అఫ్గానిస్థాన్లో తాలిబన్ల ఏరివేత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో.. 385 మంది తాలిబన్లను సైన్యం మట్టుబెట్టింది. మరో 210 మంది గాయపరిచింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫవాద్ అమన్.. ట్విట్టర్ వేదికగా తెలిపారు.
"నంగ్రాహార్, లోగర్, గజ్నీ, పక్తికా, మెయిడెన్ వార్డాక్, కందహార్, హేరాత్, ఫరా, జోవ్జాన్, సమంగన్, హెల్మాండ్, తాఖర్, భగ్లాన్, కాపిసా రాష్ట్రాల్లో సైన్యం చేపట్టిన గాలింపుల్లో 385 మంది తాలిబన్లను గడచిన 24 గంటల్లో సైన్యం మట్టుబెట్టింది. మరో 210 మందిని గాయపరిచింది. ఫైజ్-అబద్ నగరం, బాదాఖాసాన్, తాలిఖన్, తక్హార్ నగరాలపై తాలిబన్లు జరిపిన దాడులను సైన్యం తిప్పికొట్టింది.
-ఫవాద్ అమన్, అఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి