ETV Bharat / offbeat

IRCTC ఉత్తరాంధ్ర స్పెషల్​ టూర్​​ ​- ఓవైపు భగవత్​ దర్శనాలు - మరోవైపు బీచ్​లో సరదాలు​ - ధర చాలా తక్కువ! - IRCTC Tour Packages

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 10:27 AM IST

IRCTC Uttarandhra Tour Package: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) పర్యాటకుల కోసం ఎప్పుడూ కొత్తకొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తుంటుంది. తాజాగా ఉత్తరాంధ్రలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకునేందుకు వీలుగా ఒక ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్​సీటీసీ. ఆ వివరాలు మీ కోసం..

Tour Package
IRCTC Uttarandhra Tour Package (ETV Bharat)

IRCTC Uttarandhra Tour: ప్రముఖ పుణ్యక్షేత్రాలు, టూరిస్ట్​ ప్లేసెస్​ చూడడానికి వీలుగా ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఎప్పటికప్పుడు కొత్త టూర్​ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా ఉత్తరాంధ్రలోని ప్రముఖ ఆలయాలను కవర్​ చేస్తూ ఒక ప్యాకేజీని ప్రకటించింది. ఈ ట్రిప్​ ద్వారా మీరు చాలా తక్కువ బడ్జెట్లోనే వివిధ టూరిస్ట్​ ప్లేసెస్​ చూడొచ్చు. ఈ ప్యాకేజీ ద్వారా ఏ ఆలయాలను చూడొచ్చు ? ట్రిప్ ఎన్ని రోజులుంటుంది ? ధర ఎంత ? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

IRCTC 'ఉత్తరాంధ్ర వరల్డ్​ ఫేమస్​ టెంపుల్​' (Uttarandhra World Famous Temple) పేరుతో ఈ టూర్​ని ఆపరేట్​ చేస్తోంది. ఉత్తరాంధ్ర టూర్​ విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతుంది. ఈ టూర్​కు మీరు వెళ్లాలనుకుంటే ఫస్ట్​ మీరు విశాఖపట్టణం చేరుకోవాలి. తర్వాత అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఒక రాత్రి, రెండు పగళ్లు ఉండే ఈ టూర్​ ప్రతిరోజు అందుబాటులో ఉంటుందని IRCTC వెల్లడించింది.

టూర్​ ఇలా సాగుతుంది :

మొదటిరోజు పర్యాటకుల్ని విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ దగ్గర పికప్ చేసుకుంటారు. హోటల్​కి చేరుకుని బ్రేక్​ఫాస్ట్​ చేసి అరసవిల్లి బయల్దేరాలి. అక్కడ శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. భోజనం తర్వాత శ్రీకాకుళం వెళ్తారు. అక్కడ శ్రీకూర్మంలో శ్రీ కూర్మనాథ స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే శ్రీముఖలింగంలో శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయాన్ని చూస్తారు. అక్కడి నుంచి విశాఖపట్టణానికి బయలుదేరతారు. నైట్​ విశాఖలోనే స్టే చేస్తారు.

రెండవ రోజు ఉదయం టిఫెన్​ చేసిన తర్వాత.. సింహాచలంలోని వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. తర్వాత అక్కడ నుంచి కైలాసగిరి కొండలను చూడడానికి వెళ్తారు. లంచ్​ చేసిన తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం చూడొచ్చు. అలాగే సాయంత్రం ఆర్.కె. బీచ్​లో ఫుల్​గా ఎంజాయ్​ చేయవచ్చు. తర్వాత మిమ్మల్ని రైల్వే స్టేషన్​/ఎయిర్​పోర్ట్​/బస్​ స్టేషన్లలో డ్రాప్​ చేస్తారు. దీంతో టూర్​ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ ఉత్తరాంధ్ర టూర్​ ధర వివరాలు..

  • 1 - 3 ముగ్గురు వ్యక్తులు బుక్‌ చేసుకుంటే.. కంఫర్ట్​లో.. సింగిల్​ షేరింగ్​కి రూ. 13,015 ఛార్జ్ చేస్తారు. డబుల్​ షేరింగ్​కు రూ. 7,225, ట్రిపుల్​ షేరింగ్​ కోసం రూ. 5,300గా నిర్ణయించారు. ఇక పిల్లలకు విత్​ బెడ్​తో రూ. 4,650, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ. 3,020 చెల్లించాల్సి ఉంటుంది.
  • నలుగురు నుంచి ఆరుగురు కలిసి బుక్‌ చేసుకుంటే.. కంఫర్ట్‌లో.. డబుల్‌ షేరింగ్‌కు రూ.5,865, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.5,420 చెల్లించాలి. పిల్లలకు విత్ బెడ్‌ అయితే రూ. 4,775, విత్ అవుట్ బెడ్ అయితే రూ.3,540 చెల్లించాలి.
  • ఉత్తరాంధ్ర టూర్​ ప్యాకేజీ బుకింగ్​ కోసం, అలాగే పూర్తి వివరాల కోసం ఈ లింక్​ క్లిక్​ చేయండి.

