ETV Bharat / business

ఆన్​లైన్​ ఫ్రాడ్​ వల్ల డబ్బులు పోయాయా? డోంట్​ వర్రీ- వెంటనే ఈ పనులు చేస్తే మీ మనీ సేఫ్​! - How To Complaint About Online Fraud

author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 3:17 PM IST

How To Complaint About Online Fraud : సైబర్​ మోసగాళ్లు మీ బ్యాంకులోని డబ్బులు కొట్టేశారా? యూపీఐ, క్రెడిట్​/డెబిట్ కార్డ్, ఏటీఎం స్కామ్స్​​ చేసి, మీ డబ్బులు దోచుకున్నారా? మరేం ఫర్వాలేదు. మీరు వీలైనంత తొందరగా తగిన చర్యలు తీసుకుంటే, మీ డబ్బులు సురక్షితంగా మీ వద్దకే వస్తాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Complaint About cyber crime
How To Complaint About Online fraud (ETV Bharat)

How To Complaint About Online Fraud : మీకు తెలియకుండా అనధికారిక యూపీఐ ట్రాన్సాక్షన్స్​ జరిగినప్పుడు; క్రెడిట్/ డెబిట్ కార్డ్​, ఏటీఎం స్కామ్స్​కు గురైనప్పుడు వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీ డబ్బులు మీ చేతికి తిరిగి వస్తాయి. అది ఎలాగంటే?

సైబర్ నేరగాళ్లు టెక్నాలజీతో పాటు, మనుష్యుల సైకాలజీని కూడా వాడుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మనుషులను నమ్మించి, లేదా అర్జెంట్​గా చేయాల్సి ఉంటుందని భయపెట్టి మోసాలు చేస్తున్నారు. బ్యాంకు అధికారులమని నమ్మించి, యూజర్ల డేటాను, తరువాత వారి అకౌంట్​లోని డబ్బులను తస్కరిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

UPI Scams

  • ఉదాహరణకు యూపీఐ స్కామ్స్​ ఎలా చేస్తారంటే? సైబర్ మోసగాళ్లు ముందుగా ఒక అన్-నోన్​ నంబర్ నుంచి కష్టాల్లో ఉన్నామని, కనుక డబ్బులు పంపించమని ప్రాధేయపడుతూ మెసేజ్ చేస్తారు. లేదా సర్వీస్ ప్రొవైడర్లమని చెబుతూ, మీ వ్యక్తిగత వివరాలు, పిన్​ నంబర్లు అడుగుతారు. మీరు అర్జెంట్​గా యూపీఐ వివరాలు అప్​డేట్ చేసుకోవాలని నమ్మిస్తారు. కనీసం మీరు ఆలోచించుకునే టైమ్ కూడా ఇవ్వరు.
  • క్రెడిట్/ డెబిట్ కార్డ్ స్కామ్స్ ఎలా చేస్తారంటే? తాము బ్యాంకు అధికారులమని మిమ్మల్ని నమ్మిస్తారు. మీ బ్యాంక్ అకౌంట్​కు సంబంధించిన ఓ సమస్య వచ్చిందని, వెంటనే దానిని పరిష్కరించాల్సిన అవసరం ఉంటుందని చెబుతారు. మీ మీద చాలా ప్రెజర్​ పెడతారు. మీ క్రెడిట్​/ డెబిట్ కార్డ్ వివరాలు, పిన్ నంబర్​ అడుగుతారు.
  • ఏటీఎం స్కామ్స్ కూడా ఇలానే చేస్తుంటారు. ఫోన్​ చేసి మీ వివరాలు తెలుసుకుంటారు. అంతేకాదు ఈ ఫ్రాడ్​స్టర్స్​ ఏటీఎంల్లో స్కామర్లు లేదా క్యాష్ ట్రాపింగ్ డివైజ్​లు ఇన్​స్టాల్ చేస్తారు. వీటి ద్వారా యూజర్లు కార్డు వివరాలు తెలుసుకుంటారు. సీక్రెట్ కెమెరాలు వాడి పిన్ నంబర్లు తెలుసుకుంటారు.

వీలైనంత త్వరగా రిపోర్ట్ చేయాలి!

