ETV Bharat / international

బంగ్లాదేశ్‌లో అల్లర్ల వెనుక అమెరికా హస్తం- ఆ ఐలాండ్ కోసమే ఇలా చేసింది- షేక్‌ హసీనా సంచలన ఆరోపణ - Sheikh Hasina charge against US

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 4:16 PM IST

Sheikh Hasina Reaction On Bangladesh Riots : బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన తిరుగుబాటు, అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని మాజీ ప్రధాని, అవామీ లీగ్‌ అధినేత్రి షేక్‌ హసీనా ఆరోపించారు. సెయింట్ మార్టిన్‌ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అమెరికాకు అప్పగించి బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే పదవిలో కొనసాగేదాన్ని అంటూ ఆమె ప్రకటన చేశారు.

Sheikh Hasina Reaction
Sheikh Hasina Reaction (Associated Press)

Sheikh Hasina Charge Against America : బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్‌ వచ్చిన హసీనా, ఇటీవల జరిగిన పరిణామాలపై ఓ ఆంగ్ల పత్రికకు సందేశం పంపారు. బంగ్లాదేశ్‌లో తాజా పరిస్థితులకు అమెరికానే కారణమని ఆమె ఆరోపించారు. తాను మృతదేహాల ఊరేగింపును చూడాలనుకోలేదన్న ఆమె, వారు విద్యార్థుల శవాలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకొన్నారని విమర్శించారు. అందుకు తాను అంగీకరించలేదన్న హసీనా, అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేశానని ఆంగ్ల పత్రికకు చెప్పారు.

ఒక వేళ తాను సెయింట్ మార్టిన్‌ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే తన పదవి పోయేదికాదని పేర్కొన్నారు. దయ చేసి అతివాదుల మాయలోపడొద్దని బంగ్లాదేశ్‌ దేశ ప్రజలను కోరుతున్నట్లు ఆంగ్ల పత్రికకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. చాలా మంది నాయకులు, కార్యకర్తలు హత్యకు గురైన విషయం తెలిసి ఆవేదన చెందినట్లు హసీనా తెలిపారు. పలువురు పార్టీ సభ్యుల ఇళ్లను ధ్వంసం చేశారన్న ఆమె భగవంతుని దయవల్ల త్వరలోనే తిరిగి వెళతానని, అవామీ లీగ్‌ మరోసారి నిలబడుతుందని పేర్కొన్నారు.

ఈ ఏడాది మే నెలలో హసీనా కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటుచేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేలా చేస్తామని ఆఫర్ ఇచ్చారన్నది ఆ ప్రకటన సారాంశం. ఈ ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికానే ఆ దేశం అయిఉంటుందనే ప్రచారం జరిగింది. ఒక దేశానికి బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తే తనకు ఏ సమస్యా ఉండేది కాదన్న హసీనా, ఇది చూడటానికి ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొన్నట్లు కనిపిస్తుందని తెలిపారు. కానీ వారి లక్ష్యం ఎంతదూరం వెళుతుందో తనకు తెలుసునని ఆ ప్రకటనలో హసీనా వివరించారు.

అయితే తాను జాతిపిత బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ కుమార్తెనని, వారికి చాలా స్పష్టంగా చెప్పానని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్యంత్ర పోరాటాన్ని గెలిచామని స్పష్టంగా చెప్పానని గుర్తుచేశారు. తన దేశాన్ని ఎవరికో అద్దెకు ఇచ్చి, లేదా అప్పగించి అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని వారికి స్పష్టంగా చెప్పినట్లు వివరించారు. ఈస్ట్‌ తైమూర్‌ మాదిరిగానే వారు ఇక్కడ కూడా బంగ్లాదేశ్‌లోని చోటోగ్రామ్‌, మయన్మార్‌లోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త దేశం ఏర్పాటుచేస్తారని అంచనా వేశారు. బంగాళాఖాతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటుచేసుకొంటారని నాడు హసీనా పేర్కొన్నారు.

అప్పటి నుంచి హసీనా ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదనే ప్రచారం మొదలైంది. ఆగస్టు 5 నుంచి బంగ్లాదేశ్‌లో తీవ్ర స్థాయిలో అల్లర్లు జరుగుతున్నాయి. గత వారం తీవ్రం కావడం వల్ల ప్రధాని షేక్‌ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు. యూకేలో ఆశ్రయం కోసం చేసుకొన్న దరఖాస్తును ఆ దేశం తిరస్కరించింది.