ఇవి కూడా చదవండి :

హైదరాబాద్​ to కాశీ - కేవలం రూ.15 వేలకే ఆరు రోజుల టూర్!

ఐఆర్​సీటీసీ "గ్లోరీ ఆఫ్​ గుజరాత్​ విత్​ మౌంట్​ అబూ" - ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర కూడా తక్కువే!

IRCTC Uttarandhra Tour: ప్రముఖ పుణ్యక్షేత్రాలు, టూరిస్ట్​ ప్లేసెస్​ చూడడానికి వీలుగా ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఎప్పటికప్పుడు కొత్త టూర్​ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా ఉత్తరాంధ్రలోని ప్రముఖ ఆలయాలను కవర్​ చేస్తూ ఒక ప్యాకేజీని ప్రకటించింది. ఈ ట్రిప్​ ద్వారా మీరు చాలా తక్కువ బడ్జెట్లోనే వివిధ టూరిస్ట్​ ప్లేసెస్​ చూడొచ్చు. ఈ ప్యాకేజీ ద్వారా ఏ ఆలయాలను చూడొచ్చు ? ట్రిప్ ఎన్ని రోజులుంటుంది ? ధర ఎంత ? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.

IRCTC 'ఉత్తరాంధ్ర వరల్డ్​ ఫేమస్​ టెంపుల్​' (Uttarandhra World Famous Temple) పేరుతో ఈ టూర్​ని ఆపరేట్​ చేస్తోంది. ఉత్తరాంధ్ర టూర్​ విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతుంది. ఈ టూర్​కు మీరు వెళ్లాలనుకుంటే ఫస్ట్​ మీరు విశాఖపట్టణం చేరుకోవాలి. తర్వాత అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఒక రాత్రి, రెండు పగళ్లు ఉండే ఈ టూర్​ ప్రతిరోజు అందుబాటులో ఉంటుందని IRCTC వెల్లడించింది.

టూర్​ ఇలా సాగుతుంది :

మొదటిరోజు పర్యాటకుల్ని విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ దగ్గర పికప్ చేసుకుంటారు. హోటల్​కి చేరుకుని బ్రేక్​ఫాస్ట్​ చేసి అరసవిల్లి బయల్దేరాలి. అక్కడ శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. భోజనం తర్వాత శ్రీకాకుళం వెళ్తారు. అక్కడ శ్రీకూర్మంలో శ్రీ కూర్మనాథ స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే శ్రీముఖలింగంలో శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయాన్ని చూస్తారు. అక్కడి నుంచి విశాఖపట్టణానికి బయలుదేరతారు. నైట్​ విశాఖలోనే స్టే చేస్తారు.

రెండవ రోజు ఉదయం టిఫెన్​ చేసిన తర్వాత.. సింహాచలంలోని వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. తర్వాత అక్కడ నుంచి కైలాసగిరి కొండలను చూడడానికి వెళ్తారు. లంచ్​ చేసిన తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం చూడొచ్చు. అలాగే సాయంత్రం ఆర్.కె. బీచ్​లో ఫుల్​గా ఎంజాయ్​ చేయవచ్చు. తర్వాత మిమ్మల్ని రైల్వే స్టేషన్​/ఎయిర్​పోర్ట్​/బస్​ స్టేషన్లలో డ్రాప్​ చేస్తారు. దీంతో టూర్​ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ ఉత్తరాంధ్ర టూర్​ ధర వివరాలు..

  • 1 - 3 ముగ్గురు వ్యక్తులు బుక్‌ చేసుకుంటే.. కంఫర్ట్​లో.. సింగిల్​ షేరింగ్​కి రూ. 13,015 ఛార్జ్ చేస్తారు. డబుల్​ షేరింగ్​కు రూ. 7,225, ట్రిపుల్​ షేరింగ్​ కోసం రూ. 5,300గా నిర్ణయించారు. ఇక పిల్లలకు విత్​ బెడ్​తో రూ. 4,650, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ. 3,020 చెల్లించాల్సి ఉంటుంది.
  • నలుగురు నుంచి ఆరుగురు కలిసి బుక్‌ చేసుకుంటే.. కంఫర్ట్‌లో.. డబుల్‌ షేరింగ్‌కు రూ.5,865, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.5,420 చెల్లించాలి. పిల్లలకు విత్ బెడ్‌ అయితే రూ. 4,775, విత్ అవుట్ బెడ్ అయితే రూ.3,540 చెల్లించాలి.
  • ఉత్తరాంధ్ర టూర్​ ప్యాకేజీ బుకింగ్​ కోసం, అలాగే పూర్తి వివరాల కోసం ఈ లింక్​ క్లిక్​ చేయండి.

ఇవి కూడా చదవండి :

హైదరాబాద్​ to కాశీ - కేవలం రూ.15 వేలకే ఆరు రోజుల టూర్!

ఐఆర్​సీటీసీ "గ్లోరీ ఆఫ్​ గుజరాత్​ విత్​ మౌంట్​ అబూ" - ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర కూడా తక్కువే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.