national

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2024, 10:41 AM IST

ETV Bharat / snippets

ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ - ఇద్దరు మృతి, మరో 11 మందికి గాయాలు

LORRY BUS ACCIDENT IN CHOUTUPPAL
Two Man Died in Road Accident in Choutuppal (ETV Bharat)

Two Man Died in Road Accident in Choutuppal :యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయాల పాలయ్యారు. కందుకూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో రోడ్డు పక్కన ఆపారు. తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి వచ్చి బలంగా ఢీ కొట్టింది.

దీంతో బస్సులో నిద్రిస్తున్న ఇద్దరు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన సతీశ్​ కుమార్, తేజగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details