వాషింగ్ మెషిన్ బాగు చేయించలేదని - ఫ్యాన్కు ఉరివేసుకుని భార్య ఆత్మహత్య
Published : Sep 2, 2024, 12:25 PM IST
Wife Commits Suicide in Hyderabad : వాషింగ్ మెషిన్కు మరమ్మతులు చేయించలేదని భర్తపై కోపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన రాజ్కుమార్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పని చేస్తున్నాడు. భార్య సంగీత ప్రియతో కలిసి బీహెచ్ఎల్ సైబర్ కాలనీలో ఉంటున్నాడు. వాషింగ్ మెషిన్ బాగు చేయించకపోవడంతో పాటు ఇంట్లోకి సరుకులు తేవడం లేదంటూ భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. కోపంతో పడక గదిలోకి వెళ్లి సంగీత ఫ్యాన్కు ఉరేసుకుంది. కోపంగా గదిలోకి వెళ్లిన భార్య ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో భర్త తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లాడు. అప్పటికే భార్య ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించగా, కిందకు దింపి సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.