ETV Bharat / bharat

'అదానీ​ గ్రూప్​పై - సెబీ చీఫ్​పై తక్షణమే చర్యలు తీసుకోవాలి' - విపక్షాలు డిమాండ్​ - Opposition On Hindenburg

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 1:23 PM IST

Opposition On Hindenburg Allegations : సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి దంపతుల గురించి హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై విపక్షాలు మండిపడుతున్నాయి. అదానీ గ్రూప్​ చేస్తున్న కుంభ కోణాలపై ప్రభుత్వం తక్షణమే చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Opposition On Hindenburg Allegations
Opposition On Hindenburg Allegations (ANI)

Opposition On Hindenburg Allegations : అదానీ గ్రూప్ చేస్తున్న కుంభ కోణాలపై, సెబీ ఛైర్మన్​ మాధబి పురి బచ్​ క్రోనీ క్యాపిటలిజంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. హిండెన్​బర్గ్​ రీసెర్చ్ నివేదికలో చేసిన సంచలన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని, కానీ మోదీ సర్కార్​ ఈ విషయంలో చాలా ఉదాసీనంగా ఉందని దుయ్యబట్టాయి.

అమెరికా షార్ట్‌సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్‌ ఫండ్‌లలో సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. అదానీ గ్రూప్​ అనేక అవకతవకలకు పాల్పడుతోందని కూడా పేర్కొంది. దీనితో విపక్షాలు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నాయి.

తక్షణమే చర్యలు తీసుకోవాలి - కాంగ్రెస్
అదానీ గ్రూప్‌పై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది. 'అదానీ గ్రూప్‌ చేస్తున్న కుంభకోణాలపై దర్యాప్తు విషయంలో సెబీ ఆసక్తి కనబరచకపోవడానికి గల కారణం ఇప్పుడు అర్థమైంది. దీనిని సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ కూడా గుర్తించలేకపోయింది' అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు. 2023లో అదానీ గ్రూప్‌ చేస్తున్న అవకతవకలపై హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువరించినప్పుడు 13 అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నామని సెబీ నిపుణుల కమిటీకి తెలిపిందన్నారు. కానీ ఇప్పటికీ వారు చేస్తున్న దర్యాప్తు పూర్తి కాలేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముందు పార్లమెంటు సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయని చెప్పిన మోదీ సర్కార్​, ఆగస్టు 9న మధ్యాహ్నం అకస్మాత్తుగా వాయిదా వేయడానికి కారణం ఏమై ఉండొచ్చో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోందని జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు.

ఇది క్రోనీ క్యాపిటలిజం
తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రా ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ 'సెబీ ఛైర్మన్‌ కూడా అదానీ గ్రూపులో పెట్టుబడిదారుగా ఉన్నారు. అంటే ఇక్కడ క్రోనీ క్యాపిటలిజం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు సీబీఐ, ఈడీలు సెబీ చీఫ్‌పై దర్యాప్తు ప్రారంభిస్తాయా?’’ అంటూ ప్రశ్నించారు. గతంలో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను సుప్రీం పునఃసమీక్షించాలని ఆమె కోరారు. శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ, అదానీ గ్రూప్ కంపెనీల వివరాలను కోరుతూ తాను రాసిన లేఖలకు సెబీ ఎందుకు సమాధానం ఇవ్వలేదో ఇప్పుడు స్పష్టమైందని తీవ్రంగా విమర్శించారు.

బాంబ్​ పేల్చిన హిండెన్​బర్గ్​
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ శనివారం విజిల్‌బ్లోయర్ పత్రాలను ఉదహరిస్తూ, గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్‌ బెర్ముడా, మారిషస్‌ ఫండ్‌లు ఉన్నాయని పేర్కొంది. ఇందులో సెబీ ఛైర్​పర్సన్​ మాధబి పురి, ఆమె భర్త ధావల్‌ బచ్‌లకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ దంపతుల వాటాల నికర విలువ 10 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.83 కోట్ల) వరకు ఉండొచ్చని పేర్కొంది.

