ETV Bharat / entertainment

'విశ్వంభర' లేటెస్ట్ అప్డేట్​ - ఫుల్​ హ్యాపీ మోడ్​లో మెగా ఫ్యాన్స్‌! - Chiranjeevi Viswambara

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 7:09 PM IST

Viswambara Movie Shooting : బింబిసార దర్శకుడు వశిష్ట మల్లిడి - మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ విశ్వంభర గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. అవేంటంటే?

source ETV Bharat
Viswambara Movie Shooting (source ETV Bharat)

Viswambara Movie Shooting : బింబిసార దర్శకుడు వశిష్ట మల్లిడి - మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర. త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి.

అప్పటికీ పూర్తయ్యేలా - విశ్వంభర టాకీ పార్ట్ షూటింగ్ పూర్తైనట్లు తెలిసింది. కేవలం రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. హీరో ఇంట్రడక్షన్ సాంగ్​తో పాటు ఒక స్పెషల్ సాంగ్, క్లైమాక్స్ ఫైట్ మాత్రమే మిగిలి ఉందని తెలిసింది. తమిళ స్టంట్ మాస్టర్ అన్ల్ అరసు ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను కొరయోగ్రాఫీ చేయనున్నారట. ఆగస్తు నెలాఖరులోగా షూటింగ్ మొత్తం పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్నారని సమాచారం అందింది

సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉండనున్నాయని తెలిసింది. ఇప్పటికే కీరవాణి అన్నింటినీ కంపోజ్ చేసేశారట. 3 పాటల చిత్రీకరణ కూడా పూర్తైపోయింది. రీసెంట్​గా మూవీటీమ్​ 5 రోజుల పాటు బెంగళూరు వెళ్లింది. అప్పుడే హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ను కీరవాణి కంపోజ్ చేశారు.

వీఎఫ్ఎక్స్ వర్క్, ఎడిటింగ్ ఒకేసారి శరవేగంగా జరుగుతున్నాయట. దీని వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా పూర్తి కానున్నాయి. ఫలితంగా 2025 సంక్రాంతి రిలీజ్ కోసం ప్రమోషన్‌లు చేయడానికి మేకర్స్‌కు కావాల్సినంత సమయం దొరకనుంది. అలానే సినిమాను ప్రమోట్ చేయడానికి నిర్మాతలు, దర్శకుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారట.

ఈ మూవీ కోసం దర్శకుడు వశిష్ట బింబిసార కన్నా పెద్ద కథను రాసుకున్నారట. అందుకే మొత్తం 18 సెట్స్‌తో మైథాలజీలో లోకాలన్నింటినీ చూపిస్తూ ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు సినీ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వశిష్ట విజన్, టైమ్ సెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. విశ్వంభరతో మెగాస్టార్ చిరంజీవి కచ్చితంగా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో త్రిష హీరోయిన్​గా నటిస్తుండగా ఆషికా రంగనాథ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. వీరిద్దరితో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా సినిమాలో నటించనున్నారని ప్రచారం సాగుతోంది.

త్రిప్తి దిమ్రీ బ్యాడ్ న్యూజ్​ - యానిమల్ బ్యూటీ రొమాన్స్​ మాయ చేసినట్టేనా? - Tripti Dimri Bad Newz Review

రాజ్‌ తరుణ్‌ 'పురుషోత్తముడు' అంటున్న ప్రకాశ్ రాజ్​! - Rajtarun purushothamudu

Viswambara Movie Shooting : బింబిసార దర్శకుడు వశిష్ట మల్లిడి - మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర. త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి.

అప్పటికీ పూర్తయ్యేలా - విశ్వంభర టాకీ పార్ట్ షూటింగ్ పూర్తైనట్లు తెలిసింది. కేవలం రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. హీరో ఇంట్రడక్షన్ సాంగ్​తో పాటు ఒక స్పెషల్ సాంగ్, క్లైమాక్స్ ఫైట్ మాత్రమే మిగిలి ఉందని తెలిసింది. తమిళ స్టంట్ మాస్టర్ అన్ల్ అరసు ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను కొరయోగ్రాఫీ చేయనున్నారట. ఆగస్తు నెలాఖరులోగా షూటింగ్ మొత్తం పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్నారని సమాచారం అందింది

సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉండనున్నాయని తెలిసింది. ఇప్పటికే కీరవాణి అన్నింటినీ కంపోజ్ చేసేశారట. 3 పాటల చిత్రీకరణ కూడా పూర్తైపోయింది. రీసెంట్​గా మూవీటీమ్​ 5 రోజుల పాటు బెంగళూరు వెళ్లింది. అప్పుడే హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ను కీరవాణి కంపోజ్ చేశారు.

వీఎఫ్ఎక్స్ వర్క్, ఎడిటింగ్ ఒకేసారి శరవేగంగా జరుగుతున్నాయట. దీని వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా పూర్తి కానున్నాయి. ఫలితంగా 2025 సంక్రాంతి రిలీజ్ కోసం ప్రమోషన్‌లు చేయడానికి మేకర్స్‌కు కావాల్సినంత సమయం దొరకనుంది. అలానే సినిమాను ప్రమోట్ చేయడానికి నిర్మాతలు, దర్శకుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారట.

ఈ మూవీ కోసం దర్శకుడు వశిష్ట బింబిసార కన్నా పెద్ద కథను రాసుకున్నారట. అందుకే మొత్తం 18 సెట్స్‌తో మైథాలజీలో లోకాలన్నింటినీ చూపిస్తూ ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు సినీ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వశిష్ట విజన్, టైమ్ సెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. విశ్వంభరతో మెగాస్టార్ చిరంజీవి కచ్చితంగా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో త్రిష హీరోయిన్​గా నటిస్తుండగా ఆషికా రంగనాథ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. వీరిద్దరితో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా సినిమాలో నటించనున్నారని ప్రచారం సాగుతోంది.

త్రిప్తి దిమ్రీ బ్యాడ్ న్యూజ్​ - యానిమల్ బ్యూటీ రొమాన్స్​ మాయ చేసినట్టేనా? - Tripti Dimri Bad Newz Review

రాజ్‌ తరుణ్‌ 'పురుషోత్తముడు' అంటున్న ప్రకాశ్ రాజ్​! - Rajtarun purushothamudu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.