ETV Bharat / bharat

కోల్​కతా ఘటన ఎఫెక్ట్- నైట్ షిఫ్టులకు లేడీ డాక్టర్స్ నో! - IMA Study On Doctors

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2024, 7:36 PM IST

IMA Study On Doctors : కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన వైద్యులను తీవ్రభయాందోళనకు గురిచేసినట్లు ఓ సర్వే వెల్లడించింది. ఈ ఘటన నేపథ్యంలో రాత్రివేళల్లో విధులు నిర్వర్తించేందుకు కొందరు వైద్యులు భయపడుతున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌- IMA సర్వేలో వెల్లడైంది. మూడింట ఒకవంతు మహిళా వైద్యులు రాత్రివేళల్లో పనిచేయడం అసురక్షితంగా భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది. ప్రధానంగా మహిళా డాక్టర్లు నైట్ షిఫ్ట్‌లు చేసేందుకు వెనకడుగు వేస్తున్నట్లు సర్వేలో తేలింది.

IMA Study Doctors
IMA Study Doctors (Source: Getty Images)

IMA Study On Doctors : కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో రాత్రివేళల్లో విధులు నిర్వర్తించేందుకు కొందరు వైద్యులు భయపడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. మూడింట ఒకవంతు మహిళా వైద్యులు రాత్రివేళల్లో పనిచేయడం సురక్షితం కాదని భావిస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌- IMA సర్వేలో వెల్లడైంది. దాదాపు 3885 మంది డాక్టర్లు పాల్గొన్న ఈ సర్వేల్లో దాదాపు 35 శాతం మంది వైద్యులు రాత్రివేళల్లో విధులు నిర్వర్తించేందుకు భయపడుతున్నట్లు సర్వేలో తేలింది. బాధితురాలు విధుల్లో ఉన్న సమయంలో అత్యంత పాశవికంగా దాడి జరగడం వైద్యుల్లో తీవ్ర అలజడి రేపింది.

దీంతో నైట్ షిఫ్ట్‌లు చేయడానికి వైద్యులు భయపడుతున్నట్లు సర్వే వెల్లడించింది. ప్రధానంగా మహిళా డాక్టర్లు ఇందుకు వెనకడుగు వేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఆత్మరక్షణ కోసం విధులకు వచ్చేటప్పుడు ఆయుధాలను వెంట తెచ్చుకోవాలని భావిస్తున్నారని IMA వెల్లడించింది. నైట్‌ డ్యూటీలో సురక్షితంగా భావించడం లేదని సర్వేలో పాల్గొన్న 24.1 శాతం మంది వైద్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది. మరో 11.4 శాతంమంది వైద్యులు అత్యంత ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. భయపడుతున్న వారిలో అత్యధికులు మహిళా వైద్యులు,వైద్య విద్యార్థినులే ఉన్నట్లు వివరించింది.

నైట్‌షిఫ్టుల్లో డ్యూటీ రూమ్‌లు లేవని 45శాతం మంది పేర్కొన్నారు. డ్యూటీ రూమ్‌లు ఉన్నవారు మాత్రం అత్యంత సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. డ్యూటీ రూమ్‌లు ఉన్నచోట అవి సరిపోవడం లేదని, గోప్యత లేకపోవడం, తాళాలు లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంచుకోవాల్సి వస్తుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చెప్పింది. అందుబాటులో ఉన్న మూడింట ఒకవంతు డ్యూటీ రూమ్‌లలో అటాచ్డ్​ బాత్‌రూమ్‌లు లేవని సర్వేలో తేలింది. వాటికోసం చాలాదూరం వెళ్లాల్సి వస్తోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొంది.

53 శాతం డ్యూటీ రూమ్‌లు వార్డులు, అత్యవసర చికిత్సా విభాగాలకు చాలా దూరంలో ఉన్నాయని IMA అధ్యయనంలో వెల్లడైంది. మొత్తంగా సర్వేలో పాల్గొన్న అనేకమంది రాత్రి షిఫ్టుల్లో సురక్షితంగా లేమని భావిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో వారు పలు భద్రతా చర్యలను సూచించినట్లు తెలిపింది. శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది, సీసీ కెమెరాలు, అవసరమైన చోట విద్యుత్‌ దీపాలు, సెంట్రల్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌- CPA అమలు, రోగి బంధువుల సంఖ్యను నియంత్రించడం, సైరన్‌ వ్యవస్థల ఏర్పాటు, కనీస సౌకర్యాలతో డ్యూటీ రూమ్‌లు ఏర్పాటు వంటివి సూచించినట్లు తాజా అధ్యయనం పేర్కొంది.

జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన వేళ వైద్యుల భద్రతకు సంబంధించిన సమస్యలను అంచనా వేసేందుకు- IMA ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది. ఇందులో 22 రాష్ట్రాలకు చెందిన 3885 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు. వీరిలో 85శాతం మంది 35ఏళ్లలోపు ఉన్న వైద్యులు ఉన్నారు. 61శాతం మంది ఇంటర్న్‌లు లేదా పీజీ వైద్యవిద్యార్థులు ఉన్నారు.