'ఇప్పటికీ హసీనానే బంగ్లాదేశ్​ ప్రధాని!- అవామీ లీగ్​ కథ ఇంకా ముగిసిపోలేదు' - Sheikh Hasina resignation analysis

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై 205 దాడులు - చర్యలకు ఆదేశించిన యూనుస్ - Bangladesh Crisis

Sheikh Hasina Charge Against America : బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్‌ వచ్చిన హసీనా, ఇటీవల జరిగిన పరిణామాలపై ఓ ఆంగ్ల పత్రికకు సందేశం పంపారు. బంగ్లాదేశ్‌లో తాజా పరిస్థితులకు అమెరికానే కారణమని ఆమె ఆరోపించారు. తాను మృతదేహాల ఊరేగింపును చూడాలనుకోలేదన్న ఆమె, వారు విద్యార్థుల శవాలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకొన్నారని విమర్శించారు. అందుకు తాను అంగీకరించలేదన్న హసీనా, అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేశానని ఆంగ్ల పత్రికకు చెప్పారు.

ఒక వేళ తాను సెయింట్ మార్టిన్‌ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే తన పదవి పోయేదికాదని పేర్కొన్నారు. దయ చేసి అతివాదుల మాయలోపడొద్దని బంగ్లాదేశ్‌ దేశ ప్రజలను కోరుతున్నట్లు ఆంగ్ల పత్రికకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. చాలా మంది నాయకులు, కార్యకర్తలు హత్యకు గురైన విషయం తెలిసి ఆవేదన చెందినట్లు హసీనా తెలిపారు. పలువురు పార్టీ సభ్యుల ఇళ్లను ధ్వంసం చేశారన్న ఆమె భగవంతుని దయవల్ల త్వరలోనే తిరిగి వెళతానని, అవామీ లీగ్‌ మరోసారి నిలబడుతుందని పేర్కొన్నారు.

ఈ ఏడాది మే నెలలో హసీనా కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటుచేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేలా చేస్తామని ఆఫర్ ఇచ్చారన్నది ఆ ప్రకటన సారాంశం. ఈ ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికానే ఆ దేశం అయిఉంటుందనే ప్రచారం జరిగింది. ఒక దేశానికి బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తే తనకు ఏ సమస్యా ఉండేది కాదన్న హసీనా, ఇది చూడటానికి ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొన్నట్లు కనిపిస్తుందని తెలిపారు. కానీ వారి లక్ష్యం ఎంతదూరం వెళుతుందో తనకు తెలుసునని ఆ ప్రకటనలో హసీనా వివరించారు.

అయితే తాను జాతిపిత బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ కుమార్తెనని, వారికి చాలా స్పష్టంగా చెప్పానని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్యంత్ర పోరాటాన్ని గెలిచామని స్పష్టంగా చెప్పానని గుర్తుచేశారు. తన దేశాన్ని ఎవరికో అద్దెకు ఇచ్చి, లేదా అప్పగించి అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని వారికి స్పష్టంగా చెప్పినట్లు వివరించారు. ఈస్ట్‌ తైమూర్‌ మాదిరిగానే వారు ఇక్కడ కూడా బంగ్లాదేశ్‌లోని చోటోగ్రామ్‌, మయన్మార్‌లోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త దేశం ఏర్పాటుచేస్తారని అంచనా వేశారు. బంగాళాఖాతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటుచేసుకొంటారని నాడు హసీనా పేర్కొన్నారు.

అప్పటి నుంచి హసీనా ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదనే ప్రచారం మొదలైంది. ఆగస్టు 5 నుంచి బంగ్లాదేశ్‌లో తీవ్ర స్థాయిలో అల్లర్లు జరుగుతున్నాయి. గత వారం తీవ్రం కావడం వల్ల ప్రధాని షేక్‌ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు. యూకేలో ఆశ్రయం కోసం చేసుకొన్న దరఖాస్తును ఆ దేశం తిరస్కరించింది.

'ఇప్పటికీ హసీనానే బంగ్లాదేశ్​ ప్రధాని!- అవామీ లీగ్​ కథ ఇంకా ముగిసిపోలేదు' - Sheikh Hasina resignation analysis

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై 205 దాడులు - చర్యలకు ఆదేశించిన యూనుస్ - Bangladesh Crisis

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.