ETV Bharat / entertainment

ఈ హారర్ మూవీ వెరీ డేంజర్​ - ఆ దెయ్యం శాపం వల్ల నిజంగానే ఆరుగురు నటులు దుర్మరణం! - Horror Movie on OTT

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 7:27 PM IST

OTT Horror Movie Poltergeist : సాధారణంగా హారర్ సినిమాల్లో దెయ్యాలు మనుషుల్ని వెంటాడి చంపడం చూస్తుంటాం. లేదంటి అలాంటి హారర్ సినిమాలు చూస్తునప్పుడు భయపడి చనిపోయిన ప్రేక్షకులను చూసుంటాం. కానీ ఓ హారర్ మూవీని తీసిన ఆరుగురు నటీనటులు నిజంగానే దెయ్యం శాపంతో చనిపోయారని చాలా మంది నమ్ముతున్నారు! దాని గురించే ఈ కథనం.

source ANI
OTT Horror Movie Poltergeist (source ANI)

OTT Horror Movie Poltergeist : సాధారణంగా హారర్ సినిమాల్లో దెయ్యాలు మనుషుల్ని వెంటాడి చంపడం చూస్తుంటాం. లేదంటి అలాంటి హారర్ సినిమాలు చూస్తునప్పుడు భయపడి చనిపోయిన ప్రేక్షకులను చూసుంటాం. కానీ ఓ హారర్ మూవీని తీసిన ఆరుగురు నటీనటులు ప్రొడక్షన్ సమయంలోనో లేదా సినిమా రిలీజ్​ అయిన కొద్ది రోజుల్లోనే చనిపోవడం ఎప్పుడైనా విన్నారా? వాళ్లు నిజంగానే దెయ్యం శాపంతో చనిపోయారని చాలా మంది నమ్ముతున్నారు! అవును మీరు చదువుతున్నది నిజం.

అసలేజం జరిగిందంటే? 1982లో హాలీవుడ్​లో పోల్టర్‌గిస్ట్ అనే మూవీ వచ్చింది. ఆ మూవీ మేకర్స్​, యాక్టర్స్​కే ఈ అనూహ్య ఘటనలు ఎదురయ్యాయి! ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్, మైఖేల్ గ్రేస్​, మార్క్ విక్టర్​తో కలిసి పోల్టర్​గిస్ట్​ సినిమాకు స్క్రీన్‌ ప్లే అందించారు. దీనికి టోబ్​ హూపర్ దర్శకత్వ వహించారు. ఓ ఇంట్లో నివసిస్తున్న కుటుంబంపై దెయ్యాలు దాడి చేసి వాళ్ల కూతురిని ఎత్తుకుపోవడమే ఈ చిత్ర కథ. అయితే నిజజీవితంలో ఆ దెయ్యం శాపం వల్లే ఈ సినిమాలో నటించిన ఆరుగురు నటీనటులు మరణించారన్న వార్తలు బయటకు వచ్చాయి.

క్లైమాక్స్​ వల్లే ఇలా? - ఈ పోల్టర్‌గిస్ట్ సినిమా క్లైమాక్స్​లో తల్లి డయానా పాత్ర పోషించిన జోబెత్ విలియమ్స్ అస్థిపంజరాలు ఉన్న ఓ కొలనులోకి చెరువులోకి దూకుతుంది. అయితే అందులోని అస్థిపంజరాలు డూప్లికేట్ కావు. రియాలిటీ కోసం నిజ మనుషుల అస్థిపంజరాలనే ఉపయోగించారు. మరో విషయం ఏంటంటే ఆ కొలనులోకి దూకినప్పుడు జోబెత్​కు అవి నిజమైన అస్థిపంజరాలని తెలీదట. చాలా కాలం తర్వాత తనకీ విషయం తెలిసిందని జోబెత్​ చెప్పింది. అయితే నిజమైన అస్థిపంజరాలను ఉపయోగించడం, చనిపోయినవారిని అవమానించడమేనని, అందుకే అస్థిపంజరాల(దెయ్యాల) శాపం తగిలినట్లు పుకార్లు వచ్చాయి.

