Detonators Blast in YSR District : మంచం కింద డిటోనేటర్లు పెట్టి వీఆర్ఏను చంపిన ఘటన ఏపీలోని వైఎస్సార్ జిల్లా వేముల మండలంలో చోటుచేసుకుంది. దీంతో వీఆర్ఏ అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి వీఆర్ఏ నరసింహ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బాబు అనే వ్యక్తి మంచం కింద డిటోనేటర్లు పెట్టి పేల్చాడు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్నారు.
Published : 5 hours ago
డిటోనేటర్లు పెట్టి వీఆర్ఏ హత్య - వివాహేతర సంబంధమే కారణం!
క్షతగాత్రురాలిని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమార్తె బాబు అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేసింది. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గనుల్లో ఉపయోగించే డిటోనేటర్లు బ్యాటరీతో పేల్చినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు బాబు, నరసింహల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని, మృతుడి భార్యతో నిందితుడికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో నరసింహ అతడితో తరచూ గొడవలకు దిగేవారని స్థానికులు చెప్పారు.