ETV Bharat / bharat

NDA 3.Oలో ఏ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులో తెలుసా? మిత్రపక్షాల్లో ఆ పార్టీలకే హయ్యెస్ట్! - Cabinet Ministers of India 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 3:51 PM IST

Party and State Wise Modi Cabinet Ministers : ప్రధాని మోదీ 3.0 కేబినెట్​లో బీజేపీకి 61, మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు దక్కాయి. అలాగే రాష్ట్రాల వారీగా చూస్తే కేంద్ర కేబినెట్​లో ఉత్తర్ ప్రదేశ్, బిహార్, మహారాష్ట్రకు మోదీ సర్కార్ పెద్దపీట వేసింది. యూపీకి 9, బిహార్​కు 8, మహారాష్ట్రకు 6 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చింది

Party and State Wise Modi Cabinet Ministers
Party and State Wise Modi Cabinet Ministers (ANI)

Party and State Wise Modi Cabinet Ministers : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొలువు దీరిన ఎన్డీఏ 3.O సర్కార్​ కేబినెట్​లో బీజేపీకి 61, ఎన్​డీఏ మిత్రపక్షాలకు 11 బెర్తులు లభించాయి. మొత్తం 72మందితో మోదీ కేంద్ర కేబినెట్ కొలువుదీరింది. ఎన్​డీఏ ప్రధాన మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూకి చెరో రెండు కేబినెట్ బెర్తులు దక్కాయి. ఎల్​జేపీ(ఆర్ వీ), జేడీఎస్, శివసేన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ లోక్ దళ, అప్నా దళ్, హిందూ అవామీ మోర్చా చెరో ఒక్క కేబినెట్ స్థానాన్ని దక్కించుకున్నాయి.

రాష్ట్రాలవారీగా కేబినెట్ బెర్తులు
మరోవైపు రాష్ట్రాల వారీగా చూస్తే కేంద్ర కేబినెట్​లో ఉత్తర్​ప్రదేశ్, బిహార్, మహారాష్ట్రకు మోదీ సర్కార్ పెద్ద పీట వేసింది. 80 లోక్​సభ స్థానాలున్న యూపీకి 9, బిహార్​కు 8 కేంద్ర కేబినెట్ బెర్తులు దక్కాయి. మహారాష్ట్రకు 6, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్​కు చెరో 5 కేంద్ర మంత్రి పదవులు వరించాయి. హరియాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెరో మూడు, ఒడిశా, అసోం, ఝార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, బంగాల్, కేరళకు చెరో రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.

రాష్ట్రాలవారీగా కేంద్రమంత్రులు

  • ఉత్తర్​ప్రదేశ్ నుంచి బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ రాష్ట్రంలో ఏకైక క్యాబినెట్ మంత్రి ఆయనే. మరో 8మందికి కేంద్ర సహాయ మంత్రులుగా అవకాశం దక్కింది.
  • గుజరాత్‌ - అమిత్ షా, మన్​సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్
  • బిహార్‌ - హిందూస్థానీ అవామీ మోర్చా నుంచి జితన్ రామ్ మాంఝీ, జేడీయూ తరఫున రాజీవ్ రంజన్ సింగ్, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్, ఎల్​జేపీ(ఆర్​వీ) నేత చిరాగ్ పాసవాన్
  • మధ్యప్రదేశ్‌ - శివరాజ్ సింగ్ చౌహాన్, వీరేంద్ర కుమార్, జ్యోతిరాధిత్య సింథియా
  • మహారాష్ట్ర - నితిన్ గడ్కరీ, పీయూశ్ గోయల్
  • తమిళనాడు - నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, ఎల్ మురుగన్
  • రాజస్థాన్‌ - అశ్విని వైష్ణవ్, భూపేందర్ యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్
  • ఒడిశా - ధర్మేంద్ర ప్రధాన్, జువల్ ఓరమ్
  • కర్ణాటక - హెచ్‌ డీ కుమారస్వామి, ప్రహ్లాద్ జోషి
  • ఆంధ్రప్రదేశ్ - కింజరాపు రామ్మోహన్ నాయుడు
  • తెలంగాణ - గంగాపురం కిషన్ రెడ్డి
  • హరియాణా - మనోహర్ లాల్ ఖట్టర్
  • హిమాచల్ ప్రదేశ్ - జేపీ నడ్డా

