ETV Bharat / bharat

భక్తులకు గుడ్​న్యూస్​- శ్రీవారి స్పెషల్ దర్శన టికెట్లు విడుదల

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 10:00 AM IST

Tirumala Special Darshan Tickets: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త అందించింది. ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్​లైన్​లో విడుదల చేసింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Tirumala Special Darshan Tickets
Tirumala Special Darshan Tickets

Tirumala Special Darshan Tickets for April 2024 Released: తిరుమల కొండపై కొలువైన అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని కనులారా వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు తిరుపతికి తరలివస్తారు. కాలినడక ద్వారా స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం కూడా పలు సేవలు ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్​న్యూస్​ చెప్పింది. ఏప్రిల్​ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్​లైన్​లో విడుదల చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

స్పెషల్​ దర్శనం టికెట్లు విడుదల: ఏప్రిల్‌ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో బుధవారం(జనవరి 24) ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) విడుదల చేసింది. అలాగే తిరుమ‌ల‌, తిరుప‌తిలోని వసతి గదుల కోటాను మధ్యాహ్నం 3 గంట‌లకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఇక శ్రీవారి సేవ కోటాను జనవరి 27న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. అలాగే నవనీత సేవ కోటాను అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఒకవేళ మీరు ఏప్రిల్​లో తిరుమల వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. అందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్​సైట్​ https://tirupatibalaji.ap.gov.in ద్వారా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.

శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి: ఇదిలా ఉంటే.. తిరుమలలో రేపు (జనవరి 25న) శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి జరగనుంది. ఇందుకోసం గురువారం రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనున్నారు. అదే రోజు.. పుష్యమాస పౌర్ణమి గరుడ సేవ కూడా ఉంటుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. అయితే... శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి కార్యక్రమానికి సంబంధించి భక్తులకు టీటీడీ అధికారులు ముఖ్య గమనిక చేశారు. ఈ కార్యక్రమానికి 10 సంవత్సరాలలోపు పిల్లలు, 50 సంవత్సరాలు దాటిన వృద్ధులతో పాటు.. ఊబకాయం, శస్త్రచికిత్సలు చేయించుకున్న భక్తులను అనుమతించబోమని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tirumala Special Darshan Tickets for April 2024 Released: తిరుమల కొండపై కొలువైన అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని కనులారా వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు తిరుపతికి తరలివస్తారు. కాలినడక ద్వారా స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం కూడా పలు సేవలు ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్​న్యూస్​ చెప్పింది. ఏప్రిల్​ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్​లైన్​లో విడుదల చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

స్పెషల్​ దర్శనం టికెట్లు విడుదల: ఏప్రిల్‌ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో బుధవారం(జనవరి 24) ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) విడుదల చేసింది. అలాగే తిరుమ‌ల‌, తిరుప‌తిలోని వసతి గదుల కోటాను మధ్యాహ్నం 3 గంట‌లకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఇక శ్రీవారి సేవ కోటాను జనవరి 27న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. అలాగే నవనీత సేవ కోటాను అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఒకవేళ మీరు ఏప్రిల్​లో తిరుమల వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. అందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్​సైట్​ https://tirupatibalaji.ap.gov.in ద్వారా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.

శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి: ఇదిలా ఉంటే.. తిరుమలలో రేపు (జనవరి 25న) శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి జరగనుంది. ఇందుకోసం గురువారం రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనున్నారు. అదే రోజు.. పుష్యమాస పౌర్ణమి గరుడ సేవ కూడా ఉంటుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. అయితే... శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి కార్యక్రమానికి సంబంధించి భక్తులకు టీటీడీ అధికారులు ముఖ్య గమనిక చేశారు. ఈ కార్యక్రమానికి 10 సంవత్సరాలలోపు పిల్లలు, 50 సంవత్సరాలు దాటిన వృద్ధులతో పాటు.. ఊబకాయం, శస్త్రచికిత్సలు చేయించుకున్న భక్తులను అనుమతించబోమని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వైభవంగా తిరుమల శ్రీవారి పార్వేట ఉత్సవం

అయోధ్యకు తిరుపతి నుంచి లక్ష లడ్డూలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.