ETV Bharat / bharat

10ఏళ్ల తర్వాత జమ్ముకశ్మీర్​లో అసెంబ్లీ ఎన్నికలు- తొలి దశ పోలింగ్​కు సర్వం సిద్ధం - Jammu and Kashmir elections

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2024, 6:37 PM IST

Jammu and Kashmir Assembly Elections 2024 : జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా తొలిదశలో 24 స్థానాలకు బుధవారం పోలింగ్‌ జరగనుంది. 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23 లక్షల మంది నిర్దేశించనున్నారు. పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉగ్రదాడుల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Jammu and Kashmir Assembly Elections 2024
Jammu and Kashmir Assembly Elections 2024 (ETV Bharat)

Jammu and Kashmir Assembly Elections 2024 : కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో తొలిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. పీర్‌ పంజల్‌ పర్వత శ్రేణికి అటు, ఇటు ఉన్న ఏడు జిల్లాల్లో పదేళ్ల తర్వాత తొలిసారిగా పోలింగ్‌ జరగనుంది. బుధవారం పోలింగ్‌ జరగనున్న 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. ఈ 24 అసెంబ్లీ స్థానాల్లో 8 జమ్ము ప్రాంతంలోను, 16 కశ్మీర్‌ లోయలోనూ ఉన్నాయి. 2019 ఆగస్టులో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే.

తొలిదశ పోలింగ్‌ జరగనున్న 24 అసెంబ్లీ స్థానాల్లో 3,276 పోలింగ్‌ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 14000 మంది పోలింగ్‌ సిబ్బందిని మోహరించారు. అర్బన్‌లో 302, గ్రామీణ ప్రాంతాల్లో 2974 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. బరిలో ఉన్న ప్రముఖ అభ్యర్థుల్లో CPMకు చెందిన మహ్మద్ యూసుఫ్ తరిగామి, AICC ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన సకీనా ఇటూ, PDPకి చెందిన సర్తాజ్ మద్నీ, అబ్దుల్ రెహ్మాన్ ఉన్నారు. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న వేళ జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్​(ఎన్​సీ), పీపుల్స్​ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ), పీపుల్స్​ కాన్ఫరెన్స్(పీసీ), జమ్ముకశ్మీర్ పీపుల్స్​ మూమెంట్(జేకేపీఎమ్), ఆప్నీ పార్టీతో పాటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఎన్నికల బరిలో దిగాయి. కాంగ్రెస్​, ఎన్​సీ కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా ఎన్​సీ 51 సీట్లలో, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

మరోవైపు, పీడీపీ 40మందికి పైగా అభ్యర్థులను బరిలోకి దింపింది. ఎన్​తో హోరాహోరీ పోరు నెలకొన్న కశ్మీర్​లో వ్యాలీలో జెండా పాతడమే లక్ష్యంగా పోటీలోకి దిగింది. ఇక బీజేపీ 59 సీట్లలో పోటీ చేస్తోంది. 2014లో కమలదళం, వ్యాలీలో 30 సీట్లకు పైగా పోటీ చేసింది. అక్కడ బరిలోకి దిగిన 33 సీట్లలో 25గెలుచుకోగలగింది. ఈ పార్టీలతో పాటు సజ్జద్​ లోన్​ నేతృత్వంలో పీపుల్స్​ కాన్ఫరెన్స్​ తమ అదృష్టం పరిక్షించుకుంటోంది. మాజీ కాంగ్రెస్​ నేత, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్​ పార్టీ(డీపీఏపీ), అల్తాఫ్​ బుఖారీ నేతృత్వంలో ఆప్నీ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.

జమ్ముకశ్మీర్​లో స్థానిక పార్టీల 'ఫ్రీ కరెంట్' జపం - ఈ హామీ ఓట్లు రాలుస్తుందా? - Jammu And Kashmir Elections

వేడెక్కిన జమ్ముకశ్మీర్​ రాజకీయం- కాంగ్రెస్​, ఎన్​సీ పొత్తుతో కుదేలైన PDP! - Jammu Kashmir Assembly Elections

Jammu and Kashmir Assembly Elections 2024 : కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో తొలిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. పీర్‌ పంజల్‌ పర్వత శ్రేణికి అటు, ఇటు ఉన్న ఏడు జిల్లాల్లో పదేళ్ల తర్వాత తొలిసారిగా పోలింగ్‌ జరగనుంది. బుధవారం పోలింగ్‌ జరగనున్న 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. ఈ 24 అసెంబ్లీ స్థానాల్లో 8 జమ్ము ప్రాంతంలోను, 16 కశ్మీర్‌ లోయలోనూ ఉన్నాయి. 2019 ఆగస్టులో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే.

తొలిదశ పోలింగ్‌ జరగనున్న 24 అసెంబ్లీ స్థానాల్లో 3,276 పోలింగ్‌ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 14000 మంది పోలింగ్‌ సిబ్బందిని మోహరించారు. అర్బన్‌లో 302, గ్రామీణ ప్రాంతాల్లో 2974 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. బరిలో ఉన్న ప్రముఖ అభ్యర్థుల్లో CPMకు చెందిన మహ్మద్ యూసుఫ్ తరిగామి, AICC ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన సకీనా ఇటూ, PDPకి చెందిన సర్తాజ్ మద్నీ, అబ్దుల్ రెహ్మాన్ ఉన్నారు. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న వేళ జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్​(ఎన్​సీ), పీపుల్స్​ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ), పీపుల్స్​ కాన్ఫరెన్స్(పీసీ), జమ్ముకశ్మీర్ పీపుల్స్​ మూమెంట్(జేకేపీఎమ్), ఆప్నీ పార్టీతో పాటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఎన్నికల బరిలో దిగాయి. కాంగ్రెస్​, ఎన్​సీ కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా ఎన్​సీ 51 సీట్లలో, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

మరోవైపు, పీడీపీ 40మందికి పైగా అభ్యర్థులను బరిలోకి దింపింది. ఎన్​తో హోరాహోరీ పోరు నెలకొన్న కశ్మీర్​లో వ్యాలీలో జెండా పాతడమే లక్ష్యంగా పోటీలోకి దిగింది. ఇక బీజేపీ 59 సీట్లలో పోటీ చేస్తోంది. 2014లో కమలదళం, వ్యాలీలో 30 సీట్లకు పైగా పోటీ చేసింది. అక్కడ బరిలోకి దిగిన 33 సీట్లలో 25గెలుచుకోగలగింది. ఈ పార్టీలతో పాటు సజ్జద్​ లోన్​ నేతృత్వంలో పీపుల్స్​ కాన్ఫరెన్స్​ తమ అదృష్టం పరిక్షించుకుంటోంది. మాజీ కాంగ్రెస్​ నేత, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్​ పార్టీ(డీపీఏపీ), అల్తాఫ్​ బుఖారీ నేతృత్వంలో ఆప్నీ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.

జమ్ముకశ్మీర్​లో స్థానిక పార్టీల 'ఫ్రీ కరెంట్' జపం - ఈ హామీ ఓట్లు రాలుస్తుందా? - Jammu And Kashmir Elections

వేడెక్కిన జమ్ముకశ్మీర్​ రాజకీయం- కాంగ్రెస్​, ఎన్​సీ పొత్తుతో కుదేలైన PDP! - Jammu Kashmir Assembly Elections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.