మనవడి కోసం ప్రాణం పణంగా పెట్టిన బామ్మ- 70ఏళ్ల వయసు​లో కిడ్నీ దానం - KIDNEY TRANSPLANT

'రియాసీ' టెర్రర్​ అటాక్​ పాక్​ ఉగ్రసంస్థ పనే- మరిన్ని దాడులు చేస్తామంటూ! - Jammu Kashmir Terror Attack

Party and State Wise Modi Cabinet Ministers : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొలువు దీరిన ఎన్డీఏ 3.O సర్కార్​ కేబినెట్​లో బీజేపీకి 61, ఎన్​డీఏ మిత్రపక్షాలకు 11 బెర్తులు లభించాయి. మొత్తం 72మందితో మోదీ కేంద్ర కేబినెట్ కొలువుదీరింది. ఎన్​డీఏ ప్రధాన మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూకి చెరో రెండు కేబినెట్ బెర్తులు దక్కాయి. ఎల్​జేపీ(ఆర్ వీ), జేడీఎస్, శివసేన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ లోక్ దళ, అప్నా దళ్, హిందూ అవామీ మోర్చా చెరో ఒక్క కేబినెట్ స్థానాన్ని దక్కించుకున్నాయి.

రాష్ట్రాలవారీగా కేబినెట్ బెర్తులు
మరోవైపు రాష్ట్రాల వారీగా చూస్తే కేంద్ర కేబినెట్​లో ఉత్తర్​ప్రదేశ్, బిహార్, మహారాష్ట్రకు మోదీ సర్కార్ పెద్ద పీట వేసింది. 80 లోక్​సభ స్థానాలున్న యూపీకి 9, బిహార్​కు 8 కేంద్ర కేబినెట్ బెర్తులు దక్కాయి. మహారాష్ట్రకు 6, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్​కు చెరో 5 కేంద్ర మంత్రి పదవులు వరించాయి. హరియాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెరో మూడు, ఒడిశా, అసోం, ఝార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, బంగాల్, కేరళకు చెరో రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.

రాష్ట్రాలవారీగా కేంద్రమంత్రులు

  • ఉత్తర్​ప్రదేశ్ నుంచి బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ రాష్ట్రంలో ఏకైక క్యాబినెట్ మంత్రి ఆయనే. మరో 8మందికి కేంద్ర సహాయ మంత్రులుగా అవకాశం దక్కింది.
  • గుజరాత్‌ - అమిత్ షా, మన్​సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్
  • బిహార్‌ - హిందూస్థానీ అవామీ మోర్చా నుంచి జితన్ రామ్ మాంఝీ, జేడీయూ తరఫున రాజీవ్ రంజన్ సింగ్, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్, ఎల్​జేపీ(ఆర్​వీ) నేత చిరాగ్ పాసవాన్
  • మధ్యప్రదేశ్‌ - శివరాజ్ సింగ్ చౌహాన్, వీరేంద్ర కుమార్, జ్యోతిరాధిత్య సింథియా
  • మహారాష్ట్ర - నితిన్ గడ్కరీ, పీయూశ్ గోయల్
  • తమిళనాడు - నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, ఎల్ మురుగన్
  • రాజస్థాన్‌ - అశ్విని వైష్ణవ్, భూపేందర్ యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్
  • ఒడిశా - ధర్మేంద్ర ప్రధాన్, జువల్ ఓరమ్
  • కర్ణాటక - హెచ్‌ డీ కుమారస్వామి, ప్రహ్లాద్ జోషి
  • ఆంధ్రప్రదేశ్ - కింజరాపు రామ్మోహన్ నాయుడు
  • తెలంగాణ - గంగాపురం కిషన్ రెడ్డి
  • హరియాణా - మనోహర్ లాల్ ఖట్టర్
  • హిమాచల్ ప్రదేశ్ - జేపీ నడ్డా

మనవడి కోసం ప్రాణం పణంగా పెట్టిన బామ్మ- 70ఏళ్ల వయసు​లో కిడ్నీ దానం - KIDNEY TRANSPLANT

'రియాసీ' టెర్రర్​ అటాక్​ పాక్​ ఉగ్రసంస్థ పనే- మరిన్ని దాడులు చేస్తామంటూ! - Jammu Kashmir Terror Attack

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.