ETV Bharat / offbeat

ఐఆర్​సీటీసీ "మ్యాజికల్​ మధ్యప్రదేశ్​" - సాంచి స్థూపంతో పాటు ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర చాలా తక్కువ! - IRCTC Magical Madhya Pradesh Tour

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

IRCTC Madhya Pradesh Tour: మధ్యప్రదేశ్​లోని పలు దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఐఆర్​సీటీసీ సూపర్​ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

IRCTC Magical Madhya Pradesh Package
IRCTC Magical Madhya Pradesh Package (ETV Bharat)

IRCTC Magical Madhya Pradesh Package: దేశంలోని గొప్ప పర్యాటక రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. ఆధ్యాత్మికత, చారిత్రక, ప్రపంచ వారసత్వ సంపద, ప్ర‌కృతి రమణీయత, వన్యప్రాణి సంరక్ష కేంద్రాలు బోలెడున్నాయి ఉన్నాయి ఇక్కడ చూడటానికి. అయితే వీటిలో కొన్ని ప్రదేశాలు చూసే విధంగా ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ ​ఓ ప్యాకేజీని ప్రకటించింది. మరి ఈ ప్యాకేజీ ఎప్పుడు మొదలవుతుంది? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఐఆర్​సీటీసీ మ్యాజికల్​ మధ్యప్రదేశ్(Magical Madhya Pradesh )​ పేరుతో ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగతుంది. హైదరాబాద్​ నుంచి ట్రైన్​ జర్నీ ద్వారా మధ్యప్రదేశ్​ చుట్టేసి రావొచ్చు. ఈ టూర్​లో భోపాల్​, జబల్​పూర్​, పచ్మార్హి వంటి ప్రదేశాలు విజిట్​ చేయవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు సాయంత్రం 4:40 గంటలకు కాచీగూడ రైల్వే స్టేషన్​ నుంచి సంపర్క్​ క్రాంతి ట్రైన్​ బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 8 గంటలకు భోపాల్​ చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్​ చేసుకుని ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. అక్కడ చెకిన్​ అండ్​ ఫ్రెషప్​ తర్వాత సాంచికి స్టార్ట్​ అవుతారు. అక్కడ సాంచి స్థూప సందర్శిస్తారు. ఆ తర్వాత భోజేశ్వర్​ మహాదేవ్​ టెంపుల్​ దర్శించుకుంటారు. తిరిగి భోపాల్​ చేరుకుంటారు. సాయంత్రం ట్రైబల్​ మ్యూజియం విజిట్​ చేస్తారు. ఆ రాత్రికి భోపాల్​లోనే స్టే చేస్తారు.

బెస్ట్ రిలాక్సేషన్ టూర్ - కేరళకు IRCTC సూపర్ ప్యాకేజీ - గాడ్స్​ ఓన్ కంట్రీలో 7 రోజులు!

  • మూడో రోజు హోటల్​లో బ్రేక్​ఫాస్ట్​ అనంతరం పచ్మార్హికి బయలుదేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత.. ఫ్రీ టైమ్​లో అక్కడి ప్లేస్​లు చూడొచ్చు. ఆ తర్వాత ఆ రాత్రికి హోటల్​లో స్టే చేయాలి.
  • నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత పాంచ్​​ పాండవ్​ కేవ్స్, జట శంకర్​ టెంపుల్​ దర్శించుకుంటారు. అలాగే బీ ఫాల్స్​, సన్​సెట్​ పాయింట్​ విజిట్​ చేస్తారు. ఆ తర్వాత తిరిగి హోటల్​కు చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • ఐదో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత జబల్​పూర్​ బయలుదేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత.. మధ్యాహ్నం మార్బుల్​ రాక్స్​, ధుంధర్ జలపాతం విజిట్​ చేస్తారు. ఆ తర్వాత జబల్​పూర్​ రైల్వే స్టేషన్​లో డ్రాప్​ చేస్తారు. అక్కడి నుంచి తెల్లవారు జామున 2 గంటలకు సికింద్రాబాద్​కు రిటర్న్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది.
  • ఆరో రోజు రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్​కు చేరుకోవడంతో టూర్​ పూర్తవుతుంది.

హైదరాబాద్​ టూ అయోధ్య వయా వారణాసి - రూ.16వేలకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!

ధర వివరాలు చూస్తే:

  • కంఫర్ట్​(3AC)లో ట్విన్​ షేరింగ్​కు రూ.23,940 చెల్లించాలి. ట్రిపుల్​ షేరింగ్​కు రూ.18,290గా నిర్ణయించారు.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.13,430, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.11,810గా చెల్లించాలి.

ప్యాకేజీలో కవర్​ అయ్యేవి ఇవే:

  • ట్రైన్​ టికెట్లు
  • ప్యాకేజీని బట్టి ట్రాన్స్​పోర్ట్​ కోసం వెహికల్​
  • బ్రేక్​ఫాస్ట్​తో కలిపి 3 రోజులు అకామిడేషన్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ టూర్​ అక్టోబర్​ 4, 18, నవంబర్​ 1, 15, 29వ తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి..