'హిండెన్‌బర్గ్‌ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది' - సెబీ చీఫ్‌ మాధబి పురి బచ్‌ - Hindenburg On SEBI Chairperson

మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? వారెన్ బఫెట్ చెప్పిన ఈ 6 సూత్రాలు పాటిస్తే లాభాలు గ్యారెంటీ! - Warren Buffet Investing Lessons

Opposition On Hindenburg Allegations : అదానీ గ్రూప్ చేస్తున్న కుంభ కోణాలపై, సెబీ ఛైర్మన్​ మాధబి పురి బచ్​ క్రోనీ క్యాపిటలిజంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. హిండెన్​బర్గ్​ రీసెర్చ్ నివేదికలో చేసిన సంచలన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని, కానీ మోదీ సర్కార్​ ఈ విషయంలో చాలా ఉదాసీనంగా ఉందని దుయ్యబట్టాయి.

అమెరికా షార్ట్‌సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్‌ ఫండ్‌లలో సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. అదానీ గ్రూప్​ అనేక అవకతవకలకు పాల్పడుతోందని కూడా పేర్కొంది. దీనితో విపక్షాలు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నాయి.

తక్షణమే చర్యలు తీసుకోవాలి - కాంగ్రెస్
అదానీ గ్రూప్‌పై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది. 'అదానీ గ్రూప్‌ చేస్తున్న కుంభకోణాలపై దర్యాప్తు విషయంలో సెబీ ఆసక్తి కనబరచకపోవడానికి గల కారణం ఇప్పుడు అర్థమైంది. దీనిని సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ కూడా గుర్తించలేకపోయింది' అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు. 2023లో అదానీ గ్రూప్‌ చేస్తున్న అవకతవకలపై హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువరించినప్పుడు 13 అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నామని సెబీ నిపుణుల కమిటీకి తెలిపిందన్నారు. కానీ ఇప్పటికీ వారు చేస్తున్న దర్యాప్తు పూర్తి కాలేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముందు పార్లమెంటు సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయని చెప్పిన మోదీ సర్కార్​, ఆగస్టు 9న మధ్యాహ్నం అకస్మాత్తుగా వాయిదా వేయడానికి కారణం ఏమై ఉండొచ్చో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోందని జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు.

ఇది క్రోనీ క్యాపిటలిజం
తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రా ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ 'సెబీ ఛైర్మన్‌ కూడా అదానీ గ్రూపులో పెట్టుబడిదారుగా ఉన్నారు. అంటే ఇక్కడ క్రోనీ క్యాపిటలిజం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు సీబీఐ, ఈడీలు సెబీ చీఫ్‌పై దర్యాప్తు ప్రారంభిస్తాయా?’’ అంటూ ప్రశ్నించారు. గతంలో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను సుప్రీం పునఃసమీక్షించాలని ఆమె కోరారు. శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ, అదానీ గ్రూప్ కంపెనీల వివరాలను కోరుతూ తాను రాసిన లేఖలకు సెబీ ఎందుకు సమాధానం ఇవ్వలేదో ఇప్పుడు స్పష్టమైందని తీవ్రంగా విమర్శించారు.

బాంబ్​ పేల్చిన హిండెన్​బర్గ్​
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ శనివారం విజిల్‌బ్లోయర్ పత్రాలను ఉదహరిస్తూ, గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్‌ బెర్ముడా, మారిషస్‌ ఫండ్‌లు ఉన్నాయని పేర్కొంది. ఇందులో సెబీ ఛైర్​పర్సన్​ మాధబి పురి, ఆమె భర్త ధావల్‌ బచ్‌లకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ దంపతుల వాటాల నికర విలువ 10 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.83 కోట్ల) వరకు ఉండొచ్చని పేర్కొంది.

'హిండెన్‌బర్గ్‌ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది' - సెబీ చీఫ్‌ మాధబి పురి బచ్‌ - Hindenburg On SEBI Chairperson

మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? వారెన్ బఫెట్ చెప్పిన ఈ 6 సూత్రాలు పాటిస్తే లాభాలు గ్యారెంటీ! - Warren Buffet Investing Lessons

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.