ETV Bharat / bharat

ఒకే విమానంలో దిల్లీకి నీతీశ్‌, తేజస్వి- ఏదైనా ట్విస్ట్ ఉంటుందా? - Lok Sabha Election results 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 1:30 PM IST

Nitish Kumar and Tejashwi Yadav on Same Flight : ఎన్నికల ఫలితాలు విడుదలైన వేళ భవిష్యత్తు కార్యాచరణపై అధికార, విపక్ష కూటమి చర్చలకు పిలుపునిచ్చాయి. ఈ సమయంలో బిహార్ సీఎం నీతీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఒకే విమానంలో దిల్లీకి బయలుదేరారు. ఎన్​డీఏ ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలకంగా మారిన నీతీశ్ ఏమైనా రూట్ మార్చారా అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Lok Sabha Election results 2024
Lok Sabha Election results 2024 (Getty Images)

Nitish Kumar and Tejashwi Yadav on Same Flight : లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా 272 సీట్ల మెజార్టీ మార్కును అందుకోలేకపోవడం, అటు విపక్ష ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకున్న తరుణంలో బుధవారం రాజకీయ పక్షాలు కీలక భేటీలు నిర్వహిస్తున్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నాయి. ఈ తరుణంలో ఆసక్తికర పరిణామం జరిగింది.

బిహార్‌ సీఎం, జేడీయూ అగ్రనేత నీతీశ్‌ కుమార్, ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్ ఒకే విమానంలో దిల్లీకి బయల్దేరడం గమనార్హం. వేర్వేరు కూటములకు చెందిన వీరు ఒకే విమానంలో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నీతీశ్​ను కలిసేందుకు ఇండియా కూటమి దూతలను పంపిందన్న వార్తల నేపథ్యంలో తేజస్వీ ప్రయాణించే విమానంలో ఆయన ఉండడం వల్ల మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి.

'ప్రభుత్వ ఏర్పాటుకు కచ్చితంగా ప్రయత్నిస్తాం'
ఎన్నికల్లో ఆర్​జేడీ పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచుకుందని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. కోటి ఓట్లను తమ పార్టీ సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. దిల్లీ పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడుతూ తేజస్వీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'లోక్​సభ ఎన్నికల్లో ఆర్​జేడీ మంచి పనితీరు కనబర్చింది. ఇండియా కూటమి ప్రజల ఆశీర్వాదాన్ని పొందింది. మెజార్టీ మార్క్​ను అందుకోలేని బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది' అని తేజస్వీ వ్యాఖ్యానించారు.

ఒకేరోజు ఎన్​డీఏ, ఇండియా కూటమి భేటీ
లోక్​సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఎన్​డీఏ, ఇండియా కూటమి రాజకీయ వ్యూహరచనను ప్రారంభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గం బుధవారం సమావేశమైంది. అలాగే ఎన్​డీఏ భాగస్వామ్య పక్షాలు సాయంత్రం భేటీ కానున్నాయి. ఎన్​డీయే సమావేశానికి బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వంటి కీలక నేతలు హాజరుకానున్నారు. మరోవైపు, ఇండియా కూటమి కూడా దిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో బుధవారం సాయంత్రం 6గంటలకు భేటీ కానుంది. ఎన్నికల ఫలితాలు, తదుపరి రాజకీయ వ్యూహాలపై చర్చించేందుకు ఇండియా కూటమి సమావేశం కానుందని ఖర్గే ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కాంగ్రెస్ అరుదైన రికార్డ్!- 40ఏళ్ల తర్వాత హస్తం పార్టీకి 12కోట్ల ఓట్లు- మరి బీజేపీకి? - Lok Sabha Polls Results 2024

కాంగ్రెస్​ రిటర్న్స్​లో రాహుల్ గాంధీ​ కీ రోల్- రెండు జోడో యాత్రలతో ఫుల్ బెనిఫిట్స్​​! - Lok Sabha election Results 2024

Nitish Kumar and Tejashwi Yadav on Same Flight : లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా 272 సీట్ల మెజార్టీ మార్కును అందుకోలేకపోవడం, అటు విపక్ష ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకున్న తరుణంలో బుధవారం రాజకీయ పక్షాలు కీలక భేటీలు నిర్వహిస్తున్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నాయి. ఈ తరుణంలో ఆసక్తికర పరిణామం జరిగింది.

బిహార్‌ సీఎం, జేడీయూ అగ్రనేత నీతీశ్‌ కుమార్, ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్ ఒకే విమానంలో దిల్లీకి బయల్దేరడం గమనార్హం. వేర్వేరు కూటములకు చెందిన వీరు ఒకే విమానంలో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నీతీశ్​ను కలిసేందుకు ఇండియా కూటమి దూతలను పంపిందన్న వార్తల నేపథ్యంలో తేజస్వీ ప్రయాణించే విమానంలో ఆయన ఉండడం వల్ల మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి.

'ప్రభుత్వ ఏర్పాటుకు కచ్చితంగా ప్రయత్నిస్తాం'
ఎన్నికల్లో ఆర్​జేడీ పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచుకుందని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. కోటి ఓట్లను తమ పార్టీ సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. దిల్లీ పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడుతూ తేజస్వీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'లోక్​సభ ఎన్నికల్లో ఆర్​జేడీ మంచి పనితీరు కనబర్చింది. ఇండియా కూటమి ప్రజల ఆశీర్వాదాన్ని పొందింది. మెజార్టీ మార్క్​ను అందుకోలేని బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది' అని తేజస్వీ వ్యాఖ్యానించారు.

ఒకేరోజు ఎన్​డీఏ, ఇండియా కూటమి భేటీ
లోక్​సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఎన్​డీఏ, ఇండియా కూటమి రాజకీయ వ్యూహరచనను ప్రారంభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గం బుధవారం సమావేశమైంది. అలాగే ఎన్​డీఏ భాగస్వామ్య పక్షాలు సాయంత్రం భేటీ కానున్నాయి. ఎన్​డీయే సమావేశానికి బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వంటి కీలక నేతలు హాజరుకానున్నారు. మరోవైపు, ఇండియా కూటమి కూడా దిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో బుధవారం సాయంత్రం 6గంటలకు భేటీ కానుంది. ఎన్నికల ఫలితాలు, తదుపరి రాజకీయ వ్యూహాలపై చర్చించేందుకు ఇండియా కూటమి సమావేశం కానుందని ఖర్గే ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కాంగ్రెస్ అరుదైన రికార్డ్!- 40ఏళ్ల తర్వాత హస్తం పార్టీకి 12కోట్ల ఓట్లు- మరి బీజేపీకి? - Lok Sabha Polls Results 2024

కాంగ్రెస్​ రిటర్న్స్​లో రాహుల్ గాంధీ​ కీ రోల్- రెండు జోడో యాత్రలతో ఫుల్ బెనిఫిట్స్​​! - Lok Sabha election Results 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.