ETV Bharat / bharat

దిల్లీలో ఆప్​ను ఊడ్చేసిన బీజేపీ - 27ఏళ్ల తర్వాత కమల వికాసం - BJP WON DELHI ELECTIONS 2025

దిలీల్లో కేజ్రీ'వాల్'ను బద్ధలుగొట్టిన బీజేపీ- 27ఏళ్ల తర్వాత ఘన విజయం

BJP Won Delhi Elections 2025
BJP Won Delhi Elections 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2025, 3:05 PM IST

BJP Won Delhi Elections 2025 : దిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ- బీజేపీ ఘన విజయం సాధించింది. వరుసగా మూడుసార్లు గెలిచిన ఆప్​​ను గద్దె దించి 27 ఏళ్ల తర్వాత దిల్లీ కోటపై ఎగిరిన కాషాయజెండా ఎగురవేసింది. 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న దిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్​ ఫిగర్​ను సునాయాసంగా దాటింది. బీజేపీ దెబ్బకు ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ సహా ఆ పార్టీ అగ్రనేతలు ఓటమి పాలయ్యారు. ఆప్‌ కంచుకోటలను బీజేపీ అభ్యర్థులు బద్దలుకొట్టారు. గత ఎన్నికల్లో 62 సీట్లు గెలిచిన ఆప్​ ఈసారి ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ ఈసారీ​ ఖాతా తెరవలేదు.

సుదీర్ఘ కాలం పాటు దేశ రాజధానిలో అధికారం లేకుండా ఉన్న బీజేపీ ఈ సారి ఎలాగైనా గెలవాల్సిందేనని పక్కా ప్రణాళిక రూపొందించుకుంది. ఏ ఒక్క అవకాశాన్నీ వదులు కోలేదు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచార వ్యూహాల వరకు బీజేపీ అధిష్ఠానం పక్కాగా పర్యవేక్షించింది. కేజ్రీవాల్​ను ఓడించిన పర్వేశ్‌ సాహిబ్‌ సింగ్‌ అభ్యర్థిత్వం కూడా బీజేపీ ఆచితూచి ప్రకటించింది.

బీజేపీకి అనకూలించిన అంశాలు

  • దిల్లీ లిక్కర్​ స్కామ్, గాలి కాలుష్యం, వరదలు, యమునా నది కాలుష్యం అంశాలపై ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేసింది. అవినీతి వ్యతిరేక పునాదులపై నిర్మితమైన ఆప్​పై అవినీతి ఆరోపణలను ప్రజలల్లోకి బలంగా తీసుకెళ్లడంలో బీజేపీ పెద్దల వ్యూహాలు ఫలించాయి.
  • తాము అమలు చేస్తున్న ఉచిత పథకాలే ప్రధాన అస్త్రంగా ఆప్​ ఎన్నికల బరిలోకి దిగింది. మిగతా సమస్యలపై తూతూమంత్రంగానే హామీలు గుప్పించింది. అయితే గతే రెండు పర్యాయాలుగా ఉన్న ప్రభుత్వం వ్యతిరేకతకు తోడు బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో ఆప్​నకు పోటీగా ఉచితాలు ప్రకటించింది. ఇది వరకే అమలులో ఉన్న పథకాలను తొలగించమని, అభివృద్ధి మంత్రాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది.
  • బూత్​ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సంస్థగతంగా పక్క ప్రణాళిక రూపొందించుకుంది బీజేపీ. అగ్రనేతలను ఇంఛార్జులుగా నియమించింది. దిల్లీ ప్రజలు క్షేత్ర స్థాయిలో అనుభవిస్తున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసింది. స్థానిక సంక్షేమ సంఘాల స్థాయిల్లో వాట్సాప్​, సోషల్​ మీడియా ద్వారా సమస్యలకు ప్రజలకు అవగాహన కల్పించింది.
  • తమకు ఓటు వేస్తారనుకున్న ఏ ఒక్క ఓటరు మిస్​ కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. సొంతూర్లకు వెళ్లినవారిని ఫోన్లు చేసి మరీ రప్పించే ప్రయత్నం చేసింది బీజేపీ. దీనికి తోడు ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీ హవా బీజేపీకి అనుకూలించింది.
  • మధ్యతరగతి ప్రజలపై బీజేపీ ప్రధానంగా దృష్టిసారించింది. ఆఖరి నిమిషంలో- వారికి ఉపశమనం కలిగించేలా రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం కూడా బీజేపీకి ప్లస్ అయింది.
  • కాలుష్యంతో పాటు దిల్లీ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు రోడ్లు, సీవరేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం. ఈ పరిస్థితికి దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​ అడ్డుపడడమే కారణం అని ఆప్​ ఆరోపించింది. అయితే, రాష్ట్రం, కేంద్రంలో బీజేపీ ఉంటే పనులు సులువుగా జరుగుతాయనే భావన దిల్లీ ప్రజల్లో కలగడం బీజేపీకి అనుకూలించింది. ఇలాంటి సమస్యలను ఆప్​ నుంచి బయటకు వచ్చి స్వాతీ మల్లివాల్​ వంటి వారు కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఆప్​ పాలనలో అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వాన్ని ఎండగట్టారు.

