ETV Bharat / entertainment

రిస్క్ చేస్తున్న మీడియం రేంజ్​ హీరోలు - ఎవరంటే? - Tollywood Tier 2 and 3 Heroes

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 4, 2024, 4:28 PM IST

Tollywood Tier 2 and 3 Heroes High Budget Movies : ఒకప్పుడు స్టార్ హీరోలు, బడా హీరోలు మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించేవారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి మారుతోంది. చిన్న, మీడియం బడ్జెట్​ హీరోలు కూడా తమ బడ్జెట్​, మార్కెట్​కు మించిన సినిమాలు చేసేందుకు రెడీ అయిపోతున్నారు. వారెవరో చూద్దాం.

source Getty Images
Tollywood (source Getty Images)

Tollywood Tier 2 and 3 Heroes High Budget Movies : ఒకప్పుడు స్టార్ హీరోలు, బడా హీరోలు మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించేవారు. కానీ ఇప్పుడు అది మారుతోంది. చిన్న, మీడియం బడ్జెట్​ హీరోలు కూడా తమ బడ్జెట్​, మార్కెట్​కు మించిన సినిమాలు చేసేందుకు రెడీ అయిపోతున్నారు. నిర్మాతలు కూడా వారితో పెద్ద సినిమాలు చేసే సాహసం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే రూ.20 కోట్ల మార్కెట్ లేని హీరోలు కూడా రూ.50 కోట్ల బడ్జెట్​తో సినిమాలు చేస్తున్నారు.

ఈ మధ్య మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అయితే ఏకంగా రూ.120 కోట్ల బడ్జెట్​తో సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. రోహిత్ డైరెక్షన్​లో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసమే ఇంత మొత్తంలో ఖర్చు పెట్టనున్నారని రూమర్స్ వినిపించాయి. పైగా ఆ మధ్య తొలిసారి విరూపాక్ష చిత్రంతో రూ.103 కోట్లు కలెక్ట్ చేశారు సాయి ధరమ్ తేజ్. ఆ ధైర్యంతోనే ఇప్పుడు రూ.120 కోట్ల బడ్జెట్​ను పెట్టేందుకు సిద్ధమయ్యారట మేకర్స్.

హిట్​ ఫ్లాప్​లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే హీరో కిరణ్ అబ్బవరం. ఆయన ఇప్పుడు ఏకంగా రూ. 20 కోట్ల బడ్జెట్​తో సినిమా చేయనున్నారని తెలుస్తోంది. శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్​పై గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు కలిసి తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ కథతో ఈ సినిమా రాబోతుందట. వాస్తవానికి కిరణ్ అబ్బవరం లాంటి హీరోపై రూ.20 కోట్ల బడ్జెట్ అంటే పెద్ద రిస్క్ అనే చెప్పాలి. కానీ తాము ఎంచుకున్న కథపై నమ్మకంతో కిరణ్ పై అంత బడ్జెట్​ పెట్టడానికి సిద్దమయ్యారట.

మరో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మట్కా. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్​తోనే తెరకెక్కుతోంది. ఈ సినిమా విషయంలో కొంతకాలంగా వరుస ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్ కోసం దాదాపు రూ.50 కోట్ల ఖర్చు పెట్టనున్నారట. ఇప్పటికే రూ.15 కోట్లతో సెట్స్​ వేసి భారీ షెడ్యూల్​ను చిత్రీకరిస్తున్నారట డైరెక్టర్ కరుణ కుమార్ అండ్ టీమ్. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారని తెలిసింది.

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఏదేమైనా వరుణ్ తేజ్​పై ఇంత బడ్జెట్ అంటే ఎక్కువే అని ఫీలవుతున్నారు. ఈ ముగ్గురు హీరోలతో పాటు మరింత మంది యువ హీరోలు కూడా తమ మార్కెట్​కు మించి బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నారట. చూడాలి మరి ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో.

ఆ దేశంలో రిలీజ్​కు సిద్ధమైన మన హీరోల సినిమాలు - ఇంతకీ అవేంటంటే? - Indian Movie Releases In Japan

ప్రభాస్ - ఒక్క పూట ఫుడ్ కోసం అన్ని లక్షలు ఖర్చు పెడతారా?

Tollywood Tier 2 and 3 Heroes High Budget Movies : ఒకప్పుడు స్టార్ హీరోలు, బడా హీరోలు మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించేవారు. కానీ ఇప్పుడు అది మారుతోంది. చిన్న, మీడియం బడ్జెట్​ హీరోలు కూడా తమ బడ్జెట్​, మార్కెట్​కు మించిన సినిమాలు చేసేందుకు రెడీ అయిపోతున్నారు. నిర్మాతలు కూడా వారితో పెద్ద సినిమాలు చేసే సాహసం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే రూ.20 కోట్ల మార్కెట్ లేని హీరోలు కూడా రూ.50 కోట్ల బడ్జెట్​తో సినిమాలు చేస్తున్నారు.

ఈ మధ్య మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అయితే ఏకంగా రూ.120 కోట్ల బడ్జెట్​తో సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. రోహిత్ డైరెక్షన్​లో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసమే ఇంత మొత్తంలో ఖర్చు పెట్టనున్నారని రూమర్స్ వినిపించాయి. పైగా ఆ మధ్య తొలిసారి విరూపాక్ష చిత్రంతో రూ.103 కోట్లు కలెక్ట్ చేశారు సాయి ధరమ్ తేజ్. ఆ ధైర్యంతోనే ఇప్పుడు రూ.120 కోట్ల బడ్జెట్​ను పెట్టేందుకు సిద్ధమయ్యారట మేకర్స్.

హిట్​ ఫ్లాప్​లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే హీరో కిరణ్ అబ్బవరం. ఆయన ఇప్పుడు ఏకంగా రూ. 20 కోట్ల బడ్జెట్​తో సినిమా చేయనున్నారని తెలుస్తోంది. శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్​పై గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు కలిసి తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ కథతో ఈ సినిమా రాబోతుందట. వాస్తవానికి కిరణ్ అబ్బవరం లాంటి హీరోపై రూ.20 కోట్ల బడ్జెట్ అంటే పెద్ద రిస్క్ అనే చెప్పాలి. కానీ తాము ఎంచుకున్న కథపై నమ్మకంతో కిరణ్ పై అంత బడ్జెట్​ పెట్టడానికి సిద్దమయ్యారట.

మరో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మట్కా. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్​తోనే తెరకెక్కుతోంది. ఈ సినిమా విషయంలో కొంతకాలంగా వరుస ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్ కోసం దాదాపు రూ.50 కోట్ల ఖర్చు పెట్టనున్నారట. ఇప్పటికే రూ.15 కోట్లతో సెట్స్​ వేసి భారీ షెడ్యూల్​ను చిత్రీకరిస్తున్నారట డైరెక్టర్ కరుణ కుమార్ అండ్ టీమ్. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారని తెలిసింది.

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఏదేమైనా వరుణ్ తేజ్​పై ఇంత బడ్జెట్ అంటే ఎక్కువే అని ఫీలవుతున్నారు. ఈ ముగ్గురు హీరోలతో పాటు మరింత మంది యువ హీరోలు కూడా తమ మార్కెట్​కు మించి బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నారట. చూడాలి మరి ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో.

ఆ దేశంలో రిలీజ్​కు సిద్ధమైన మన హీరోల సినిమాలు - ఇంతకీ అవేంటంటే? - Indian Movie Releases In Japan

ప్రభాస్ - ఒక్క పూట ఫుడ్ కోసం అన్ని లక్షలు ఖర్చు పెడతారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.