ETV Bharat / bharat

ఒకే దేశం ఒకే ఎన్నిక- మరోసారి హైలెవల్​ కమిటీ భేటీ- కోవింద్ స్పెషల్ రివ్యూ!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 7:11 AM IST

Updated : Feb 25, 2024, 8:15 AM IST

One Nation One Election Committee Review : జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ నేతృత్వంలో నియమించిన కమిటీ మరోసారి సమీక్ష జరిపింది. కమిటీ ఏర్పాటు తర్వాత నుంచి ఇప్పటివరకు సాధించిన ప్రగతిపై సమీక్ష జరిపినట్లు తెలిపింది.

One Nation One Election Committee
One Nation One Election Committee

One Nation One Election Committee Review : ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ మరోసారి సమీక్ష జరిపింది. శనివారం జరిగిన సమావేశంలో గతేడాది 'కమిటీ ఏర్పాటు' తర్వాత సాధించిన ప్రగతిని సమీక్షించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు కేంద్రం ఈ కమిటీని నియమించింది.

జమిలి ఎన్నికలపై ఈ కమిటీ రాజ్యాంగ సవరణలు ఇతర అంశాల్లో సిఫార్సులు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో దేశంలోని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కమిటీ పరిశీలిస్తోంది. అధికార ఎన్డీఏ, శివసేన వంటి పార్టీలు ఏకకాల ఎన్నికల భావనకు మద్దతిస్తున్నాయి. వీటివల్ల ఎన్నికల ఖర్చు, సమయం తగ్గుతుందని భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలు ఈ ఆలోచనను తప్పుబడుతున్నాయి. ఇలా చేస్తే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను అర్ధంతరంగా నిలిపివేయాల్సి వస్తుందని, ఇది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమేనని చెబుతున్నాయి.

ప్రజల నుంచి సూచనలు
కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి గత నెలలో సూచనలు స్వీకరించింది. దాంతో పాటు దేశంలోని 6 జాతీయ, 33 రాష్ట్ర పార్టీలతోపాటు 7 గుర్తింపు పొందని పార్టీల నుంచి అంతకుముందు జమిలీ ఎన్నికలపై అభిప్రాయాలు కోరింది. జమిలీ ఎన్నికలపై లా కమిషన్ అభిప్రాయాలను కూడా కమిటీ ఇప్పటికే తీసుకుంది.

లోక్‌సభ రాష్ట్ర శాసనసభలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకాకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం సిఫార్సులు చేసే లక్ష్యంతో గతేడాది కోవింద్ కమిటీ ఏర్పాటైంది. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించే ఈ కమిటీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు శాసన, న్యాయ, ఆర్థిక నిపుణులకు కేంద్రం స్థానం కల్పించింది. కమిటీలో రామ్​నాథ్​ కోవింద్​తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్​కే సింగ్, సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే, లోక్​సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాశ్ సీ కశ్యప్, మాజీ చీఫ్​ విజిలెన్స్ కమిషనర్ సంజయ్​తో కమిటీ ఏర్పాటు చేశారు.

15ఏళ్లకు రూ.10వేల కోట్లు ఖర్చు- జమిలి ఎన్నికలపై ఈసీ అంచనా

జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కీలక భేటీ - పారిశ్రామికవేత్తలు, విశ్రాంత జడ్జీలతో కోవింద్ చర్చలు

One Nation One Election Committee Review : ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ మరోసారి సమీక్ష జరిపింది. శనివారం జరిగిన సమావేశంలో గతేడాది 'కమిటీ ఏర్పాటు' తర్వాత సాధించిన ప్రగతిని సమీక్షించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు కేంద్రం ఈ కమిటీని నియమించింది.

జమిలి ఎన్నికలపై ఈ కమిటీ రాజ్యాంగ సవరణలు ఇతర అంశాల్లో సిఫార్సులు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో దేశంలోని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కమిటీ పరిశీలిస్తోంది. అధికార ఎన్డీఏ, శివసేన వంటి పార్టీలు ఏకకాల ఎన్నికల భావనకు మద్దతిస్తున్నాయి. వీటివల్ల ఎన్నికల ఖర్చు, సమయం తగ్గుతుందని భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలు ఈ ఆలోచనను తప్పుబడుతున్నాయి. ఇలా చేస్తే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను అర్ధంతరంగా నిలిపివేయాల్సి వస్తుందని, ఇది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమేనని చెబుతున్నాయి.

ప్రజల నుంచి సూచనలు
కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి గత నెలలో సూచనలు స్వీకరించింది. దాంతో పాటు దేశంలోని 6 జాతీయ, 33 రాష్ట్ర పార్టీలతోపాటు 7 గుర్తింపు పొందని పార్టీల నుంచి అంతకుముందు జమిలీ ఎన్నికలపై అభిప్రాయాలు కోరింది. జమిలీ ఎన్నికలపై లా కమిషన్ అభిప్రాయాలను కూడా కమిటీ ఇప్పటికే తీసుకుంది.

లోక్‌సభ రాష్ట్ర శాసనసభలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకాకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం సిఫార్సులు చేసే లక్ష్యంతో గతేడాది కోవింద్ కమిటీ ఏర్పాటైంది. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించే ఈ కమిటీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు శాసన, న్యాయ, ఆర్థిక నిపుణులకు కేంద్రం స్థానం కల్పించింది. కమిటీలో రామ్​నాథ్​ కోవింద్​తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్​కే సింగ్, సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే, లోక్​సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాశ్ సీ కశ్యప్, మాజీ చీఫ్​ విజిలెన్స్ కమిషనర్ సంజయ్​తో కమిటీ ఏర్పాటు చేశారు.

15ఏళ్లకు రూ.10వేల కోట్లు ఖర్చు- జమిలి ఎన్నికలపై ఈసీ అంచనా

జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కీలక భేటీ - పారిశ్రామికవేత్తలు, విశ్రాంత జడ్జీలతో కోవింద్ చర్చలు

Last Updated : Feb 25, 2024, 8:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.