  • ఇలాంటి ఆన్​లైన్​ మోసాలను అరికట్టాలంటే, ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. బ్యాంక్ అధికారులు మీకు వచ్చే ఓటీపీలను, మీ క్రెడిట్, డెబిట్​ కార్డ్​ పిన్​ నంబర్లను, పాస్​వర్డ్​లను అడగరని గుర్తుంచుకోండి. సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని కనీసం ఆలోచించుకోనివ్వరు. త్వరగా వివరాలు అన్నీ చెప్పేయమని తొందర పెడుతుంటారు. కానీ మీరు మాత్రం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. భయపడవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి.
  • ఒకవేళ ఆన్​లైన్​ ఫ్రాడ్​స్టర్స్​ మిమ్మల్ని మోసం చేస్తే, వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీ బ్యాంక్​కు లేదా ఫైనాన్సియల్​ సర్వీస్ ప్రొవైడర్​కు ఫోన్​ చేసి, మీ అకౌంట్​ను, క్రెడిట్/ డెబిట్​ కార్డులను బ్లాక్ చేయమని చెప్పాలి. అప్పుడే మీ డబ్బులు సేఫ్​గా ఉంటాయి. అలాకాకుండా మీరు బాగా ఆలస్యం చేస్తే, మీ డబ్బులు పూర్తిగా పోయే ప్రమాదం ఉంటుంది.
  • బ్యాంకు వాళ్లకు చెప్పి, మీ అకౌంట్లను బ్లాక్ చేసిన తరువాత, నేషనల్​ సైబర్ ​క్రైమ్​ రిపోర్టింగ్ పోర్టల్​లోకి వెళ్లి కంప్లైంట్​ ఫైల్​ చేయాలి. లేదా హెల్​లైన్​ నంబర్- 1930కు ఫోన్​ చేసి, ఫిర్యాదు చేయాలి. దీని వల్ల వెంటనే ఇన్వెస్ట్​గేషన్​ ప్రారంభించడానికి, న్యాయపరమైన ప్రొసీడింగ్స్ ఫాలో కావడానికి వీలవుతుంది.

ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే!

  • కంప్లైంట్ చేసి 30 రోజులు గడిచినా, ఎలాంటి పరిష్కారం లభించకపోతే, మీరు నేరుగా బ్యాంకింగ్ అంబుడ్స్​మెన్​కు ఫిర్యాదు చేయవచ్చు.
  • ఇన్ని చేసినా, మీ సమస్య పరిష్కారం కాకపోతే; యూపీఐ లావాదేవీల విషయంలో సర్వీస్​ ప్రొవైడర్లు స్పందించకపోతే, మీరు ఆలస్యం చేయకుండా నేషనల్ పేమెంట్స్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ)కు ఫిర్యాదు చేయవచ్చు.
  • ఎన్​పీసీఐ ఇలాంటి సమస్యల పరిష్కారానికి యూనిఫైడ్ డిస్ప్యూట్​ అండ్ ఇష్యూ రిజల్యూషన్​ (యూడీఐఆర్​) ఫ్రేమ్​వర్క్​ను ప్రవేశపెట్టింది. ఇది ఒక ఆటోమేటెడ్​, సింగిల్​-ఛానల్ సిస్టమ్​. ఇది డిజిటల్ పేమెంట్స్​ సమస్యలను, ఆన్​లైన్​ మోసాలను పరిష్కరిస్తుంది.

మీరు ఆర్థిక మోసానికి గురైనప్పుడు, కచ్చితంగా అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. కనుక మీ బ్యాంక్​ అకౌంట్​, యూపీఐ పేమెంట్స్​, క్రెడిట్​, డెబిట్ కార్డు వివరాలను లేదా పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యంగా, ఇలాంటి ఆర్థిక మోసాలకు గురికాకుండా ఉండాలంటే, తరచూ మీ బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తూ ఉండాలి. ఏవైనా అనుమానాస్పద చెల్లింపులు జరిగినట్లు గుర్తిస్తే, వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. అలాగే చెల్లింపులు చేయడానికి టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్​ను ఎనేబుల్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు అలర్ట్ వచ్చేలా సెట్​ చేసుకోవాలి. ఆన్​లైన్ మోసాల గురించి అవగాహన పెంచుకోవాలి. అప్పుడే మీరు సేఫ్​గా ఉంటారు.