కాఫీ విత్ కర్ణాటక : హైదరాబాద్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! - తక్కువ ధరలోనే ఎంజాయ్​ చేసిరావొచ్చు!

హైదరాబాద్​ to కాశీ - కేవలం రూ.15 వేలకే ఆరు రోజుల టూర్!

IRCTC Magical Madhya Pradesh Package: దేశంలోని గొప్ప పర్యాటక రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. ఆధ్యాత్మికత, చారిత్రక, ప్రపంచ వారసత్వ సంపద, ప్ర‌కృతి రమణీయత, వన్యప్రాణి సంరక్ష కేంద్రాలు బోలెడున్నాయి ఉన్నాయి ఇక్కడ చూడటానికి. అయితే వీటిలో కొన్ని ప్రదేశాలు చూసే విధంగా ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ ​ఓ ప్యాకేజీని ప్రకటించింది. మరి ఈ ప్యాకేజీ ఎప్పుడు మొదలవుతుంది? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఐఆర్​సీటీసీ మ్యాజికల్​ మధ్యప్రదేశ్(Magical Madhya Pradesh )​ పేరుతో ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగతుంది. హైదరాబాద్​ నుంచి ట్రైన్​ జర్నీ ద్వారా మధ్యప్రదేశ్​ చుట్టేసి రావొచ్చు. ఈ టూర్​లో భోపాల్​, జబల్​పూర్​, పచ్మార్హి వంటి ప్రదేశాలు విజిట్​ చేయవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు సాయంత్రం 4:40 గంటలకు కాచీగూడ రైల్వే స్టేషన్​ నుంచి సంపర్క్​ క్రాంతి ట్రైన్​ బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 8 గంటలకు భోపాల్​ చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్​ చేసుకుని ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. అక్కడ చెకిన్​ అండ్​ ఫ్రెషప్​ తర్వాత సాంచికి స్టార్ట్​ అవుతారు. అక్కడ సాంచి స్థూప సందర్శిస్తారు. ఆ తర్వాత భోజేశ్వర్​ మహాదేవ్​ టెంపుల్​ దర్శించుకుంటారు. తిరిగి భోపాల్​ చేరుకుంటారు. సాయంత్రం ట్రైబల్​ మ్యూజియం విజిట్​ చేస్తారు. ఆ రాత్రికి భోపాల్​లోనే స్టే చేస్తారు.

బెస్ట్ రిలాక్సేషన్ టూర్ - కేరళకు IRCTC సూపర్ ప్యాకేజీ - గాడ్స్​ ఓన్ కంట్రీలో 7 రోజులు!

  • మూడో రోజు హోటల్​లో బ్రేక్​ఫాస్ట్​ అనంతరం పచ్మార్హికి బయలుదేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత.. ఫ్రీ టైమ్​లో అక్కడి ప్లేస్​లు చూడొచ్చు. ఆ తర్వాత ఆ రాత్రికి హోటల్​లో స్టే చేయాలి.
  • నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత పాంచ్​​ పాండవ్​ కేవ్స్, జట శంకర్​ టెంపుల్​ దర్శించుకుంటారు. అలాగే బీ ఫాల్స్​, సన్​సెట్​ పాయింట్​ విజిట్​ చేస్తారు. ఆ తర్వాత తిరిగి హోటల్​కు చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • ఐదో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత జబల్​పూర్​ బయలుదేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత.. మధ్యాహ్నం మార్బుల్​ రాక్స్​, ధుంధర్ జలపాతం విజిట్​ చేస్తారు. ఆ తర్వాత జబల్​పూర్​ రైల్వే స్టేషన్​లో డ్రాప్​ చేస్తారు. అక్కడి నుంచి తెల్లవారు జామున 2 గంటలకు సికింద్రాబాద్​కు రిటర్న్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది.
  • ఆరో రోజు రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్​కు చేరుకోవడంతో టూర్​ పూర్తవుతుంది.

హైదరాబాద్​ టూ అయోధ్య వయా వారణాసి - రూ.16వేలకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!

ధర వివరాలు చూస్తే:

  • కంఫర్ట్​(3AC)లో ట్విన్​ షేరింగ్​కు రూ.23,940 చెల్లించాలి. ట్రిపుల్​ షేరింగ్​కు రూ.18,290గా నిర్ణయించారు.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.13,430, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.11,810గా చెల్లించాలి.

ప్యాకేజీలో కవర్​ అయ్యేవి ఇవే:

  • ట్రైన్​ టికెట్లు
  • ప్యాకేజీని బట్టి ట్రాన్స్​పోర్ట్​ కోసం వెహికల్​
  • బ్రేక్​ఫాస్ట్​తో కలిపి 3 రోజులు అకామిడేషన్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ టూర్​ అక్టోబర్​ 4, 18, నవంబర్​ 1, 15, 29వ తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి..

కాఫీ విత్ కర్ణాటక : హైదరాబాద్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! - తక్కువ ధరలోనే ఎంజాయ్​ చేసిరావొచ్చు!

హైదరాబాద్​ to కాశీ - కేవలం రూ.15 వేలకే ఆరు రోజుల టూర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.