ETV Bharat / entertainment

బన్నీ మంచి మనసు- వయనాడ్ బాధితులకు రూ.25 లక్షల విరాళం - Allu Arjun Donation

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 4, 2024, 12:54 PM IST

Updated : Aug 4, 2024, 2:03 PM IST

Allu Arjun Donates Wayanad Tragedy: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటన బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.

Allu Arjun Donation
Allu Arjun Donation (Source: ETV Bharat)

Allu Arjun Donates Wayanad Tragedy:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మంచితనాన్ని చాటుకున్నారు. కేరళ వయనాడ్​లో కొండచరియలు విరిగిపడిన ఘటన బాధితులకు రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. బాధితులకు పునరావాసం కల్పించడం కోసం తనవంతుగా రూ. 25లక్షలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్​కు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన అఫీషియల్ సోషల్ మీడియా నుంచి పోస్ట్ షేర్ చేశారు.

'ఇటీవల వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన పట్ల నేను చాలా బాధపడ్డాను. కేరళ ఎల్లప్పుడూ నాపై ప్రేమ చూపించింది. నా వంతు కృషిగా రూ.25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్​కు అందించాలనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి' అని ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో అల్ల అర్జున్​పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 'మీరు నిజమైన హీరో' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కాగా, ఇప్పటికే వయనాడ్ బాధితులకు తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు విరాళం ప్రకటించారు. టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ రూ.5 లక్షలు ఇవ్వగా, తమిళ స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్- నయనతార దంపతులు రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చారు. అంతకుముందు విక్రమ్​ రూ.20 లక్షలు, హీరో సూర్య ఫ్యామిలీ జ్యోతిక, హీరో కార్తి కలిసి రూ.50 లక్షలను అందించారు.

మోహన్​లాల్ భారీ సాయం
హీరో మోహన్‌లాల్‌ వయనాడ్‌ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు శనివారం స్వయంగా ముందుకొచ్చారు. ఆయన టెరిటోరియల్‌ ఆర్మీ బేస్‌ క్యాంపులో లెఫ్టినెంట్‌ కల్నల్‌ యూనిఫామ్​లో విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం అయ్యారు. బాధితులకు పునరావాసం కల్పించడం కోసం రూ.3 కోట్ల రూపాయలను విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలో కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు.

వీరితోపాటు నటి రష్మికా మంధన్నా, సీనియర్ నటుడు కమల్ హాసన్, పీలీ మణి, డైరెక్టర్ బసిల్ జోసేఫ్ తదితరులు తమవంతుగా ఆర్థిక సాయం అందించారు. కాగా ఈ ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలో కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు.

'పుష్ప 2' ఆలస్యం - అల్లు శిరీష్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్​

సుకుమార్​ - అల్లు అర్జున్ మధ్య విభేదాలు? - ఇది అసలు మ్యాటర్​! - Pushpa 2 Shooting

Allu Arjun Donates Wayanad Tragedy:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మంచితనాన్ని చాటుకున్నారు. కేరళ వయనాడ్​లో కొండచరియలు విరిగిపడిన ఘటన బాధితులకు రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. బాధితులకు పునరావాసం కల్పించడం కోసం తనవంతుగా రూ. 25లక్షలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్​కు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన అఫీషియల్ సోషల్ మీడియా నుంచి పోస్ట్ షేర్ చేశారు.

'ఇటీవల వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన పట్ల నేను చాలా బాధపడ్డాను. కేరళ ఎల్లప్పుడూ నాపై ప్రేమ చూపించింది. నా వంతు కృషిగా రూ.25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్​కు అందించాలనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి' అని ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో అల్ల అర్జున్​పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 'మీరు నిజమైన హీరో' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కాగా, ఇప్పటికే వయనాడ్ బాధితులకు తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు విరాళం ప్రకటించారు. టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ రూ.5 లక్షలు ఇవ్వగా, తమిళ స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్- నయనతార దంపతులు రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చారు. అంతకుముందు విక్రమ్​ రూ.20 లక్షలు, హీరో సూర్య ఫ్యామిలీ జ్యోతిక, హీరో కార్తి కలిసి రూ.50 లక్షలను అందించారు.

మోహన్​లాల్ భారీ సాయం
హీరో మోహన్‌లాల్‌ వయనాడ్‌ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు శనివారం స్వయంగా ముందుకొచ్చారు. ఆయన టెరిటోరియల్‌ ఆర్మీ బేస్‌ క్యాంపులో లెఫ్టినెంట్‌ కల్నల్‌ యూనిఫామ్​లో విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం అయ్యారు. బాధితులకు పునరావాసం కల్పించడం కోసం రూ.3 కోట్ల రూపాయలను విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలో కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు.

వీరితోపాటు నటి రష్మికా మంధన్నా, సీనియర్ నటుడు కమల్ హాసన్, పీలీ మణి, డైరెక్టర్ బసిల్ జోసేఫ్ తదితరులు తమవంతుగా ఆర్థిక సాయం అందించారు. కాగా ఈ ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలో కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు.

'పుష్ప 2' ఆలస్యం - అల్లు శిరీష్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్​

సుకుమార్​ - అల్లు అర్జున్ మధ్య విభేదాలు? - ఇది అసలు మ్యాటర్​! - Pushpa 2 Shooting

Last Updated : Aug 4, 2024, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.