ETV Bharat / international

'ప్రవాస భారతీయులందరూ అంబాసిడర్లే- వారి నిబద్ధత సాటిలేనిది'- న్యూయార్క్​ ప్రోగ్రాంలో మోదీ ప్రసంగం - Modi US Visit

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Modi Indian Community Event : న్యూయార్క్‌ వేదికగా నిర్వహించిన 'మోదీ& యూఎస్‌' కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రవాస భారతీయులను ఇరు దేశాల అనుసంధానకర్తలుగా అభివర్ణించారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వ విజయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్​ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Modi Indian Community Event
Modi Indian Community Event (ANI)

Modi Indian Community Event : ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ దేశానికి బలమైన బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికాలోని భారతీయుల నైపుణ్యాలు, నిబద్ధత సాటిలేనివని కితాబిచ్చారు. వారు ఇరుదేశాలను అనుసంధానించినట్లు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూయార్క్‌ వేదికగా నిర్వహించిన 'మోదీ& యూఎస్‌- ప్రోగ్రెస్‌ టుగెదర్‌' అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

గతంలో తాను ఎటువంటి పదవుల్లో లేని సమయంలోనే అమెరికాలోని దాదాపు 29 రాష్ట్రాల్లో పర్యటించినట్లు ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. ప్రధానిగా అమెరికా పర్యటనల్లో భాగంగా ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించిన కార్యక్రమాలను ప్రస్తావించారు. ఇక్కడి భారతీయులు ప్రతిసారీ పాత రికార్డులను చెరిపేశారని అభినందించారు.

ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్‌ఏ(IACU) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రోగ్రాంకు ఎన్​ఆర్​ఐలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు దేవీశ్రీ ప్రసాద్‌ తదితరులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రధాని మోదీ ఈనెల 23న న్యూయార్క్‌లోని ఐరాస జనరల్ అసెంబ్లీలో 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'నుద్దేశించి ప్రసంగించనున్నారు.

ఇండో-పసిఫిక్‌ దేశాలకు 40 మిలియన్ల క్యాన్సర్​ వ్యాక్సిన్‌ డోస్‌లు - భారత్ వాగ్దానం - India Pledges 40 million Vaccines

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ - ఫలవంతమైన చర్చలు! - PM Modi Meets US Prez

Modi Indian Community Event : ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ దేశానికి బలమైన బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికాలోని భారతీయుల నైపుణ్యాలు, నిబద్ధత సాటిలేనివని కితాబిచ్చారు. వారు ఇరుదేశాలను అనుసంధానించినట్లు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూయార్క్‌ వేదికగా నిర్వహించిన 'మోదీ& యూఎస్‌- ప్రోగ్రెస్‌ టుగెదర్‌' అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

గతంలో తాను ఎటువంటి పదవుల్లో లేని సమయంలోనే అమెరికాలోని దాదాపు 29 రాష్ట్రాల్లో పర్యటించినట్లు ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. ప్రధానిగా అమెరికా పర్యటనల్లో భాగంగా ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించిన కార్యక్రమాలను ప్రస్తావించారు. ఇక్కడి భారతీయులు ప్రతిసారీ పాత రికార్డులను చెరిపేశారని అభినందించారు.

ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్‌ఏ(IACU) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రోగ్రాంకు ఎన్​ఆర్​ఐలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు దేవీశ్రీ ప్రసాద్‌ తదితరులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రధాని మోదీ ఈనెల 23న న్యూయార్క్‌లోని ఐరాస జనరల్ అసెంబ్లీలో 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'నుద్దేశించి ప్రసంగించనున్నారు.

ఇండో-పసిఫిక్‌ దేశాలకు 40 మిలియన్ల క్యాన్సర్​ వ్యాక్సిన్‌ డోస్‌లు - భారత్ వాగ్దానం - India Pledges 40 million Vaccines

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ - ఫలవంతమైన చర్చలు! - PM Modi Meets US Prez

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.