Modi Indian Community Event : ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ దేశానికి బలమైన బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికాలోని భారతీయుల నైపుణ్యాలు, నిబద్ధత సాటిలేనివని కితాబిచ్చారు. వారు ఇరుదేశాలను అనుసంధానించినట్లు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూయార్క్ వేదికగా నిర్వహించిన 'మోదీ& యూఎస్- ప్రోగ్రెస్ టుగెదర్' అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
గతంలో తాను ఎటువంటి పదవుల్లో లేని సమయంలోనే అమెరికాలోని దాదాపు 29 రాష్ట్రాల్లో పర్యటించినట్లు ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. ప్రధానిగా అమెరికా పర్యటనల్లో భాగంగా ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించిన కార్యక్రమాలను ప్రస్తావించారు. ఇక్కడి భారతీయులు ప్రతిసారీ పాత రికార్డులను చెరిపేశారని అభినందించారు.
#WATCH | Modi&US Event | PM Narendra Modi says, " you have connected india to america and america to india. your skill, talent, and commitment have no competition. you might have come seven seas apart, but no sea has that much depth that it can distance you from india. what ma… pic.twitter.com/u6roTZGagk
— ANI (@ANI) September 22, 2024
ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ(IACU) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రోగ్రాంకు ఎన్ఆర్ఐలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు దేవీశ్రీ ప్రసాద్ తదితరులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రధాని మోదీ ఈనెల 23న న్యూయార్క్లోని ఐరాస జనరల్ అసెంబ్లీలో 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'నుద్దేశించి ప్రసంగించనున్నారు.
VIDEO | PM Modi (@narendramodi) welcomed by music artists Hanumankind, Aditya Gadhvi and Devi Sri Prasad (@ThisIsDSP) onstage at the Community Event at Nassau Coliseum in New York earlier today. #PMModiUSVisit
— Press Trust of India (@PTI_News) September 22, 2024
(Source: Third Party) pic.twitter.com/thZKkxDEw2
అమెరికా అధ్యక్షుడు బైడెన్తో ప్రధాని మోదీ భేటీ - ఫలవంతమైన చర్చలు! - PM Modi Meets US Prez