ETV Bharat / bharat

కుప్పకూలిన భవనం - 8కి పెరిగిన మృతుల సంఖ్య - 28 మందికి తీవ్రగాయాలు - Building Collapse Lucknow

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2024, 7:23 PM IST

Updated : Sep 8, 2024, 7:12 AM IST

Building Collapse Lucknow : ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో ఓ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఈ ఘటనలో 28 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని, మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Building Collapse Lucknow
Building Collapse Lucknow (ETV Bharat)

Building Collapse Lucknow : ఉత్తర్​ప్రదేశ్​లో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. సుమారు 28 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం లఖ్​నవూలో జరిగింది. పలువురు ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారని, వారిని వెలికితేసేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. గాయపడివారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రాన్స్‌పోర్ట్‌ నగర్‌లోని ఓ మూడంతస్తుల భవనంలో గిడ్డంగులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం 5 గటంల ప్రాంతంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎన్​డీఆర్‌ఎఫ్‌, ఎస్​డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని, సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతదేహాలను వెలకితీశారు.

ఇక శనివారమే ఘటనాస్థలికి చేరుకున్న డీసీపీ శశాంక్ సింగ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మొదట్లో వర్షం కారణంగా బిల్డింగ్ కుప్పకూలినట్లు భావించారు. కానీ బిల్డింగ్ పిల్లర్‌కు క్రాక్ ఏర్పడడం వల్లనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు వెల్లడించారు.

''లఖ్​నవూలో ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లోని హర్మిలాప్ భవనాన్ని నాలుగేళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఈ మూడంతస్తుల ఈ భవనంలో కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భవనం గ్రౌండ్​ ఫ్లోర్​లో మోటార్ వర్క్‌షాప్, మొదటి అంతస్తులో మెడికల్ గొడౌన్, రెండవ అంతస్తులో కత్తిపీట గొడౌన్ ఉన్నాయి. శనివారం వర్షం కురిసింది. అదే సమయంలో బిల్డింగ్ పిల్లర్‌కు క్రాక్ ఏర్పడింది. దీనితో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీనితో అందులో పని చేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని అధికారులు వివరాలు వెల్లడించారు.

స్పందించిన సీఎం

ప్రమాద ఘటనపై రక్షణశాఖ మంత్రి, లఖ్‌నవూ ఎంపీ రాజ్‌నాథ్ సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో మాట్లాడి, గాయపడిన వారికి అందిస్తున్న చికిత్స గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

మల్లాపూర్​ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం - ఎగిసిపడుతోన్న మంటలు - Fire Accident At Mallapur In HYD

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు - లెక్కచేయకుండా దాటుతున్న వాహనదారులు - Medchal Stream is Flowing Furiously

Building Collapse Lucknow : ఉత్తర్​ప్రదేశ్​లో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. సుమారు 28 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం లఖ్​నవూలో జరిగింది. పలువురు ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారని, వారిని వెలికితేసేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. గాయపడివారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రాన్స్‌పోర్ట్‌ నగర్‌లోని ఓ మూడంతస్తుల భవనంలో గిడ్డంగులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం 5 గటంల ప్రాంతంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎన్​డీఆర్‌ఎఫ్‌, ఎస్​డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని, సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతదేహాలను వెలకితీశారు.

ఇక శనివారమే ఘటనాస్థలికి చేరుకున్న డీసీపీ శశాంక్ సింగ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మొదట్లో వర్షం కారణంగా బిల్డింగ్ కుప్పకూలినట్లు భావించారు. కానీ బిల్డింగ్ పిల్లర్‌కు క్రాక్ ఏర్పడడం వల్లనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు వెల్లడించారు.

''లఖ్​నవూలో ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లోని హర్మిలాప్ భవనాన్ని నాలుగేళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఈ మూడంతస్తుల ఈ భవనంలో కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భవనం గ్రౌండ్​ ఫ్లోర్​లో మోటార్ వర్క్‌షాప్, మొదటి అంతస్తులో మెడికల్ గొడౌన్, రెండవ అంతస్తులో కత్తిపీట గొడౌన్ ఉన్నాయి. శనివారం వర్షం కురిసింది. అదే సమయంలో బిల్డింగ్ పిల్లర్‌కు క్రాక్ ఏర్పడింది. దీనితో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీనితో అందులో పని చేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని అధికారులు వివరాలు వెల్లడించారు.

స్పందించిన సీఎం

ప్రమాద ఘటనపై రక్షణశాఖ మంత్రి, లఖ్‌నవూ ఎంపీ రాజ్‌నాథ్ సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో మాట్లాడి, గాయపడిన వారికి అందిస్తున్న చికిత్స గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

మల్లాపూర్​ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం - ఎగిసిపడుతోన్న మంటలు - Fire Accident At Mallapur In HYD

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు - లెక్కచేయకుండా దాటుతున్న వాహనదారులు - Medchal Stream is Flowing Furiously

Last Updated : Sep 8, 2024, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.