింతపండుతో (Pachi Pulusu) చేసే పచ్చిపులుసు మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ.. పల్లీలతో కూడా "పచ్చిపులుసు" చేస్తారు. దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన పనిలేదు. చాలా సింపుల్​గా పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. పైగా శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఇంతకీ.. పల్లీల పచ్చిపులుసు తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • ఒక కప్పు - పల్లీలు
  • ఒక కప్పు - చింతపండు రసం
  • మూడు - పచ్చిమిర్చి
  • ఒక కప్పు - ఉల్లిపాయ ముక్కలు
  • అర కప్పు - వెల్లుల్లి రెబ్బలు
  • రుచికి సరిపడా - ఉప్పు
  • 2 టేబుల్ స్పూన్లు - నూనె
  • 1 టేబుల్ స్పూన్ - పోపు దినుసులు
  • కొద్దిగా - కరివేపాకు
  • కొద్దిగా - కొత్తిమీర తరుగు

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్​లో చింతపండును నానబెట్టుకోవాలి. అలాగే.. ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని మంటను లో ఫ్లేమ్​లో ఉంచి పల్లీలను వేయించుకొని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆపై.. అదే పాన్​లో పచ్చిమిర్చిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పేస్ట్​లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం.. ఒక మిక్సింగ్ బౌల్​లో నానబెట్టిన చింతపండును తీసుకొని కావాల్సిన పరిమాణంలో వాటర్ యాడ్ చేసుకుంటూ చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
  • ఆ విధంగా రసాన్ని తయారు చేసుకున్నాక.. అందులో రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి.
  • ఆ తర్వాత.. మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్​ను చింతపండు రసంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమాన్ని తాలింపు పెట్టుకోవాలి. ఇందుకోసం.. స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక పోపు దినుసులు వేసుకొని కాసేపు వేయించుకోవాలి. అలాగే.. తాలింపు చివరలో కరివేపాకు, కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి.
  • తాలింపు బాగా వేగిందనుకున్నాక.. స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఆపై తాలింపును ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న చింతపండు రసంలో వేసి కలుపుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "పల్లీల పచ్చిపులుసు" రెడీ!
  • దీన్ని వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకుని తిన్నారంటే టేస్ట్ సూపర్​గా ఉంటుంది.
  • అంతేకాదు.. పల్లీ పచ్చిపులుసు మరీ పల్చగా ఉండదు కాబట్టి.. దీన్ని ఇడ్లీ, ఉప్మాలోకి వేసుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుంది!

ఇవీ చదవండి :

వర్షాకాలంలో "పచ్చి పులుసు" ఇలా చేస్తే - టేస్ట్​ గురించి చెప్పడం కాదు, ఆస్వాదించాల్సిందే!

నిమిషాల్లో ఘుమఘుమలాడే "మైసూర్​ రసం" - ఇలా చేశారంటే సూపర్​ టేస్ట్​ పక్కా! తినడమే కాదు తాగేస్తారు కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.