ఆరుగురి మరణం - పోల్టర్‌గైస్ట్ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో లేదా ఆ చిత్రం రిలీజ్ అయితే కొద్ది కాలానికే ఈ ఆరుగురిలో నలుగురు మరణించారు. మూవీలో పెద్ద కూతురిగా నటించిన డొమినిక్ డూన్​ 1982 నవంబర్ లో తన బాయ్​ఫ్రెండ్​ చేతిలో హత్యకు గురైంది. అప్పుడు ఆమె వయసు 23. చిన్న కూతురుగా నటించిన హీథర్ ఓరూర్కీ 12 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో కన్నుమూసింది.

సినిమాలోని మారో కాస్ట్ మెంబర్ లూ పెర్రీమాన్ 2009లో దారుణ హత్యకు గురయ్యాడు. ఇక ఈ సినిమాలో మాంత్రికుడిగా చేసిన జూలియన్ బెక్ 1987లో క్యాన్సర్ తో చనిపోయాడు. అనంతరం మూడు చావులు ఈ సినిమా ఫ్రాంచైజీతోనే ముడిపడ్డాయని వార్తలు వచ్చాయి. వీరిలో ప్రీస్ట్​ పాత్ర పోషించిన జులియన్ బెక్​ 1987లో క్యాన్సర్​తో మరణించాడు.

ఇక పోల్టర్‌గిస్ట్ రెండో భాగంలో నటించిన షామాన్​(ఆత్మలతో మాట్లాడేవాడు) విల్ సాంప్సన్ కూడా కిడ్నీ ఫెయిల్​తో చనిపోయాడు. ఇతడు మూవీ సెట్స్​లో దెయ్యం ఉందంటూ, అతడు ఆ దెయ్యాన్ని తరిమేయడానికి ప్రత్యేకంగా పూజలు కూడా చేయించాడు. అయినా కూడా మరణించాడు.

ఏ ఓటీటీలో అంటే? - ఏదేమైనా ఈ పోల్టర్​గిస్ట్​ సినిమా ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్(Amazon Prime Horror Movie)​, డిస్నీ హాట్​స్టార్​లో అందుబాటులో ఉంది.

OTTలో దూసుకెళ్తోన్న భయపెట్టే దెయ్యం సినిమా - ట్విస్టులే ట్విస్టులు! - Latest Horror Movie OTT

సండే స్పెషల్ - OTTలోకి వచ్చేసిన బిగ్గెస్ట్ హారర్ మూవీస్ - ధైర్యంగా చూడగలరా?

OTT Horror Movie Poltergeist : సాధారణంగా హారర్ సినిమాల్లో దెయ్యాలు మనుషుల్ని వెంటాడి చంపడం చూస్తుంటాం. లేదంటి అలాంటి హారర్ సినిమాలు చూస్తునప్పుడు భయపడి చనిపోయిన ప్రేక్షకులను చూసుంటాం. కానీ ఓ హారర్ మూవీని తీసిన ఆరుగురు నటీనటులు ప్రొడక్షన్ సమయంలోనో లేదా సినిమా రిలీజ్​ అయిన కొద్ది రోజుల్లోనే చనిపోవడం ఎప్పుడైనా విన్నారా? వాళ్లు నిజంగానే దెయ్యం శాపంతో చనిపోయారని చాలా మంది నమ్ముతున్నారు! అవును మీరు చదువుతున్నది నిజం.

అసలేజం జరిగిందంటే? 1982లో హాలీవుడ్​లో పోల్టర్‌గిస్ట్ అనే మూవీ వచ్చింది. ఆ మూవీ మేకర్స్​, యాక్టర్స్​కే ఈ అనూహ్య ఘటనలు ఎదురయ్యాయి! ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్, మైఖేల్ గ్రేస్​, మార్క్ విక్టర్​తో కలిసి పోల్టర్​గిస్ట్​ సినిమాకు స్క్రీన్‌ ప్లే అందించారు. దీనికి టోబ్​ హూపర్ దర్శకత్వ వహించారు. ఓ ఇంట్లో నివసిస్తున్న కుటుంబంపై దెయ్యాలు దాడి చేసి వాళ్ల కూతురిని ఎత్తుకుపోవడమే ఈ చిత్ర కథ. అయితే నిజజీవితంలో ఆ దెయ్యం శాపం వల్లే ఈ సినిమాలో నటించిన ఆరుగురు నటీనటులు మరణించారన్న వార్తలు బయటకు వచ్చాయి.

