Gold Rate Today October 17th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,600 ఉండగా, గురువారం నాటికి రూ.250 పెరిగి రూ.78,850కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.93,570 ఉండగా, గురువారం నాటికి రూ.430 పెరిగి రూ.94,000కు చేరింది.
- Gold Price In Hyderabad October 17th 2024 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.78,850గా ఉంది. కిలో వెండి ధర రూ.94,000గా ఉంది.
- Gold Price In Vijayawada October 17th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,850గా ఉంది. కిలో వెండి ధర రూ.94,000గా ఉంది.
- Gold Price In Visakhapatnam October 17th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,850గా ఉంది. కిలో వెండి ధర రూ.94,000గా ఉంది.
- Gold Price In Proddatur October 17th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,850గా ఉంది. కిలో వెండి ధర రూ.94,000గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price October 17th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2667డాలర్లు ఉండగా, గురువారం నాటికి 12 డాలర్లు పెరిగి 2679 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 31.60 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News October 17th 2024 : గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్కాయిన్ | రూ.43,55,564 |
ఇథీరియం | రూ.1,63,638 |
టెథర్ | రూ.76.61 |
బైనాన్స్ కాయిన్ | రూ.39,516 |
సొలోనా | రూ.8,500 |
రూపాయి విలువ
Rupee Open October 17th 2024 : ప్రస్తుతం అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices October 17th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today October 17th 2024 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు ఒడుదుడుకులకు లోనవుతున్నాయి. దీంతో మార్కెట్ ప్రారంభమైన కాసేపటికి నష్టాల్లోకి జారుకున్న సూచీలు ప్రస్తుతం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 55 పాయింట్లు పెరిగి 81,544 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు కుంగి 24,941 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ, సన్ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, రిలయన్స్, పవర్గ్రిడ్, టాటాస్టీల్, హెచ్సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎంఅండ్ఎం, మారుతీసుజుకీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, టైటాన్, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.