ETV Bharat / bharat

సామాజిక న్యాయమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం- పేదరికం నుంచి బయటకు కోట్ల మంది: ద్రౌపదీ ముర్ము - Independence Day 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 14, 2024, 8:45 PM IST

Independence Day 2024 Droupadi Murmu : 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఓ వీడియో సందేశంలో శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో సామాజిక న్యాయమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమన్న రాష్ట్రపతి, పేదరికం నుంచి కోట్ల మంది బయటపడ్డారని తెలిపారు.

Independence Day 2024
Independence Day 2024 (ANI)

Independence Day 2024 Droupadi Murmu : 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. భారతదేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం స్థిరమైన పురోగతి సాధించిందన్నారు. ఇది సామాజిక ప్రజాస్వామ్యం పురోగతిని ప్రతిబింబిస్తుందని నొక్కి చెప్పారు. దేశం దాని భిన్నత్వంలో ఏకత్వంపై అభివృద్ధి చెందుతుందని, ఒక సంఘటిత శక్తిగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం అనేక చర్యలు ప్రారంభించిన మోదీ ప్రభుత్వం, సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.

'అందరినీ భాగస్వామ్యులను చేయాలనే స్ఫూర్తి మన సామాజిక జీవితంలోని ప్రతి అంశంలోనూ ఉంది. మన వైవిధ్యం, బహుళత్వంతో మనం ఒక సమ్మిళిత దేశంగా కలిసి కదులుతాం. దీని దిశగా తప్పనిసరిగా బలోపేతం కావాలి' అని ముర్ము పిలుపునిచ్చారు. విశాలమైన దేశంలో, సామాజిక అంతరాలు ఆధారంగా అసమ్మతిని రేకెత్తించే ధోరణులను తిరస్కరించవలసి ఉంటుందని గట్టిగా నమ్ముతున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.

అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి
పేదల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే ప్రధాన్ మంత్రి సామాజిక్ ఉత్థాన్ ఏవం రోజ్ గార్ ఆధారిత్ జనకళ్యాణ్ (PM-SURAJ), ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM-JANMAN) సహా అట్టడుగు వర్గాల కోసం తీసుకొచ్చిన అనేక ప్రభుత్వ కార్యక్రమాలను ముర్ము వివరించారు. ముఖ్యంగా గిరిజనుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం తీసుకొచ్చిన స్కీమ్‌లను ప్రస్తావించారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదకర పనుల్లో పాల్గొనకుండా చూసుకోవడం, వ్యర్థాలను మానవులు తొలగించకుండా రక్షించేందుకు తీసుకొచ్చిన నమస్తే పథకం గురించి చర్చించారు.

మహిళా సాధికారతకు ప్రాధాన్యం
భారతీయ సమాజంలో మహిళలను సమానంగా చూస్తున్నప్పటికీ, సంప్రదాయ పక్షపాతాలు కొనసాగుతున్నాయని ద్రౌపదీ తెలిపారు. గత దశాబ్దం నుంచి మహిళా సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులను మూడు రెట్లు పెంచినట్లు తెలిపారు. స్త్రీ కార్మికుల భాగస్వామ్యాన్ని పెంచడానికి, మెరుగైన లింగ నిష్పత్తికి దారితీసిందని పేర్కొన్నారు. మహిళా సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనిస్తోందన్నారు. మహిళా సాధికారతకు నారీ శక్తి వందన్ అధినియం (మహిళా రిజర్వేషన్ చట్టం) ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పారు.

అతిపెద్ద ప్రజాస్వామ్య క్రతువు
2024 లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, చరిత్రలో అతిపెద్ద ఎన్నికల క్రతువును సజావుగా నిర్వహించారని తెలిపారు. ఎన్నికల సంఘం, భద్రతా సిబ్బందిని ఆమె ప్రశంసించారు. 'ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు, అది ప్రజాస్వామ్య విధానాన్ని ప్రతిధ్వనిస్తుంది. భారతదేశం విజయవంతంగా ఎన్నికలను నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య శక్తులను బలపరుస్తుంది' అని అన్నారు.

రైతులను 'అన్నదాత' (ఆహారం అందించేవారు)గా అభివర్ణించారు. భారతదేశ వ్యవసాయ స్వావలంబనకు చేసిన కృషిని కొనియాడారు. స్ట్రాటెజిక్‌ ప్లానింగ్‌, ఇన్‌స్టిట్యూషన్స్‌తో నిర్వహిస్తున్న రోడ్లు, రైల్వేలు, ఓడరేవుల సహా మౌలిక సదుపాయాలలో గణనీయమైన అభివృద్ధిని ముర్ము గుర్తించారు.

పెట్టుబడుల ఆకర్షణలో భేష్‌
సెమీకండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, పెట్టుబడి గమ్యస్థానంగా భారతదేశం ఎదగడాన్ని ప్రశంసించారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్‌లో పారదర్శకత పెరిగిందని, అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశాన్ని నిలపడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి విభజన్ విభిషిక స్మృతి దివస్ (విభజన భయానక జ్ఞాపక దినం) పాటించడాన్ని గురించి మాట్లాడారు. 'మనం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు, అసమానమైన విషాదాన్ని గుర్తుంచుకోవాలి. బాధిత కుటుంబాలకు సంఘీభావంగా నిలబడాలి' అని చెప్పారు.

