ETV Bharat / snippets

ఆర్టీసీ బస్సులో దంపతుల నుంచి రూ. 5 లక్షలు చోరీ

author img

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

FAMILY LOSS FIVE LAKHS IN RTC BUS
Chori in RTC Bus (ETV Bharat)

Chori in RTC Bus : ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల నుంచి రూ.5 లక్షలు చోరీ అయిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లిలో జరగింది. కామారెడ్డి జిల్లా గోపాల్ పేటకు చెందిన రెహనా బేగం, షఫీ దంపతులు రూ.5 లక్షల నగదుతో బాన్సువాడ డిపోనకు చెందిన ఎక్స్​ప్రెస్ బస్సులో గోపాల్ పేటకు బయలు దేరారు. బస్సులో ఎక్కువ మంది ఉండడంతో సీటు దొరకక షాపూర్​నగర్ నుంచి నర్సాపూర్ వరకు నిల్చోనే ప్రయాణం చేశారు.

నర్సాపూర్ బస్టాండ్​ రాగానే బస్సులో సీటు దొరికిన సమయంలో రెహనా బేగం డబ్బులు ఉన్న బ్యాగు పక్కనపెట్టి తన బిడ్డకు పాలిచ్చింది. ఈ క్రమంలో బ్యాగు చోరీ గురైంది. దీంతో బస్సు ఆపించి అందులో ఉన్న ప్రయాణికులను చెక్ చేయగా బ్యాగ్ ఆచూకీ దొరకలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాకి చేరుకుని సీసీ ఫుటేజీ ద్వారా దొంగిలించిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

Chori in RTC Bus : ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల నుంచి రూ.5 లక్షలు చోరీ అయిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లిలో జరగింది. కామారెడ్డి జిల్లా గోపాల్ పేటకు చెందిన రెహనా బేగం, షఫీ దంపతులు రూ.5 లక్షల నగదుతో బాన్సువాడ డిపోనకు చెందిన ఎక్స్​ప్రెస్ బస్సులో గోపాల్ పేటకు బయలు దేరారు. బస్సులో ఎక్కువ మంది ఉండడంతో సీటు దొరకక షాపూర్​నగర్ నుంచి నర్సాపూర్ వరకు నిల్చోనే ప్రయాణం చేశారు.

నర్సాపూర్ బస్టాండ్​ రాగానే బస్సులో సీటు దొరికిన సమయంలో రెహనా బేగం డబ్బులు ఉన్న బ్యాగు పక్కనపెట్టి తన బిడ్డకు పాలిచ్చింది. ఈ క్రమంలో బ్యాగు చోరీ గురైంది. దీంతో బస్సు ఆపించి అందులో ఉన్న ప్రయాణికులను చెక్ చేయగా బ్యాగ్ ఆచూకీ దొరకలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాకి చేరుకుని సీసీ ఫుటేజీ ద్వారా దొంగిలించిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.