క్లైమాక్స్​ వల్లే ఇలా? - ఈ పోల్టర్‌గిస్ట్ సినిమా క్లైమాక్స్​లో తల్లి డయానా పాత్ర పోషించిన జోబెత్ విలియమ్స్ అస్థిపంజరాలు ఉన్న ఓ కొలనులోకి చెరువులోకి దూకుతుంది. అయితే అందులోని అస్థిపంజరాలు డూప్లికేట్ కావు. రియాలిటీ కోసం నిజ మనుషుల అస్థిపంజరాలనే ఉపయోగించారు. మరో విషయం ఏంటంటే ఆ కొలనులోకి దూకినప్పుడు జోబెత్​కు అవి నిజమైన అస్థిపంజరాలని తెలీదట. చాలా కాలం తర్వాత తనకీ విషయం తెలిసిందని జోబెత్​ చెప్పింది. అయితే నిజమైన అస్థిపంజరాలను ఉపయోగించడం, చనిపోయినవారిని అవమానించడమేనని, అందుకే అస్థిపంజరాల(దెయ్యాల) శాపం తగిలినట్లు పుకార్లు వచ్చాయి.

ఆరుగురి మరణం - పోల్టర్‌గైస్ట్ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో లేదా ఆ చిత్రం రిలీజ్ అయితే కొద్ది కాలానికే ఈ ఆరుగురిలో నలుగురు మరణించారు. మూవీలో పెద్ద కూతురిగా నటించిన డొమినిక్ డూన్​ 1982 నవంబర్ లో తన బాయ్​ఫ్రెండ్​ చేతిలో హత్యకు గురైంది. అప్పుడు ఆమె వయసు 23. చిన్న కూతురుగా నటించిన హీథర్ ఓరూర్కీ 12 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో కన్నుమూసింది.

సినిమాలోని మారో కాస్ట్ మెంబర్ లూ పెర్రీమాన్ 2009లో దారుణ హత్యకు గురయ్యాడు. ఇక ఈ సినిమాలో మాంత్రికుడిగా చేసిన జూలియన్ బెక్ 1987లో క్యాన్సర్ తో చనిపోయాడు. అనంతరం మూడు చావులు ఈ సినిమా ఫ్రాంచైజీతోనే ముడిపడ్డాయని వార్తలు వచ్చాయి. వీరిలో ప్రీస్ట్​ పాత్ర పోషించిన జులియన్ బెక్​ 1987లో క్యాన్సర్​తో మరణించాడు.

ఇక పోల్టర్‌గిస్ట్ రెండో భాగంలో నటించిన షామాన్​(ఆత్మలతో మాట్లాడేవాడు) విల్ సాంప్సన్ కూడా కిడ్నీ ఫెయిల్​తో చనిపోయాడు. ఇతడు మూవీ సెట్స్​లో దెయ్యం ఉందంటూ, అతడు ఆ దెయ్యాన్ని తరిమేయడానికి ప్రత్యేకంగా పూజలు కూడా చేయించాడు. అయినా కూడా మరణించాడు.

ఏ ఓటీటీలో అంటే? - ఏదేమైనా ఈ పోల్టర్​గిస్ట్​ సినిమా ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్(Amazon Prime Horror Movie)​, డిస్నీ హాట్​స్టార్​లో అందుబాటులో ఉంది.

OTTలో దూసుకెళ్తోన్న భయపెట్టే దెయ్యం సినిమా - ట్విస్టులే ట్విస్టులు! - Latest Horror Movie OTT

సండే స్పెషల్ - OTTలోకి వచ్చేసిన బిగ్గెస్ట్ హారర్ మూవీస్ - ధైర్యంగా చూడగలరా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.