BJP Won Delhi Elections 2025 : దిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ- బీజేపీ ఘన విజయం సాధించింది. వరుసగా మూడుసార్లు గెలిచిన ఆప్​​ను గద్దె దించి 27 ఏళ్ల తర్వాత దిల్లీ కోటపై ఎగిరిన కాషాయజెండా ఎగురవేసింది. 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న దిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్​ ఫిగర్​ను సునాయాసంగా దాటింది. బీజేపీ దెబ్బకు ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ సహా ఆ పార్టీ అగ్రనేతలు ఓటమి పాలయ్యారు. ఆప్‌ కంచుకోటలను బీజేపీ అభ్యర్థులు బద్దలుకొట్టారు. గత ఎన్నికల్లో 62 సీట్లు గెలిచిన ఆప్​ ఈసారి ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ ఈసారీ​ ఖాతా తెరవలేదు.

సుదీర్ఘ కాలం పాటు దేశ రాజధానిలో అధికారం లేకుండా ఉన్న బీజేపీ ఈ సారి ఎలాగైనా గెలవాల్సిందేనని పక్కా ప్రణాళిక రూపొందించుకుంది. ఏ ఒక్క అవకాశాన్నీ వదులు కోలేదు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచార వ్యూహాల వరకు బీజేపీ అధిష్ఠానం పక్కాగా పర్యవేక్షించింది. కేజ్రీవాల్​ను ఓడించిన పర్వేశ్‌ సాహిబ్‌ సింగ్‌ అభ్యర్థిత్వం కూడా బీజేపీ ఆచితూచి ప్రకటించింది.

బీజేపీకి అనకూలించిన అంశాలు

  • దిల్లీ లిక్కర్​ స్కామ్, గాలి కాలుష్యం, వరదలు, యమునా నది కాలుష్యం అంశాలపై ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేసింది. అవినీతి వ్యతిరేక పునాదులపై నిర్మితమైన ఆప్​పై అవినీతి ఆరోపణలను ప్రజలల్లోకి బలంగా తీసుకెళ్లడంలో బీజేపీ పెద్దల వ్యూహాలు ఫలించాయి.
  • తాము అమలు చేస్తున్న ఉచిత పథకాలే ప్రధాన అస్త్రంగా ఆప్​ ఎన్నికల బరిలోకి దిగింది. మిగతా సమస్యలపై తూతూమంత్రంగానే హామీలు గుప్పించింది. అయితే గతే రెండు పర్యాయాలుగా ఉన్న ప్రభుత్వం వ్యతిరేకతకు తోడు బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో ఆప్​నకు పోటీగా ఉచితాలు ప్రకటించింది. ఇది వరకే అమలులో ఉన్న పథకాలను తొలగించమని, అభివృద్ధి మంత్రాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది.
  • బూత్​ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సంస్థగతంగా పక్క ప్రణాళిక రూపొందించుకుంది బీజేపీ. అగ్రనేతలను ఇంఛార్జులుగా నియమించింది. దిల్లీ ప్రజలు క్షేత్ర స్థాయిలో అనుభవిస్తున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసింది. స్థానిక సంక్షేమ సంఘాల స్థాయిల్లో వాట్సాప్​, సోషల్​ మీడియా ద్వారా సమస్యలకు ప్రజలకు అవగాహన కల్పించింది.
  • తమకు ఓటు వేస్తారనుకున్న ఏ ఒక్క ఓటరు మిస్​ కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. సొంతూర్లకు వెళ్లినవారిని ఫోన్లు చేసి మరీ రప్పించే ప్రయత్నం చేసింది బీజేపీ. దీనికి తోడు ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీ హవా బీజేపీకి అనుకూలించింది.
  • మధ్యతరగతి ప్రజలపై బీజేపీ ప్రధానంగా దృష్టిసారించింది. ఆఖరి నిమిషంలో- వారికి ఉపశమనం కలిగించేలా రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం కూడా బీజేపీకి ప్లస్ అయింది.
  • కాలుష్యంతో పాటు దిల్లీ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు రోడ్లు, సీవరేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం. ఈ పరిస్థితికి దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​ అడ్డుపడడమే కారణం అని ఆప్​ ఆరోపించింది. అయితే, రాష్ట్రం, కేంద్రంలో బీజేపీ ఉంటే పనులు సులువుగా జరుగుతాయనే భావన దిల్లీ ప్రజల్లో కలగడం బీజేపీకి అనుకూలించింది. ఇలాంటి సమస్యలను ఆప్​ నుంచి బయటకు వచ్చి స్వాతీ మల్లివాల్​ వంటి వారు కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఆప్​ పాలనలో అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వాన్ని ఎండగట్టారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.