EPF​ ఖాతాదారులకు గుడ్ న్యూస్​​ - ఇకపై డెత్​ క్లెయిమ్ చాలా ఈజీ - ఎలా అంటే? - EPF Death Claim Process

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? కాస్త అప్రమత్తంగా ఉండండి - ఎందుకంటే? - Stock Market Investment Tips

How To Complaint About Online Fraud : మీకు తెలియకుండా అనధికారిక యూపీఐ ట్రాన్సాక్షన్స్​ జరిగినప్పుడు; క్రెడిట్/ డెబిట్ కార్డ్​, ఏటీఎం స్కామ్స్​కు గురైనప్పుడు వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీ డబ్బులు మీ చేతికి తిరిగి వస్తాయి. అది ఎలాగంటే?

సైబర్ నేరగాళ్లు టెక్నాలజీతో పాటు, మనుష్యుల సైకాలజీని కూడా వాడుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మనుషులను నమ్మించి, లేదా అర్జెంట్​గా చేయాల్సి ఉంటుందని భయపెట్టి మోసాలు చేస్తున్నారు. బ్యాంకు అధికారులమని నమ్మించి, యూజర్ల డేటాను, తరువాత వారి అకౌంట్​లోని డబ్బులను తస్కరిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

UPI Scams

  • ఉదాహరణకు యూపీఐ స్కామ్స్​ ఎలా చేస్తారంటే? సైబర్ మోసగాళ్లు ముందుగా ఒక అన్-నోన్​ నంబర్ నుంచి కష్టాల్లో ఉన్నామని, కనుక డబ్బులు పంపించమని ప్రాధేయపడుతూ మెసేజ్ చేస్తారు. లేదా సర్వీస్ ప్రొవైడర్లమని చెబుతూ, మీ వ్యక్తిగత వివరాలు, పిన్​ నంబర్లు అడుగుతారు. మీరు అర్జెంట్​గా యూపీఐ వివరాలు అప్​డేట్ చేసుకోవాలని నమ్మిస్తారు. కనీసం మీరు ఆలోచించుకునే టైమ్ కూడా ఇవ్వరు.
  • క్రెడిట్/ డెబిట్ కార్డ్ స్కామ్స్ ఎలా చేస్తారంటే? తాము బ్యాంకు అధికారులమని మిమ్మల్ని నమ్మిస్తారు. మీ బ్యాంక్ అకౌంట్​కు సంబంధించిన ఓ సమస్య వచ్చిందని, వెంటనే దానిని పరిష్కరించాల్సిన అవసరం ఉంటుందని చెబుతారు. మీ మీద చాలా ప్రెజర్​ పెడతారు. మీ క్రెడిట్​/ డెబిట్ కార్డ్ వివరాలు, పిన్ నంబర్​ అడుగుతారు.
  • ఏటీఎం స్కామ్స్ కూడా ఇలానే చేస్తుంటారు. ఫోన్​ చేసి మీ వివరాలు తెలుసుకుంటారు. అంతేకాదు ఈ ఫ్రాడ్​స్టర్స్​ ఏటీఎంల్లో స్కామర్లు లేదా క్యాష్ ట్రాపింగ్ డివైజ్​లు ఇన్​స్టాల్ చేస్తారు. వీటి ద్వారా యూజర్లు కార్డు వివరాలు తెలుసుకుంటారు. సీక్రెట్ కెమెరాలు వాడి పిన్ నంబర్లు తెలుసుకుంటారు.

వీలైనంత త్వరగా రిపోర్ట్ చేయాలి!