పంద్రాగస్టు వేడుకలకు అంతా రెడీ- 11వ సారి జెండా ఎగరేయనున్న మోదీ- 6వేల మందికి ఆహ్వానం - Independence Day 2024

భారత ఒలింపిక్‌ క్రీడాబృందంతో రాష్ట్రపతి భేటీ - President Murmu OlympicsPlayers

Independence Day 2024 Droupadi Murmu : 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. భారతదేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం స్థిరమైన పురోగతి సాధించిందన్నారు. ఇది సామాజిక ప్రజాస్వామ్యం పురోగతిని ప్రతిబింబిస్తుందని నొక్కి చెప్పారు. దేశం దాని భిన్నత్వంలో ఏకత్వంపై అభివృద్ధి చెందుతుందని, ఒక సంఘటిత శక్తిగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం అనేక చర్యలు ప్రారంభించిన మోదీ ప్రభుత్వం, సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.

'అందరినీ భాగస్వామ్యులను చేయాలనే స్ఫూర్తి మన సామాజిక జీవితంలోని ప్రతి అంశంలోనూ ఉంది. మన వైవిధ్యం, బహుళత్వంతో మనం ఒక సమ్మిళిత దేశంగా కలిసి కదులుతాం. దీని దిశగా తప్పనిసరిగా బలోపేతం కావాలి' అని ముర్ము పిలుపునిచ్చారు. విశాలమైన దేశంలో, సామాజిక అంతరాలు ఆధారంగా అసమ్మతిని రేకెత్తించే ధోరణులను తిరస్కరించవలసి ఉంటుందని గట్టిగా నమ్ముతున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.

అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి
పేదల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే ప్రధాన్ మంత్రి సామాజిక్ ఉత్థాన్ ఏవం రోజ్ గార్ ఆధారిత్ జనకళ్యాణ్ (PM-SURAJ), ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM-JANMAN) సహా అట్టడుగు వర్గాల కోసం తీసుకొచ్చిన అనేక ప్రభుత్వ కార్యక్రమాలను ముర్ము వివరించారు. ముఖ్యంగా గిరిజనుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం తీసుకొచ్చిన స్కీమ్‌లను ప్రస్తావించారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదకర పనుల్లో పాల్గొనకుండా చూసుకోవడం, వ్యర్థాలను మానవులు తొలగించకుండా రక్షించేందుకు తీసుకొచ్చిన నమస్తే పథకం గురించి చర్చించారు.

మహిళా సాధికారతకు ప్రాధాన్యం
భారతీయ సమాజంలో మహిళలను సమానంగా చూస్తున్నప్పటికీ, సంప్రదాయ పక్షపాతాలు కొనసాగుతున్నాయని ద్రౌపదీ తెలిపారు. గత దశాబ్దం నుంచి మహిళా సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులను మూడు రెట్లు పెంచినట్లు తెలిపారు. స్త్రీ కార్మికుల భాగస్వామ్యాన్ని పెంచడానికి, మెరుగైన లింగ నిష్పత్తికి దారితీసిందని పేర్కొన్నారు. మహిళా సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనిస్తోందన్నారు. మహిళా సాధికారతకు నారీ శక్తి వందన్ అధినియం (మహిళా రిజర్వేషన్ చట్టం) ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పారు.

అతిపెద్ద ప్రజాస్వామ్య క్రతువు
2024 లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, చరిత్రలో అతిపెద్ద ఎన్నికల క్రతువును సజావుగా నిర్వహించారని తెలిపారు. ఎన్నికల సంఘం, భద్రతా సిబ్బందిని ఆమె ప్రశంసించారు. 'ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు, అది ప్రజాస్వామ్య విధానాన్ని ప్రతిధ్వనిస్తుంది. భారతదేశం విజయవంతంగా ఎన్నికలను నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య శక్తులను బలపరుస్తుంది' అని అన్నారు.

రైతులను 'అన్నదాత' (ఆహారం అందించేవారు)గా అభివర్ణించారు. భారతదేశ వ్యవసాయ స్వావలంబనకు చేసిన కృషిని కొనియాడారు. స్ట్రాటెజిక్‌ ప్లానింగ్‌, ఇన్‌స్టిట్యూషన్స్‌తో నిర్వహిస్తున్న రోడ్లు, రైల్వేలు, ఓడరేవుల సహా మౌలిక సదుపాయాలలో గణనీయమైన అభివృద్ధిని ముర్ము గుర్తించారు.

పెట్టుబడుల ఆకర్షణలో భేష్‌
సెమీకండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, పెట్టుబడి గమ్యస్థానంగా భారతదేశం ఎదగడాన్ని ప్రశంసించారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్‌లో పారదర్శకత పెరిగిందని, అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశాన్ని నిలపడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి విభజన్ విభిషిక స్మృతి దివస్ (విభజన భయానక జ్ఞాపక దినం) పాటించడాన్ని గురించి మాట్లాడారు. 'మనం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు, అసమానమైన విషాదాన్ని గుర్తుంచుకోవాలి. బాధిత కుటుంబాలకు సంఘీభావంగా నిలబడాలి' అని చెప్పారు.

పంద్రాగస్టు వేడుకలకు అంతా రెడీ- 11వ సారి జెండా ఎగరేయనున్న మోదీ- 6వేల మందికి ఆహ్వానం - Independence Day 2024

భారత ఒలింపిక్‌ క్రీడాబృందంతో రాష్ట్రపతి భేటీ - President Murmu OlympicsPlayers

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.