ETV Bharat / entertainment

'జాన్వీని నేనేం అనలేదు - మా మధ్య అంత ఫ్రెండ్​షిప్​ లేదు' - Janhvi Kapoor Ulajh Movie

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 10:21 AM IST

Janhvi Kapoor Ulajh Movie : బాలీవుడ్ నటి జాన్వీ కపూర్​పై తాను తాజాగా చేసిన కామెంట్స్ గురించి నటుడు గుల్షన్‌ దేవయ్య తాజాగా క్లారిటీ ఇచ్చారు. జాన్వీని తప్పుగా ఏమనలేదని అన్నారు.

Janhvi Kapoor Ulajh Movie
Janhvi Kapoor (Getty Images)

Janhvi Kapoor Ulajh Movie : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌, బీటౌన్​ హీరో గుల్షన్‌ దేవయ్య లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ఉలఝ్‌'. దేశభక్తి కథాంశంతో పాటు ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసెస్‌ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్‌ చిత్రాన్ని సుధాన్షు సరియా తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్​ ఈవెంట్స్​ను ముమ్మరం చేశారు మేకర్స్​.

ఇక ప్రమోషన్స్​లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ గురించి సంచలన కామెంట్స్ చేశారు గుల్షన్‌. తనకు ఆమెతో ఫ్రెండ్లీ రిలేషన్‌ లేదని అన్నారు. షూటింగ్​లోనూ అలాగే సీన్స్​ తెరకెక్కించే సమయంలోనే తనతో మాట్లాడేవారంటూ కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో కాంట్రవర్సీలకు దారితీసింది. అయితే గుల్షన్‌ తాజాగా ఈ ఇష్యూపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

"జాన్వీ గురించి నేనేం తప్పుగా మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య స్నేహం లేదన్నాను అంతే. అది మా ఇద్దరి తప్పు కాదు. ఆమె ఓ మంచి యాక్ట్రెస్​. ఎంతో ప్రొఫెషనల్‌గా నటిస్తారు. మా ఇద్దరిపై తీసిన ప్రతి సీన్ బాగానే వచ్చింది. చేసే ప్రతి సినిమా సెట్‌లోనూ మూవీటీమ్ మొత్తం ఫ్యామిలీలా కలిసిపోవాలనేది రూల్ కాదు కదా. నేను ఎవ్వరినీ కించపరచట్లేదు. ఉద్దేశపూర్వకంగానూ ఎవరి గురించి తప్పుగా అస్సలు మాట్లాడలేదు. ఈ సినిమా కోసం మేం వందశాతం పనిచేశాం. డైరెక్టర్ చెప్పినట్లుగానే నటించాం. గతంలోనూచాలా మంది హీరోయిన్స్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాను. వారందరితో నాకు మంచి స్నేహం ఏర్పడింది. సోనాక్షి సిన్హా, రాధికా ఆప్టే లాంటి స్టార్స్​లో కలిసి నటించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మేము అప్పుడప్పుడు ఎన్నో విషయాల గురించి కూడా మాట్లాడుకునేవాళ్లం. కానీ, జాన్వీతో మాత్రం సినిమా గురించే చర్చించాను. ఇదే విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలోనూ వెల్లడించాను" అని గుల్షన్‌ క్లారిటీ ఇచ్చారు. ఇక గుల్షన్‌ చేసిన కామెంట్స్​పై జాన్వీ కూడా స్పందించారు. వాస్తవంగా వారిద్దరూ సెట్‌లో ఎప్పుడూ ఇతర విషయాలు మాట్లాడుకోలేదని అన్నారు.

Janhvi Kapoor Ulajh Movie : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌, బీటౌన్​ హీరో గుల్షన్‌ దేవయ్య లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ఉలఝ్‌'. దేశభక్తి కథాంశంతో పాటు ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసెస్‌ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్‌ చిత్రాన్ని సుధాన్షు సరియా తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్​ ఈవెంట్స్​ను ముమ్మరం చేశారు మేకర్స్​.

ఇక ప్రమోషన్స్​లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ గురించి సంచలన కామెంట్స్ చేశారు గుల్షన్‌. తనకు ఆమెతో ఫ్రెండ్లీ రిలేషన్‌ లేదని అన్నారు. షూటింగ్​లోనూ అలాగే సీన్స్​ తెరకెక్కించే సమయంలోనే తనతో మాట్లాడేవారంటూ కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో కాంట్రవర్సీలకు దారితీసింది. అయితే గుల్షన్‌ తాజాగా ఈ ఇష్యూపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

"జాన్వీ గురించి నేనేం తప్పుగా మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య స్నేహం లేదన్నాను అంతే. అది మా ఇద్దరి తప్పు కాదు. ఆమె ఓ మంచి యాక్ట్రెస్​. ఎంతో ప్రొఫెషనల్‌గా నటిస్తారు. మా ఇద్దరిపై తీసిన ప్రతి సీన్ బాగానే వచ్చింది. చేసే ప్రతి సినిమా సెట్‌లోనూ మూవీటీమ్ మొత్తం ఫ్యామిలీలా కలిసిపోవాలనేది రూల్ కాదు కదా. నేను ఎవ్వరినీ కించపరచట్లేదు. ఉద్దేశపూర్వకంగానూ ఎవరి గురించి తప్పుగా అస్సలు మాట్లాడలేదు. ఈ సినిమా కోసం మేం వందశాతం పనిచేశాం. డైరెక్టర్ చెప్పినట్లుగానే నటించాం. గతంలోనూచాలా మంది హీరోయిన్స్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాను. వారందరితో నాకు మంచి స్నేహం ఏర్పడింది. సోనాక్షి సిన్హా, రాధికా ఆప్టే లాంటి స్టార్స్​లో కలిసి నటించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మేము అప్పుడప్పుడు ఎన్నో విషయాల గురించి కూడా మాట్లాడుకునేవాళ్లం. కానీ, జాన్వీతో మాత్రం సినిమా గురించే చర్చించాను. ఇదే విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలోనూ వెల్లడించాను" అని గుల్షన్‌ క్లారిటీ ఇచ్చారు. ఇక గుల్షన్‌ చేసిన కామెంట్స్​పై జాన్వీ కూడా స్పందించారు. వాస్తవంగా వారిద్దరూ సెట్‌లో ఎప్పుడూ ఇతర విషయాలు మాట్లాడుకోలేదని అన్నారు.

'ఉలఝ్' - దేశద్రోహం కేసు నుంచి జాన్వీ ఎలా బయటపడింది!?

ఆస్పత్రి నుంచి జాన్వీ డిశ్చార్జ్- ఇప్పుడెలా ఉందంటే? - Janhvi Kapoor Discharged

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.