'అప్పుడు అక్కడ లేను- నేను వెళ్లే సరికే ఆమె చనిపోయింది'- కోల్​కతా కేసులో ట్విస్ట్! - Kolkata Doctor Case

ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్‌కు లై డిటెక్టర్‌ టెస్ట్​- ప్రధాని మోదీకి మమత లేఖ - Kolkata Doctor Case

IMA Study On Doctors : కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో రాత్రివేళల్లో విధులు నిర్వర్తించేందుకు కొందరు వైద్యులు భయపడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. మూడింట ఒకవంతు మహిళా వైద్యులు రాత్రివేళల్లో పనిచేయడం సురక్షితం కాదని భావిస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌- IMA సర్వేలో వెల్లడైంది. దాదాపు 3885 మంది డాక్టర్లు పాల్గొన్న ఈ సర్వేల్లో దాదాపు 35 శాతం మంది వైద్యులు రాత్రివేళల్లో విధులు నిర్వర్తించేందుకు భయపడుతున్నట్లు సర్వేలో తేలింది. బాధితురాలు విధుల్లో ఉన్న సమయంలో అత్యంత పాశవికంగా దాడి జరగడం వైద్యుల్లో తీవ్ర అలజడి రేపింది.

దీంతో నైట్ షిఫ్ట్‌లు చేయడానికి వైద్యులు భయపడుతున్నట్లు సర్వే వెల్లడించింది. ప్రధానంగా మహిళా డాక్టర్లు ఇందుకు వెనకడుగు వేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఆత్మరక్షణ కోసం విధులకు వచ్చేటప్పుడు ఆయుధాలను వెంట తెచ్చుకోవాలని భావిస్తున్నారని IMA వెల్లడించింది. నైట్‌ డ్యూటీలో సురక్షితంగా భావించడం లేదని సర్వేలో పాల్గొన్న 24.1 శాతం మంది వైద్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది. మరో 11.4 శాతంమంది వైద్యులు అత్యంత ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. భయపడుతున్న వారిలో అత్యధికులు మహిళా వైద్యులు,వైద్య విద్యార్థినులే ఉన్నట్లు వివరించింది.

నైట్‌షిఫ్టుల్లో డ్యూటీ రూమ్‌లు లేవని 45శాతం మంది పేర్కొన్నారు. డ్యూటీ రూమ్‌లు ఉన్నవారు మాత్రం అత్యంత సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. డ్యూటీ రూమ్‌లు ఉన్నచోట అవి సరిపోవడం లేదని, గోప్యత లేకపోవడం, తాళాలు లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంచుకోవాల్సి వస్తుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చెప్పింది. అందుబాటులో ఉన్న మూడింట ఒకవంతు డ్యూటీ రూమ్‌లలో అటాచ్డ్​ బాత్‌రూమ్‌లు లేవని సర్వేలో తేలింది. వాటికోసం చాలాదూరం వెళ్లాల్సి వస్తోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొంది.

53 శాతం డ్యూటీ రూమ్‌లు వార్డులు, అత్యవసర చికిత్సా విభాగాలకు చాలా దూరంలో ఉన్నాయని IMA అధ్యయనంలో వెల్లడైంది. మొత్తంగా సర్వేలో పాల్గొన్న అనేకమంది రాత్రి షిఫ్టుల్లో సురక్షితంగా లేమని భావిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో వారు పలు భద్రతా చర్యలను సూచించినట్లు తెలిపింది. శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది, సీసీ కెమెరాలు, అవసరమైన చోట విద్యుత్‌ దీపాలు, సెంట్రల్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌- CPA అమలు, రోగి బంధువుల సంఖ్యను నియంత్రించడం, సైరన్‌ వ్యవస్థల ఏర్పాటు, కనీస సౌకర్యాలతో డ్యూటీ రూమ్‌లు ఏర్పాటు వంటివి సూచించినట్లు తాజా అధ్యయనం పేర్కొంది.

జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన వేళ వైద్యుల భద్రతకు సంబంధించిన సమస్యలను అంచనా వేసేందుకు- IMA ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది. ఇందులో 22 రాష్ట్రాలకు చెందిన 3885 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు. వీరిలో 85శాతం మంది 35ఏళ్లలోపు ఉన్న వైద్యులు ఉన్నారు. 61శాతం మంది ఇంటర్న్‌లు లేదా పీజీ వైద్యవిద్యార్థులు ఉన్నారు.

'అప్పుడు అక్కడ లేను- నేను వెళ్లే సరికే ఆమె చనిపోయింది'- కోల్​కతా కేసులో ట్విస్ట్! - Kolkata Doctor Case

ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్‌కు లై డిటెక్టర్‌ టెస్ట్​- ప్రధాని మోదీకి మమత లేఖ - Kolkata Doctor Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.