  • ఇలాంటి ఆన్​లైన్​ మోసాలను అరికట్టాలంటే, ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. బ్యాంక్ అధికారులు మీకు వచ్చే ఓటీపీలను, మీ క్రెడిట్, డెబిట్​ కార్డ్​ పిన్​ నంబర్లను, పాస్​వర్డ్​లను అడగరని గుర్తుంచుకోండి. సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని కనీసం ఆలోచించుకోనివ్వరు. త్వరగా వివరాలు అన్నీ చెప్పేయమని తొందర పెడుతుంటారు. కానీ మీరు మాత్రం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. భయపడవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి.
  • ఒకవేళ ఆన్​లైన్​ ఫ్రాడ్​స్టర్స్​ మిమ్మల్ని మోసం చేస్తే, వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీ బ్యాంక్​కు లేదా ఫైనాన్సియల్​ సర్వీస్ ప్రొవైడర్​కు ఫోన్​ చేసి, మీ అకౌంట్​ను, క్రెడిట్/ డెబిట్​ కార్డులను బ్లాక్ చేయమని చెప్పాలి. అప్పుడే మీ డబ్బులు సేఫ్​గా ఉంటాయి. అలాకాకుండా మీరు బాగా ఆలస్యం చేస్తే, మీ డబ్బులు పూర్తిగా పోయే ప్రమాదం ఉంటుంది.
  • బ్యాంకు వాళ్లకు చెప్పి, మీ అకౌంట్లను బ్లాక్ చేసిన తరువాత, నేషనల్​ సైబర్ ​క్రైమ్​ రిపోర్టింగ్ పోర్టల్​లోకి వెళ్లి కంప్లైంట్​ ఫైల్​ చేయాలి. లేదా హెల్​లైన్​ నంబర్- 1930కు ఫోన్​ చేసి, ఫిర్యాదు చేయాలి. దీని వల్ల వెంటనే ఇన్వెస్ట్​గేషన్​ ప్రారంభించడానికి, న్యాయపరమైన ప్రొసీడింగ్స్ ఫాలో కావడానికి వీలవుతుంది.

ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే!

  • కంప్లైంట్ చేసి 30 రోజులు గడిచినా, ఎలాంటి పరిష్కారం లభించకపోతే, మీరు నేరుగా బ్యాంకింగ్ అంబుడ్స్​మెన్​కు ఫిర్యాదు చేయవచ్చు.
  • ఇన్ని చేసినా, మీ సమస్య పరిష్కారం కాకపోతే; యూపీఐ లావాదేవీల విషయంలో సర్వీస్​ ప్రొవైడర్లు స్పందించకపోతే, మీరు ఆలస్యం చేయకుండా నేషనల్ పేమెంట్స్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ)కు ఫిర్యాదు చేయవచ్చు.
  • ఎన్​పీసీఐ ఇలాంటి సమస్యల పరిష్కారానికి యూనిఫైడ్ డిస్ప్యూట్​ అండ్ ఇష్యూ రిజల్యూషన్​ (యూడీఐఆర్​) ఫ్రేమ్​వర్క్​ను ప్రవేశపెట్టింది. ఇది ఒక ఆటోమేటెడ్​, సింగిల్​-ఛానల్ సిస్టమ్​. ఇది డిజిటల్ పేమెంట్స్​ సమస్యలను, ఆన్​లైన్​ మోసాలను పరిష్కరిస్తుంది.

మీరు ఆర్థిక మోసానికి గురైనప్పుడు, కచ్చితంగా అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. కనుక మీ బ్యాంక్​ అకౌంట్​, యూపీఐ పేమెంట్స్​, క్రెడిట్​, డెబిట్ కార్డు వివరాలను లేదా పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యంగా, ఇలాంటి ఆర్థిక మోసాలకు గురికాకుండా ఉండాలంటే, తరచూ మీ బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తూ ఉండాలి. ఏవైనా అనుమానాస్పద చెల్లింపులు జరిగినట్లు గుర్తిస్తే, వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. అలాగే చెల్లింపులు చేయడానికి టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్​ను ఎనేబుల్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు అలర్ట్ వచ్చేలా సెట్​ చేసుకోవాలి. ఆన్​లైన్ మోసాల గురించి అవగాహన పెంచుకోవాలి. అప్పుడే మీరు సేఫ్​గా ఉంటారు.

EPF​ ఖాతాదారులకు గుడ్ న్యూస్​​ - ఇకపై డెత్​ క్లెయిమ్ చాలా ఈజీ - ఎలా అంటే? - EPF Death Claim Process

స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? కాస్త అప్రమత్తంగా ఉండండి - ఎందుకంటే? - Stock Market Investment Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.