ETV Bharat / offbeat

ఎండు మిర్చితో కారం పొడి రొటీన్ - పచ్చి మిర్చితో ప్రిపేర్ చేసి చూడండి! - అద్దిరిపోయే రుచి మీ సొంతం

- అన్నంలోకి, టిఫెన్​లోకి సూపర్ కాంబి నేషన్ - ఒక్కసారి తిన్నారంటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు!

author img

By ETV Bharat Features Team

Published : 2 hours ago

Pachi Mirchi Karam Podi Recipe
Pachi Mirchi Karam Podi Recipe (ETV Bharat)

Pachi Mirchi Karam Podi Recipe in Telugu: మనకు ఎండు మిర్చి కారం పొడి తెలుసు. నల్ల కారం పొడి తెలుసు. హోటల్​లో దొరికే కారం పొడి కూడా తెలుసు. కానీ.. పచ్చి మిర్చి కారం పొడి గురించి మీకు తెలుసా? ఇది సరికొత్తగా ఉండడమే కాదు.. టేస్ట్​ కూడా అంతకు మించి అనేలా ఉంటుంది. ఈ కారం పొడి అన్నంలోగానీ లేదా ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్లలో గానీ అద్దిరిపోతుంది. ఒక్కసారి తయారు చేస్తే సుమారు 20 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిజ్​లో పెట్టుకుంటే మాత్రం 2 నెలల వరకు టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం..? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానమేంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..

  • ఒక కప్పు పుట్నాలు
  • పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు
  • ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర
  • 15 పచ్చిమిరపకాయలు
  • 2 టేబుల్ స్పూన్ల నూనె
  • ఒక కప్పు కరివేపాకు
  • పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు
  • రుచికి సరిపడా ఉప్పు

తయారీ విధానం

  • ముందుగా పచ్చిమిరపకాయల తొడిమలు తీసి శుభ్రంగా కడిగి.. తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి.
  • ఆ తర్వాత కరివేపాకును శుభ్రంగా కడిగి నీరు ఆరిపోయేంతవరకు గాలికి ఆరబెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెను పెట్టుకుని అందులో పుట్నాలు వేసి లో ఫ్లేమ్​లో 2 నిమిషాలు వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. (రంగు మారకుండా ఓవర్​గా రోస్ట్ కాకుండా చూసుకోవాలి)
  • అనంతరం ఎండు కొబ్బరి ముక్కలు లో-ఫ్లేమ్​లో వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • గిన్నె వేడిగా ఉన్న సమయంలోనే స్టౌ ఆఫ్ చేసుకుని జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. (స్టౌ ఆన్ చేసి వేయించుకుంటే టేస్ట్ మారిపోతుంది)
  • ఇప్పుడు మిక్సీలో ఎండు కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పుట్నాలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి, పుట్నాలు- జీలకర్ర పొడి, ఉప్పును వేసి బాగా కలపాలి.
  • ముందుగా ఆరబెట్టుకున్న పచ్చి మిర్చిని మీడియం సైజులో ముక్కలు చేసుకోవాలి.
  • మరోవైపు స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేసి లో ఫ్లేమ్​లో క్రిప్సీగా రంగు మారేంతవరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకుని క్రిప్సీగా అయ్యేవరకు లో ఫ్లేమ్​లోనే వేయించుకుని స్టౌ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీలో వెల్లుల్లిని వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇందులోనే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి- కరివేపాకు మిశ్రమాన్ని వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిలో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే పచ్చి మిర్చీ కారం పొడి రెడీ.

బ్రేక్​ఫాస్ట్​లోకి అద్దిరిపోయే రెసిపీ - తమిళనాడు స్పెషల్ "గుంట పొంగనాలు" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

బ్యాచిలర్​ మటన్ పులావ్ కుక్కర్​లో!- వంటరాని వారు కూడా చేసుకోవచ్చు

Pachi Mirchi Karam Podi Recipe in Telugu: మనకు ఎండు మిర్చి కారం పొడి తెలుసు. నల్ల కారం పొడి తెలుసు. హోటల్​లో దొరికే కారం పొడి కూడా తెలుసు. కానీ.. పచ్చి మిర్చి కారం పొడి గురించి మీకు తెలుసా? ఇది సరికొత్తగా ఉండడమే కాదు.. టేస్ట్​ కూడా అంతకు మించి అనేలా ఉంటుంది. ఈ కారం పొడి అన్నంలోగానీ లేదా ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్లలో గానీ అద్దిరిపోతుంది. ఒక్కసారి తయారు చేస్తే సుమారు 20 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిజ్​లో పెట్టుకుంటే మాత్రం 2 నెలల వరకు టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం..? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానమేంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..

  • ఒక కప్పు పుట్నాలు
  • పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు
  • ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర
  • 15 పచ్చిమిరపకాయలు
  • 2 టేబుల్ స్పూన్ల నూనె
  • ఒక కప్పు కరివేపాకు
  • పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు
  • రుచికి సరిపడా ఉప్పు

తయారీ విధానం

  • ముందుగా పచ్చిమిరపకాయల తొడిమలు తీసి శుభ్రంగా కడిగి.. తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి.
  • ఆ తర్వాత కరివేపాకును శుభ్రంగా కడిగి నీరు ఆరిపోయేంతవరకు గాలికి ఆరబెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెను పెట్టుకుని అందులో పుట్నాలు వేసి లో ఫ్లేమ్​లో 2 నిమిషాలు వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. (రంగు మారకుండా ఓవర్​గా రోస్ట్ కాకుండా చూసుకోవాలి)
  • అనంతరం ఎండు కొబ్బరి ముక్కలు లో-ఫ్లేమ్​లో వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • గిన్నె వేడిగా ఉన్న సమయంలోనే స్టౌ ఆఫ్ చేసుకుని జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. (స్టౌ ఆన్ చేసి వేయించుకుంటే టేస్ట్ మారిపోతుంది)
  • ఇప్పుడు మిక్సీలో ఎండు కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పుట్నాలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి, పుట్నాలు- జీలకర్ర పొడి, ఉప్పును వేసి బాగా కలపాలి.
  • ముందుగా ఆరబెట్టుకున్న పచ్చి మిర్చిని మీడియం సైజులో ముక్కలు చేసుకోవాలి.
  • మరోవైపు స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేసి లో ఫ్లేమ్​లో క్రిప్సీగా రంగు మారేంతవరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకుని క్రిప్సీగా అయ్యేవరకు లో ఫ్లేమ్​లోనే వేయించుకుని స్టౌ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీలో వెల్లుల్లిని వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇందులోనే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి- కరివేపాకు మిశ్రమాన్ని వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిలో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే పచ్చి మిర్చీ కారం పొడి రెడీ.

బ్రేక్​ఫాస్ట్​లోకి అద్దిరిపోయే రెసిపీ - తమిళనాడు స్పెషల్ "గుంట పొంగనాలు" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

బ్యాచిలర్​ మటన్ పులావ్ కుక్కర్​లో!- వంటరాని వారు కూడా చేసుకోవచ్చు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.